India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరుకు చెందిన సురేశ్ బాబు 2022లో ఓ ఎలక్ట్రికల్ స్కూటర్ కొన్నారు. మైలేజీ రాకపోగా పది రోజులకే సెన్సార్ పనిచేయలేదు. బ్రేకులు ఫెయిలయ్యాయి. మరమ్మతులు చేయాలని లేదా కొత్త స్కూటర్ ఇవ్వాలని పలుమార్లు బాధితుడు కోరినా కంపెనీ నుంచి స్పందించక పోవడంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 45 రోజుల్లో కొత్త స్కూటర్ ఇవ్వడంతో పాటు రూ.5 వేలు ఖర్చుల నిమిత్తం చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులందరూ మారిపోయారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి ముఖాముఖి తలపడిన నేతలెవరూ ఈసారి పరస్పరం పోటీపడే పరిస్థితి లేకుండాపోయింది. పోటీలో ఒకరు పాత వారే అయినప్పటికీ మరొకరు మాత్రం వారికి కొత్త ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. కొన్ని చోట్ల రెండూ కొత్తముఖాలే కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి ఒక్క సర్వేపల్లి మినహా మిగిలిన అన్ని చోట్లా ఇదే పరిస్థితి.
నెల్లూరు జిల్లాలోని కోవూరు అసెంబ్లీ స్థానానికి 1962 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అత్యధికంగా నల్లపరెడ్డి కుటుంబ సభ్యులే ఇక్కడ గెలిచారు. తాజా ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ప్రసన్న కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. ప్రశాంతి రెడ్డి 62 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతుందేమో చూడాలి మరి..
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు గిరిప్రదక్షిణ, అంకురార్పణతో రేపు ప్రారంభం కానున్నాయి. 20న తిరుమంజనం, ధ్వజారోహణ, శేషవాహన సేవ, 21న హనుమంత సేవ, 22న ఉదయం మోహినీ ఉత్సవం, రాత్రికి గరుడసేవ, 23 ఉదయం మొక్కుబడులు, సాయంత్రం తెప్పోత్సవం, గజ వాహన సేవ, 24న ఉదయం కల్యాణం, సాయంత్రం రథోత్సవం, రాత్రికి అశ్వవాహన సేవ, 25న సాయంత్రం పుష్పయాగం, రాత్రి ఏకాంతసేవతో ఉత్సవాలు పూర్తవుతాయి.
కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డిని కాదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చంద్రబాబు ఖరారు చేశారు. అలకబూనిన పోలంరెడ్డి కచ్చితంగా కోవూరు నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో టీడీపీ పెద్దలు స్పందించి పోలంరెడ్డిని నిన్న విజయవాడలో చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఛైర్మన్, పార్టీ పదవి, 2027లో MLC హామీ ఇస్తానని పోలంరెడ్డికి హమీ ఇచ్చినట్లు సమాచారం.
ప్రతి సోమవారం నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నేడు రద్దు చేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు విషయాన్ని గుర్తించి.. సహకరించాలని కోరారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 32,746 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 28,080 మంది రెగ్యులర్, 4,666 మంది ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 7 సమస్యాత్మక కేంద్రాలు(సీతారామపురం, నారాయణ రెడ్డిపేట, కలువాయి ఏ, బీ సెంటర్లు, సౌత్ మోపూరు, మర్రిపాడు, రేవూరు) గుర్తించారు. వీటిలో 4 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని డీఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. రోజూ ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తెలిపారు. ఆదివారం ఉదయం గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారులు ఆరోగ్య రాణి, సునీతతో కలిసి పరిశీలించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడు ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
Sorry, no posts matched your criteria.