India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరులోని వాకర్స్ రోడ్డుకు చెందిన మహిళలు లక్కీ వైన్ షాప్కు వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈనెల 16వ తేదీ సాయంత్రం లక్కీ వైన్ షాప్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆందోళన చేస్తున్న మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారని అన్నారు. డబ్బు చూపిస్తూ సైగలు చేస్తూ వీడియోలు, ఫొటోలు తీశారని మహిళలు చిన్న బజారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా నెల్లూరు జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఆదేశించారు. తీర ప్రాంత, పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని, బోట్లు, వలలు జాగ్రత్త పరచుకోవాలన్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులలో ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంస్థలకు మొదటి విడత అందించిన నిధులు ఎన్ని అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి లోక్సభలో ప్రశ్నించారు. నిధులు విడుదలైన విషయం వాస్తవం అయితే ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసిన టైడ్, అన్ టైడ్ గ్రాంట్ల వివరాలు తెలియజేయాలని కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ భఘేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
నుడా ఛైర్మన్గా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నెల్లూరు నర్తకి సెంటర్ నుంచి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ తదితరలు పాల్గొన్నారు. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
కోట మండలం మద్దాలి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామంలోని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన పెంపుడు కుక్కను బయట కట్టేసి నిద్రిస్తున్న సమయంలో కొండచిలువ అతని ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. కుక్క అడ్డుకోవడంతో కొండచిలువ దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రజలు భయపడుతున్నారు.
ఆత్మకూరు జిల్లా ఆస్పత్రి డైస్ సెంటర్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు DMHO పెంచలయ్య తెలిపారు. వివరాలను spsnellore.ap.gov.in/notice/recruitment అనే వెబ్సైట్లో అప్లై చేయాలన్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను ఈనెల 19వ తేదీ లోపు పెద్దాస్పత్రిలో డైస్ కేంద్రంలో అందించాలన్నారు. జీతం రూ.1,10,000 ఉంటుందన్నారు.
108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామని మంత్రి వై.సత్య కుమార్ యాదవ్ తెలిపారు.108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ప్రతినిధి వర్గం రాష్ట్ర అధ్యక్షుడు బల్లి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రిని కలిశారు. 108 ఉద్యోగుల ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
నెల్లూరు గ్రామీణ భక్తవత్సల నగర్లోని కేఎన్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో సోమవారం10(A) నావెల్ NCCయూనిట్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో NCC సెకండ్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు, ఆ పాఠశాల NCC క్యాడెట్లు పాల్గొని త్రివర్ణ పతాకాలు చేతపట్టి భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు నివాళులర్పించారు.
రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత, వర్షాల వల్ల నిమ్మకాయల వినియోగం తగ్గి రైతులకు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా మూడు రోజుల నుంచి ధర తగ్గుముఖం పట్టింది. కిలోల లెక్కన రూ.15 నుంచి రూ.20 మాత్రమే ధర పలుకుతోంది. సంక్రాంతి వరకు ఇవే ధరలు ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పెళ్లకూరు మండలంలో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ గ్రామంలో మూడు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సుధాకర్ అనే వ్యక్తి ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు గుర్తించి మందలించారు. చిన్నారి తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాయుడుపేట DSP చెంచుబాబు, SI నాగరాజు విచారణ చేపట్టి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.