India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉదయగిరి అటవీ రేంజి పరిధిలోని అడవుల్లోకి ప్రజలు వెళ్లేందుకు జంకుతున్నారు. ఆ శాఖ జిల్లా అధికారులు తాజాగా వెలుగొండ అడవుల్లో రెండు పులులు సంచరిస్తున్నాయని నిర్ధారించడంతో సమీప ప్రాంతాల ప్రజలుఆందోళన చెందుతున్నారు. వెలుగొండ అడవులు రాపూర్ వరకు వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రాంతంలో పశువుల కాపరులు అడవుల్లోకి నిత్యం వెళుతుంటారు. పులుల సంచారంతో అడవుల వైపు కన్నెత్తి చూడడం లేదు.
గూడూరు మీదుగా వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరిగే నాన్ ఇంటర్ లాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు3 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ మెమూ, ఆగస్టు 4-11 వరకు విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ ప్రెస్, ఆగస్టు 5-10 వరకు చెన్నై సెంట్రల్-విజయవాడ జనశతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడారు. గురువారం నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన విజయవంతంగా జరిగిందని వైసీపీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ పర్యటనతో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు.మళ్లీ వైసీపీ పుంజుకుంటోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం సంతపేటలోని ఆనం నివాసంలో మంత్రిని పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి ఆనంకు నారాయణ పుష్పగుచ్ఛం అందచేసి శాలువాతో సత్కరించారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నట్లు సమాచారం.
జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు.. అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు డీఈఓ రామారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. nationalawards toteachers. education. gov. in వెబ్సైట్లో ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హతలు, ఇతర వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలని డీఈవో సూచించారు.
అనంతసాగరం మండలం, చిలకలమర్రి గ్రామానికి చెందిన డబ్బుకుంట శీనయ్య అనే కౌలు రైతు పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. బుధవారం రాత్రి నీళ్లు వదిలేందుకు పొలానికి వెళ్ళగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆత్మకూరు వైద్యశాలకు తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లాలో మొదటిసారి పెద్దపులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మర్రిపాడు మండలం వెలుగొండ అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి, చిరుతపులి సంచారం కనిపించినట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అడవుల్లోకి ఒంటరిగా వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం నెల్లూరులోని తన క్యాంప్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం ప్రజల నుంచి వినతి పత్రాలు, విజ్ఞాపనలు స్వీకరిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయ ప్రతినిధులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
నెల్లూరు రూరల్ రామకోటయ్య నగర్లో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు నీతురాజ్ (23) అనే వ్యక్తిని గొంతు కోసి నడి రోడ్డుపైనే వదిలేసి పారిపోయారు. దీంతో నీతూరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి రామకోటయ్య నగర్ సుజాత రావు కాంప్లెక్స్ కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద జాతీయ రహదారిపై కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వరికుంటపాడు మండల విద్యా శాఖా ధికారి షావుద్దీన్ కి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన ఎంఈఓను వేరే వాహనంలో ఆసుపత్రి తరలించారు. విధులు నిర్వహించుకొని తిరిగి కనిగిరిలోనే తన నివాసానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.