India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సోమవారం రాత్రి ఆత్మకూరు పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దుస్తులను ఇస్త్రీ చేశారు. స్థానికులతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి వాలంటీర్లు రాజీనామాలు చేయవద్దని.. నెల్లూరు రూరల్ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే వారిని చంద్రబాబు కొనసాగిస్తారని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో కోటంరెడ్డి మాట్లాడారు.
ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ సీపీఎం అభ్యర్థిగా మూలం రమేశ్కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, నెల్లూరు సిటీ నుంచి వైసీపీ బరిలోఎండీ ఖలీల్, కూటమి అభ్యర్థిగా పొంగూరు నారాయణ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
నెల్లూరు జిల్లాలోని వింజమూరు మండలం చాకలికొండలో టీడీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేశ్కు మద్దతుగా ప్రచారం జరిగింది. ఇందులో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వం ద్వారా జీతం తీసుకునే ఏ ఒక్కరూ ప్రచారాల్లో పాల్గొన వద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయినప్పటికీ కొందరు ఇలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గన్మెన్గా పని చేస్తున్నట్లు సమాచారం.
గతంలో సంక్రాంతి, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇచ్చేవారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న సలహాదారుల నెల జీతం ఆపేస్తే పేద ప్రజలకు అన్ని కానుకలు పంపిణీ చేయవచ్చన్నారు. సోమవారం సాయంత్రం ఉప్పుటూరు, కందమూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రాణం ఉన్నంతవరకు తాను CM జగన్తోనే ఉంటానని వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి(VSR) అన్నారు. 35 ఏళ్లుగా జగన్ కుటుంబంతో ఉన్నానని.. ఇకపై కూడా ఉంటానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఆ కుటుంబంతో తన బంధం శాశ్వతమని పేర్కొన్నారు. వేమిరెడ్డి దంపతుల్లా తనకు వెన్నుపోటు పొడవడం, పార్టీలు మారడం తెలియదన్నారు. విడవలూరు రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పి K.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాలలో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమ నగదు, మద్యం, నాటు సారా, గంజాయి మొదలగు ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు.
రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన నెల్లూరు- వేదాయపాలెం రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం జరిగింది. రైల్వే ఎస్సై మాలకొండయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పలు మండలాలలోని ప్రజలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ను ప్రకటించింది. కలిగిరి 45.8, జలదంకి 45.0, కోవూరు44,1, మనుబోలు 44.8, వెంకటాచలం 44.6, సైదాపురం 42.7, తోటపల్లిగూడూరు42.0, వరికుంటపాడు 43.9, వింజమూరు 42.9, సూళ్లూరుపేట 44.7, తడ 40.5, పెళ్లకూరు 42.3, ఓజిలి 42.9, నాయుడుపేట 43.5, కోట 42.9, దొరవారిసత్రం 42.8, గూడూరు 44.8, చిల్లకూరు 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకూరుపేటకు చెందిన సుబ్బరత్నమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త మాట వినకుండా నిత్యం ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తుండేది. ఈక్రమంలో శనివారం కూలి పనికి వెళ్తున్నట్లు భర్తకు చెప్పి తిరిగి రాలేదు. ఆదివారం కోడూరుపాడులోని టెంకాయతోటలో సుబ్బరత్నమ్మ మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.