Nellore

News December 16, 2024

భయం గుప్పిట్లో నెల్లూరు

image

ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గతంలో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. బుధ, గురు వారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD హెచ్చరించింది. దీంతో ఓ వైపు వర్షం, మరోవైపు చలితో నెల్లూరు ప్రజలు వణికిపోతున్నారు.

News December 16, 2024

నెల్లూరు: జాబ్ మేళాలో 2500 మందికి ఉద్యోగాలు

image

నెల్లూరు మండలంలోని కనుప్రత్తిపాడులో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళాలో 2500 మంది ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మేళాలో ఎంపికైన 800 మందికి ఆఫర్‌ లెటర్లు అందించారు. మిగిలిన వారికి సోమవారం పత్రాలను అందించనున్నట్లు వివరించారు.

News December 15, 2024

కోవూరు: రైలు నుంచి కిందపడి ఒకరు మృతి

image

కొవ్వూరు మండలం పడుగుపాడు ఇనమడుగు రైల్వే గేటు వద్ద ఇవాళ అస్సాంకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. సిల్చారు నుంచి తిరుచూరు వెళ్లే అరుణయ్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి ఆయన పొరపాటున కింద పడ్డాడు. ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.  బాధితుడి శరీరం రెండు భాగాలుగా వేరు పడింది. మృతుడిని అస్సాం రాష్ట్రం గోవిందపూర్ ప్రాంతానికి చెందిన షాలే అహ్మద్ (32)గా రైల్వే పోలీసులు గుర్తించారు. 

News December 15, 2024

ఉదయగిరిలో వెయ్యి మందికి పదవులు

image

ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ వ్యూహంతో 150 సాగునీటి సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ సాగునీటి సంఘాల ఎన్నికలలో సుమారు వెయ్యి మందికి పదవులు వచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్యే తొలి అడుగులోనే ఉదయగిరి కోటపై టీడీపీ జెండా ఎగురవేసి, అనంతరం జరిగిన ఈ ఎన్నికలలో రెపరెపలాడించారు. ఇదే జోరుతో భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని నాయకులు ఘంటాపదంగా చెబుతున్నారు.

News December 14, 2024

గూడూరు: రైలు ప్రమాద మృతురాలు గుర్తింపు

image

ఇవాళ ఉదయం ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడి <<14877003>>మృతి<<>> చెందిన మహిళ వివరాలను పోలీసులు గుర్తించారు. ఆమె పేరు సబిత ఆచార్య, ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. గూడూరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహన్ని వారి బంధువులకు అప్పజెప్పనున్నారు.

News December 14, 2024

నెల్లూరు : నెల్లూరు విజన్ 2047 ఆవిష్కరణ

image

స్వర్ణ్యాంద్ర విజన్ 2047 లో భాగంగా నెల్లూరు జిల్లా విజన్ 2047 ను జిల్లా కలెక్టర్ ఆనంద్ అభివృద్ధి ప్రణాళిక విడుదల చేశారు. 2029 నాటికి జిల్లా ‘GDP వృద్ధి 15% పెంపు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో, అదేవిధంగా సేవల రంగంలో 2047 నాటికి అత్యుత్తమ ఆరోగ్య సేవలను అందించడం, శిశుమరణాల రేటు తగ్గించడం, పోషణ లోపం తగ్గించడం లక్ష్య మన్నారు. అన్ని టూరిస్ట్ ప్రదేశాలను అభివృద్ధి చేయడం లక్ష్యమని అన్నారు.

News December 14, 2024

రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యువతి స్పాట్ డెడ్

image

శ్రీకాళహస్తి పట్టణం వీఎం పల్లి వద్ద వంతెనపై లారీ చక్రాల కింద పడి యువతి మృతి చెందింది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న లారీని తిరుపతి నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళ్తున్న నెల్లూరుకు చెందిన హేమలత (22) ఒవర్‌టేక్ చేసింది. ఈ క్రమంలో ఆమె బ్యాగు లారీకి తగిలి లారీ చక్రాల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News December 14, 2024

నెల్లూరు: కోడిగుడ్డు ధర రూ.10? 

image

నెల్లూరు జిల్లాలో కోడిగుడ్డు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం కోడిగుడ్డు ధర పలు ప్రాంతాల్లో రూ.7.50కు చేరింది. వారం రోజుల క్రితం వరకు ఈ ధర రూ.5 నుంచి రూ.6 వరకు ఉండేది. వచ్చే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గుడ్డు ధరలకు రెక్కలు వచ్చినట్లు స్థానికులు వాపోయారు. మరిన్ని రోజుల్లో ఈ ధర రూ.10కు చేరొచ్చని వ్యాపారులు వెల్లడించారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.  

News December 14, 2024

నేడు నెల్లూరు జిల్లాలో ఎన్నికలు

image

నేడు నెల్లూరు జిల్లాలోని 13 డిస్ట్రిబ్యూటరీ కాలువలు, 490 వాటర్ యూజర్ అసోసియేషన్లు, 3,698 టీసీలకు ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 2.95లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలకు 9,120 మంది సిబ్బందిని అధికారులు నియమించారు.

News December 13, 2024

నెల్లూరు: రేపు పాఠశాలలకు సెలవు రద్దు

image

రేపు రెండో శనివారం అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.బాలాజీ రావు తెలిపారు. అక్టోబర్ నెలలో వర్షాల వలన సెలవులు ఇచ్చినందున ఈ నిర్ణయం జిల్లా కలెక్టర్ అనుమతితో తీసుకోవడం జరిగిందన్నారు. సంవత్సరంలో 220 పని రోజులు కచ్చితంగా పాఠశాలలు పనిచేయవలసి ఉందని పేర్కొన్నారు.