India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత అంతరిక్ష రంగంలో గత ఐదేళ్లలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేయాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కోరారు. బుధవారం ఈ మేరకు లోక్సభలో ఆయన పలు అంశాలపై వివరాలను ఆయన ఆరా తీశారు. ఇస్రోతో భాగస్వామ్యం కలిగి ఉన్న ప్రైవేటు కంపెనీల జాబితాను తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్లో ఒన్ నేషన్ ఒన్ రేషన్ కార్డ్ పథకం అమలు గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో వివరాలు కోరారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మంజూరు చేసిన, కేటాయించిన, వినియోగించిన నిధుల వివరాలు, రాష్ట్రంలో పథకం కింద నిర్ణయించిన లక్ష్యాలు ఏ మేరకు ఫలితాలనిచ్చాయి, రాష్ట్రంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డులు ఎంతవరకు విజయవంతంగా నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ను చంపేస్తానని <<14834003>>హత్యా బెదిరింపులకు<<>> పాల్పడిన వ్యక్తి నెల్లూరుకు చెందిన మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. మల్లికార్జున రావు మద్యం మత్తులో విజయవాడ నుంచి బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.
తిరుపతి బస్టాండ్ సమీపంలో వ్యభిచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు(D) పొదలకూరు(M) డేగపూడికి చెందిన గోవర్ధన్ రెడ్డి, అనంతమడుగు వాసి మద్దాలి వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తికి చెందిన గుడాల గురవయ్య జయశ్యాం థియేటర్ వీధిలోని లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ ఓ మహిళను ఉంచి వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
జగన్ బొమ్మలు తొలగించి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలతో రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని పొంగూరు, నాగులపాడు రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..పాస్ పుస్తకలపై జగన్ ఫోటోను తొలగించి రాజముద్రలతో ముద్రితమవుతాయని, భూ సమస్యలను పరిష్కరించి, రైతులకు పూర్తి హక్కులు కల్పించడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని తెలిపారు.
గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన మోహిందర్ తల్లి అనారోగ్యానికి గుర్యారు. నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవాలని మోహిందర్ సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేశ్కు విజ్ఞప్తి చేశారు. దీనికి నారా లోకేశ్ స్పందించారు. తన టీం చూసుకుంటుందని.. సాధ్యమైనంత వరకు సాయం చేస్తానని లోకేశ్ రిప్లే ఇఛ్చారు.
తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలని ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో భాగంగా జీరో అవర్లో మంగళవారం తిరుపతి ఎంపీ ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ..ప్రసిద్ధ ఆధ్మాత్మిక క్షేత్రమైన తిరుపతి విశిష్టతలను వివరిస్తూ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చేజర్ల మండలం ఆదూరుపల్లి చర్చిలో ఎనిమిదేళ్ల గిరిజన బాలిక చనిపోయింది. అనారోగ్యానికి గురైన బాలికకు తానే ప్రార్థనలతో బాగుచేస్తానని పాస్టర్ చెప్పడంతో అక్కడే ఉన్నామని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుపైగా చర్చిలోనే ఉంచడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతిచెందిందని వాపోయారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామం బాలాజీ రావు పేటకు తరలించారు.
వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా అద్దె వాహనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు DMHO కె.పెంచలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దాసుపత్రి ఆవరణలోని బాల భవిత కేంద్రం నుంచి రోగులను రవాణా చేసేందుకు వాహనాలు అవసరమని చెప్పారు. వాహనంలో 10 నుంచి 16 సీట్లు ఉండాలని సూచించారు. ప్రతి నెలా రూ.60 వేలు అద్దె ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు బాల భవిత కేంద్రం మేనేజర్ను సంప్రదించాలని సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం నెల్లూరు జిల్లాపై ప్రభావం చూపనుంది. ఇవాళ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే బుధవారం, గురువారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.