Nellore

News December 21, 2024

నాయుడుపేట: నదిలో కొట్టుకొచ్చిన అస్థిపంజరం

image

నాయుడుపేటలో అస్థిపంజరం కలకలం రేపింది. స్వర్ణముఖి నదిలో కొట్టుకొచ్చిన మనిషి అస్తిపంజరాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 21, 2024

నెల్లూరు: బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి

image

బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి శిక్ష పడింది. బాలాయపల్లిలోని ఓ బాలికను జయంపులో దుకాణం నడుపుతున్న ఓజిలి(M) ఇనుగుంటకు చెందిన సుబ్బారావు ప్రేమ పేరుతో నమ్మించాడు. సుబ్రహ్మణ్యం, వెంటకయ్య, వాణి సహయంతో 2015లో బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో నలుగురికి పదేళ్ల జైలు, రూ.22వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ నిన్న తీర్పుచెప్పారు.

News December 21, 2024

నిజాయతీగా పనిచేయండి: అబ్దుల్ అజీజ్

image

వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్లు నిజాయితీగా పనిచేయాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ సూచించారు. 26 జిల్లాల ఇన్స్పెక్టర్ ఆఫ్ ఆడిటర్స్‌తో ఆయన నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… వక్ఫ్ ఆస్తులతో సంపద సృష్టించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

News December 20, 2024

నెల్లూరు: ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

image

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022 కు వాట్సాప్ చేయండి.

News December 20, 2024

నెల్లూరు: చెల్లికి గర్భం చేసిన అన్న

image

పొక్సో కేసులో నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ జడ్జి సిరిపిరెడ్డి సుమ గురువారం తీర్పు వెల్లడించారు. అల్లూరు ప్రాంతానికి చెందిన చెంబేటి మురళి తన చిన్నమ్మ కూతురిపై మద్యంమత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికకు గర్భం రావడంతో పొక్సో కేసు నమోదైంది. జడ్జి విచారణ చేపట్టి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడినందుకు పోలీసులను ఎస్పీ అభినందించారు.

News December 20, 2024

నెల్లూరుకు చేరుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నెల్లూరు నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఎస్పీ కృష్ణకాంతోపాటే ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే  అందజేసి అభినందనలు తెలిపారు. 

News December 19, 2024

నెల్లూరు: సీఎంతో అబ్దుల్ అజీజ్ భేటీ

image

ముఖ్యమంత్రి చంద్రబాబుతో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజిజ్ గురువారం భేటీ అయ్యారు. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి పలు కీలక అంశాలపై వారు చర్చించారు. వక్ఫ్ బోర్డు నిర్వహణ, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు.  

News December 19, 2024

గూడూరులో దుకాణానికి వచ్చిన బాలిక పట్ల అసభ్య ప్రవర్తన

image

11 ఏళ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో ఓ వ్యక్తికి గూడూరు కోర్టు జైలు శిక్ష విధించింది. గూడూరు రాణీపేట పేటకు చెందిన జనార్దన్ చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణానికి వచ్చిన బాలిక పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈకేసులో సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి 5 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధించింది.

News December 19, 2024

నెల్లూరు: హామీలు అమలుపై ఎమ్మెల్యేకు ఆయన కుమారుడు వినతి

image

ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్‌కు ఆయన తనయుడు కాకర్ల సంహిత్ వినతి పత్రం అందించారు. అమెరికాలో చదువుతూ నియోజకవర్గానికి వచ్చిన సంహిత్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు, గుర్తించిన సమస్యలపై వినతి పత్రం అందించారు. ఎన్నికల ప్రచారంలో తనదృష్టికి వచ్చిన సమస్యలపై ఆయనకు వినతిపత్రంలో అందజేసి పరిష్కరించాలని కోరారు. ఆయన చొరవపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 18, 2024

గూడూరు : మెమూ రైలు వేళల్లో మార్పులు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట నుంచి నెల్లూరుకు ఉదయం వెళ్లే మెమూ రైలు వేళల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం. 06745 గతంలో సూళ్లూరుపేట నుంచి ఉదయం 7.55 కు బయలుదేరేది. ఇప్పుడు 8.10కి బయలుదేరుతుంది. అలానే గూడూరుకు 8.55 కు చేరుకునే ఈబండి తాజాగా 9.27 కు చేరుకుంటుంది. నెల్లూరుకు గతంలో 10.05 కు చేరుకునే రైలు ఇప్పుడు 10.30 కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.