India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ ప్రభుత్వ భవనంపై మాజీ CM జగన్ ఫొటో ఇంకా ఉంచడంపై టీడీపీ MLA ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ విజమూరు మండలం గుండెమడకల గ్రామంలో పింఛన్ల పంపిణీకి వెళ్లారు. స్థానికంగా ఉన్న హెల్త్ కేర్ సెంటర్ భవనం వద్ద జగన్ ఫొటో కనపడింది. దీంతో ఆయన మెడికల్ ఆఫీసర్కు కాల్ చేశారు. ‘ఏంటి సార్ ఇంకా ప్రభుత్వం మారలేదా? మీకు తెలియదా?’ అని అసహనం వ్యక్తం చేశారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో డయేరియా ప్రబలకుండా అన్ని ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో డయేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన పోస్టర్లను వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
కోవూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కే.రమేష్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ ఆఫీస్ నుంచి కోవూరు డివిజన్కు బదిలీ అయ్యారు. కోవూరు డివిజన్లో పనిచేస్తున్న కే.విజయ్ కుమార్ ఆదివారం పదవి విరమణ చేశారు.
దుత్తలూరు మండలం వైసీపీ సీనియర్ నాయకుడు లెక్కల మాలకొండ రెడ్డి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ని కలిశారు. ఈ విషయం ఉదయగిరి నియోజకవర్గంలోని వైసీపీ నాయకుల్లో తీవ్ర దుమారం రేపింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75 వ జన్మదిన వేడుకలకు సత్య కుమార్ రావడంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారని మాలకొండ రెడ్డి వర్గం అంటుంది. కానీ దీనిని కొందరు వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
నెల్లూరు నగరంలోని GGH హాస్పిటల్లో విషాదం చోటు చేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ నాలుగో అంతస్తు నుంచి దూకి జ్యోతి అనే డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. చేజర్ల మండలం చిత్తలూరు PHCలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న జ్యోతి మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జోరుగా జరుగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లాలో 64.32 శాతం మందికి పింఛన్ అందజేశారు. ఈక్రమంలో వరికుంటపాడు మండలంలోని ఆండ్రావారిపల్లె గ్రామంలో ఒకే కుటుంబంలో రూ.22 వేలు పింఛన్ అందజేసినట్లు ఎంపీడీవో తోట వెంకటకృష్ణ కుమారి తెలిపారు. పరంధామలు రెడ్డికి వృద్ధాప్య పెన్షన్ రూ.7 వేలు అందజేశామని చెప్పారు. ఆయన భార్య పక్షవాత రోగి కావడంతో మరో రూ.15 వేలు ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద సోమవారం నుంచి పెంచిన రుసుము వసూళ్లు చేస్తారు. నెల్లూరు జిల్లా పరిధిలో వెంకటాచలం, కావలి, బూదనం టోల్ గేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో వాహనాల నుంచి అదనంగా రూ.15 వరకు వసూళ్లు చేస్తారు. ఈ మేరకు వాహనదారులు తమ ఫాస్టాగ్లో నగదు నిల్వలు సరిచూసుకోవాలని టోల్ గేట్ల నిర్వాహకులు చూస్తున్నారు.
జూలై ఒకటో తేదీ నుంచి దేశంలో నూతన నేర చట్టాలు అమలులోకి వస్తున్నాయని జిల్లా ఎస్పీ కే.ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష అధినియమ్ చట్టాలుగా మారయన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చట్టాలపై అవగాహన ఉండాలన్నారు.
నెల్లూరు సర్కిల్ పరిధిలో వినియోగదారులకు మరింత మెరుగ్గా కరెంట్ సరఫరా అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని APSPDCL ఎస్ఈ విజయన్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ‘పీక్ హవర్స్లో సబ్ స్టేషన్ల తనిఖీ’ అనే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆయా సబ్ స్టేషన్లలో అధికారులు అందుబాటులో ఉండి కరెంట్ సరఫరాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
నెల్లూరు సర్కిల్ పరిధిలో వినియోగదారులకు మరింత మెరుగ్గా కరెంట్ సరఫరా అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని APSPDCL ఎస్ఈ విజయన్ వెల్లడించారు. ఇందులో భాగంగానే ‘పీక్ హవర్స్లో సబ్ స్టేషన్ల తనిఖీ’ అనే బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆయా సబ్ స్టేషన్లలో అధికారులు అందుబాటులో ఉండి కరెంట్ సరఫరాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.