India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కావలికి చెందిన బీద మస్తాన్ రావు వైసీపీ, రాజ్యసభ ఎంపీ పదవికి ఇటీవల రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి రాజ్యసభ ఎంపీగా బీదకే టీడీపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చిందని సమాచారం. రేపు సాయంత్రంతో నామినేషన్ గడువు ముగియనుంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు టీడీపీ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియకు 4వ సారి కలెక్టర్ కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 11న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. జిల్లాలోని ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి 6 ప్రాజెక్టు కమిటీలు, 13 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వీటితోపాటు 490 వాటర్ యూజర్స్ అసోసియేషన్లు, 3698 టీసీలకు ఎన్నికలు జరుగుతాయి.
నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన శ్రీరాములు, తిరుపతిలోని ఎర్రమిట్టకు చెందిన ఓ మహిళ తిరుపతి రైల్వేకాలనీలో ఇంటిని బాడుగకు తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. కోస్తా అమ్మాయిలు దొరకగా.. వాళ్లను హాస్టల్కు తరలించారు. మహిళతో పాటు శ్రీరాములును అరెస్ట్ చేశామని తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపారు.
పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.
మనుబోలు మండలంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజ్ పక్కన సర్వీస్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి నాయుడుపేట వైపు వెళుతున్న లారీ వేగంగా వెళుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
పల్నాడు జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో చనిపోయింది కావలి మండలం సిరిపురం వాసులుగా సమాచారం. వారు కారులో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం అనంతరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తుళ్లూరి సురేష్, వనిత, యోగిలు, వెంకటేశ్లర్లుగా గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల పర్యవేక్షణ అత్యవసరమని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన నెల్లూరులోని దర్గామిట్ట డీసీఆర్ జెడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పడతాయన్నారు.
నాయుడుపేట స్వర్ణముఖి నదిలో గల్లంతైన వృద్ధురాలు తుమ్మూరు వాసి లోడారి రామమ్మ(80)గా పోలీసులు అనుమానిస్తున్నారు. రామమ్మ శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వచ్చి కనిపించడం లేదని వృద్ధురాలు కుమార్తె మహా లక్ష్మమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామమ్మ ఇక ఎవరికీ భారం కాకూడదని భావించి నదిలో దూకేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పర్యాటక, దేవాదాయ, అటవీశాఖ పరిధిలోని దర్శనీయ ప్రదేశాల పూర్తి సమాచారాన్ని ఆన్లైన్లో వికీపీడియాలో అప్లోడ్ చేయాలని సూచించారు.
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. జిల్లా వ్యాప్తంగా 58 థియేటర్లలో ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి ఒక్కో థియేటర్లో 8 షోల చొప్పున 464 షోలు ప్రదర్శితమయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మొదటి రోజు నుంచే ‘పుష్ప-2’ రికార్డులు మొదలయ్యాయని అభిమానులు సంబరపడుతున్నారు.
Sorry, no posts matched your criteria.