India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఓ.ఆనంద్ గురువారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ కలెక్టర్ విద్యాధరి, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్, ఇన్ఛార్జ్ డీఆర్ఓ పద్మావతి స్వాగతం పలికారు. అనంతరం ఆయన అల్లూరు సీతారామ రాజు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇటీవల వెలుగొండ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కెమెరాలలో రెండు పులులను గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ అధికారి ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. ఈ పులులు నల్లమల అటవీ ప్రాంతం నుంచి వెలుగొండ అటవీ ప్రాంతాలకు వచ్చినట్లు గుర్తించారు. పులుల సంచారంతో పొంచి ఉన్న ప్రమాదకర పరిస్థితుల దృష్యా పశువులు, మేకలు, గొర్రెల కాపరులు అడవిలో వెళ్లద్దన్నారు.
ఏఎస్ పేట మండలం, జమ్మవరం గ్రామానికి చెందిన వెంకట్రావు (36) మంగళవారం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఆయన బంధువులు తెలిపారు. వెంకట్రావు మంగళవారం మరో ఇద్దరితో కలిసి బైక్పై వెళుతుండగా మర్రిగూడ మండలం, తమ్మిడిపల్లి గ్రామం వద్ద బైక్ అదుపు తప్పి సమాధిని ఢీకొంది. ఘటనలో బాలరాజు అక్కడికక్కడే మృతి చెందగా, వెంకట్రావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి.
జిల్లాకు ఇటీవల నూతంగా నియమితులైన కొత్త కలెక్టర్ ఒ.ఆనంద్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటులో వేగం పుంజుకోన్నట్లు పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. రాయపట్నం పోర్ట్, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, ఉక్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్ లిమిటెడ్ పరిశ్రమల పనుల్లో వేగం పెరగనున్నట్లు పలువురు ఆశిస్తున్నారు.
మాజీ సీఎం జగన్ నేడు నెల్లూరుకు రానున్నారు. తాడేపల్లి నుంచి బయలుదేరి ఉ.11.15 గంటలకు కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కనుపర్తిపాడుకు చేరుకొని హెలికాప్టర్ ద్వారా తాడేపల్లికి బయలుదేరుతారు.
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ నియమితులైన ఓ. ఆనంద్ బుధవారం విజయవాడ నుంచి నెల్లూరు చేరుకున్నారు. ఆయనకు చింతారెడ్డి పాలెం హైవే వద్ద నెల్లూరు రూరల్ తహసీల్దార్ సుబ్బారెడ్డి పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. గురువారం కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు.
కావలి పట్టణంలోని ఓ డాబా హోటల్ లో బుధవారం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటల్లో అపరిశుభ్ర వాతావరణం, తదితర తప్పిదాలను అధికారులు గుర్తించారు. రోజుల తరబడి మాంసం నిల్వ ఉండటంతో వెంటనే హోటల్ను సీజ్ చేసి గేట్లకు సీల్ వేశారు. వారు మాట్లాడుతూ.. హోటల్స్లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత పాటించాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. ముందుగా నెల్లూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో హెలిప్యాడ్ లాండ్ అవ్వనుండగా దానికి బదులు కనుపర్తి పాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రౌండ్లో లాండ్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. తాడేపల్లి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నెల్లూరు చేరుకోనున్నారు.
నెల్లూరు నూతన కలెక్టర్గా ఓ.ఆనంద్ నియమితులయ్యారు. తిరువనంతపురంలో ఆయన ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2016లో IASకు ఎంపికయ్యారు. తూ.గో జిల్లాలో ట్రైనీ కలెక్టర్గా పనిచేశారు. 2018లో గూడూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఆయనకు వివాహమైంది. తర్వాత పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్గా, ITDO పీవోగా, మన్యం జిల్లా జేసీగా పని చేశారు. ఆయన భార్య ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించడం విశేషం.
నెల్లూరు జిల్లాలో బడి బయట పిల్లలను గుర్తించేందుకు గతనెల 13వ తేదీన ‘నేను బడికి పోతా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిని ఈనెల 12వ తేదీ వరకు నిర్వహిస్తామని సమగ్ర శిక్ష ఏపీసీ ఉషారాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేసి వారి పిల్లలను బడిలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.