India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కావలి సమీపంలోని జగనన్న లే ఔట్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ముసునూరుకు చెందిన ముప్పవరపు శాంతి కుమార్(35)గా పోలీసులు గుర్తించారు. ఓ యువతితో కలిసి జగనన్న లేఔట్కి వచ్చిన శాంతి కుమార్, యువతి వెళ్లిపోయిన కాసేపటికి వచ్చి చూసేసరికి మృతి చెందినట్లు స్థానిక మహిళ తెలిపారు. ఘటన స్థలానికి కావలి DSP శ్రీధర్, రూరల్ సీఐ రాజేశ్వరరావు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మాదకద్రవ్యాల వ్యసనానికి లోనైన వ్యక్తి జీవితం అంధకారంలోకి వెళ్తుందని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని పలు కళాశాలలో ఆయన మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, సమయాన్ని వినియోగించుకుంటూ బాగా చదవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు అందరు బూత్ స్థాయి అధికారులచే ఈ నెల 23, 24 తేదీల్లో ఓటర్లు వారి పేరు ఓటర్ల జాబితాలో నమోదైందో లేదో పరిశీలించుకోవాలని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ఆ రోజులలో బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ముసాయిదా ఓటర్ల జాబితా, ఫారం 6, ఫారం 7, ఫారం 8 లతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

YCP అధినేత జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అవినీతికి పాల్పడటంలో ఆయన ఓ గ్లోబల్ స్టార్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు CBI స్థాయి విచారణకే పరిమితం అయిన జగన్.. ఇప్పుడు అమెరికా FBI స్థాయికి ఎదిగారన్నారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానంటూ ‘X’లో పోస్ట్ చేశారు.

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో ఇంటర్ (బైపీసీ) విద్యార్థులకు డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రిన్సిపల్ వీరవెంకట నాగరాజ మన్నార్ తెలిపారు. డిప్లొమా ల్యాబ్, అనస్థీషియన్, ఆప్తాల్మిక్, ఆప్తోమెట్రీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్స్ కోర్సులలో 95 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 2 తేదీలోపు రూ.100లు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ప్రపంచ స్థాయి జ్ఞాపకశక్తి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విజేత జై బల్దియ జైన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అభినందించారు. బల్దియా జైన్ 51 సెకండ్లలో 125 తేదీలను గుర్తుపెట్టుకుని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారు. మానసిక గణన విభాగంలో అద్భుత విజయం సాధించిన బల్దియా జైన్ భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచారని కలెక్టర్ అభినందించారు.

కడలి అలల పైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే.. ఇంతచేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం, బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం ఉండదు.. మరి గడియలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతు పట్టని రోజుల తరబడి ప్రయాణం.. అయినా భగవంతుడిపై భారం వేసి, సముద్రంపై నమ్మకం ఉంచి, బతుకుపోరు సాగిస్తారు మత్స్యకారులు.

గత ప్రభుత్వం హయాంలో YS జగన్ తన హంగులు, ఆర్భాటాల కోసం ఏకంగా రూ.5 వేల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పాసు పుస్తకాలపై బొమ్మలు, రుషికొండ ప్యాలెస్ నిర్మాణంతో ప్రజల సొమ్మును జగన్ మంచి నీళ్లలా ఖర్చు చేశారని మండిపడ్డారు. జగన్ నిర్వాకంతో ప్రజలకు బడ్జెట్ మీద ఆశలు పోయాయన్నారు. అందుకే YCPని ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని ఆయన స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రాపూరు పంచాయతీ ఇన్ఛార్జి కార్యదర్శి చెంచయ్యను లైంగిక వేధింపుల అభియోగాలతో, కృష్ణపట్నం పంచాయతీ కార్యదర్శులు మస్తానయ్య, రాజశేఖర్లను నిధులు దుర్వినియోగం అభియోగాలపై కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నెల్లూరు జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రాపూరు పంచాయతీ ఇన్ఛార్జి కార్యదర్శి చెంచయ్యను లైంగిక వేధింపుల అభియోగాలతో, కృష్ణపట్నం పంచాయతీ కార్యదర్శులు మస్తానయ్య, రాజశేఖర్లను నిధులు దుర్వినియోగం అభియోగాలపై కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.