Nellore

News June 30, 2024

ఉదయగిరి: శిథిలావస్థలో ఆలయాలు

image

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రదేశం ఉదయగిరి. చారిత్రిక సంపదతో పాటు ప్రకృతి అందాలకు నెలవు. రాయలవారు దేశాన్ని జయించినా ఉదయగిరి వైపు అడుగులు కూడా వేయలేకపోయారు. చివరకు సంధి మార్గం ద్వారా ఉదయగిరి కోటను జయించారు. ఇక్కడ ఎన్నో ఆలయాలు నిర్మించారు. అప్పట్లో ప్రతి ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో కళకళలాడేది. నేడు ఉదయగిరిలోని ఆనాటి దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

News June 30, 2024

వీఎస్‌యూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా సునీత

image

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌గా పనిచేసిన రామచంద్రారెడ్డి రెండేళ్ల పదవీ కాలం నిన్నటితో ముగిసింది. దీంతో ఆయన కడపలోని యోగి వేమన యూనివర్సిటీకి వెళ్లారు. దీంతో ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా కె.సునీత యూనివర్సిటీ పరిపాలనా భవనంలో శనివారం భాధ్యతలు స్వీకరించారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు సునీతను సన్మానించారు. 

News June 30, 2024

వైసీపీని వీడిన దువ్వూరు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. సూళ్లూరుపేట శ్రీచెంగాల పరమేశ్వరి ఆలయ మాజీ ఛైర్మన్ దువ్వూరు బాల చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రిజైన్ లెటర్‌ను వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ముందు వరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

News June 30, 2024

వీసీ సుందరవల్లి రాజీనామా

image

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ సుందరవల్లి ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడంతో పలు యూనివర్సిటీల వీసీలు తప్పుకున్నా.. రాజీనామాకు ఆమె ససేమిరా అన్నారు. ఆమె రిజైన్ కోసం విద్యార్థి సంఘాల నాయకులు పట్టుబట్టారు. ఈక్రమంలో శనివారం రాజీనామా చేశారు. మాజీ సీఎం జగన్‌కు సుందరవల్లి సమీప బంధువు. యూనివర్సిటీ పరిపాలన భవనానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.

News June 29, 2024

తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి: ఆనం

image

నెల్లూరు జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్‌పర్సన్ఆ నం అరుణమ్మ అధికారులను ఆదేశించారు. నెల్లూరు జడ్పీ ఆఫీసులో స్థాయీ సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ.. తాగునీటి పథకాలకు సంబంధించి గుత్తేదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు.

News June 29, 2024

నెల్లూరులో ఆయన విగ్రహం పెట్టకండి: బీజేపీ

image

నెల్లూరులో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నాయకులు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని నెల్లూరులో పెట్టనివ్వబోమన్నారు. ఈ మేరకు నాయకులు కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో లవన్నను కలిశారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. హిందువుల మాన ప్రాణాలు తీసిన దుర్మార్గుడు టిప్పు సుల్తాన్ అన్నారు. నమామి గంగే నేత మిడతల రమేశ్ తదితరులు ఉన్నారు.

News June 29, 2024

నెల్లూరు: చిన్నారిపై లైంగిక దాడి..ఏడేళ్లు జైలు

image

బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5వేలు జరిమానా పడింది. ప్రత్యేక పోక్సో జిల్లా రోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. గూడూరులోని చవటపాలేనికి చెందిన వీరయ్య 2015లో బాలికకు మిఠాయి ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప అమ్మమ్మ ఫిర్యాదుతో పోలీసులు వ్యక్తిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.

News June 29, 2024

ఆత్మకూరు: మేనత్త అంత్యక్రియల్లో మేనల్లుడు మృతి

image

మేనత్త అంత్యక్రియల్లో మేనల్లుడు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరులో జరిగింది. సయ్యద్ ముంతాజ్ అనారోగ్యంతో మృతి చెందగా ఆమెను శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలి మేనల్లుడు నీటి కోసం వెళ్లి ట్యాంకు ఎక్కాడు. దిగే క్రమంలో గోడ కూలి కిందపడి గాయాలపాలయ్యాడు. నెల్లూరు అపోలోలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.మృతుడు ఐటీఐ కాలేజీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

News June 29, 2024

బాలికతో నెల్లూరు యువకుడి అసభ్యకర చాటింగ్

image

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడికి రాంగ్ కాల్ ద్వారా ఆ రాష్ట్రంలోని తాండూరుకు చెందిన బాలికతో అతను కనెక్ట్ అయ్యాడు. అలాగే అసభ్యకరంగా చాటింగ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో అక్కడి ఎస్ఐ విఠల్ రెడ్డి రంగంలోకి దిగి… యువకుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు.

News June 29, 2024

నెల్లూరు: వీవీ ప్యాట్లలో పేపర్ రోల్స్ తొలగింపు

image

నెల్లూరులోని ఈవీఎంల గోదాములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఇటీవల ఎన్నికలకు ఉపయోగించిన వీవీ ప్యాట్ మెషిన్లలో మిగిలిన పేపర్ రోల్స్ తొలగించారు. అనంతరం వీవీ ప్యాట్లను యథావిధిగా భద్రపరిచే ప్రక్రియను రెవిన్యూ అధికారులు చేపట్టారు.