India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
YCP అధినేత జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అవినీతికి పాల్పడటంలో ఆయన ఓ గ్లోబల్ స్టార్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు CBI స్థాయి విచారణకే పరిమితం అయిన జగన్.. ఇప్పుడు అమెరికా FBI స్థాయికి ఎదిగారన్నారు. ఇందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానంటూ ‘X’లో పోస్ట్ చేశారు.
నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో ఇంటర్ (బైపీసీ) విద్యార్థులకు డిప్లొమా కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రిన్సిపల్ వీరవెంకట నాగరాజ మన్నార్ తెలిపారు. డిప్లొమా ల్యాబ్, అనస్థీషియన్, ఆప్తాల్మిక్, ఆప్తోమెట్రీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్స్ కోర్సులలో 95 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 2 తేదీలోపు రూ.100లు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రపంచ స్థాయి జ్ఞాపకశక్తి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విజేత జై బల్దియ జైన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అభినందించారు. బల్దియా జైన్ 51 సెకండ్లలో 125 తేదీలను గుర్తుపెట్టుకుని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారు. మానసిక గణన విభాగంలో అద్భుత విజయం సాధించిన బల్దియా జైన్ భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచారని కలెక్టర్ అభినందించారు.
కడలి అలల పైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే.. ఇంతచేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం, బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం ఉండదు.. మరి గడియలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతు పట్టని రోజుల తరబడి ప్రయాణం.. అయినా భగవంతుడిపై భారం వేసి, సముద్రంపై నమ్మకం ఉంచి, బతుకుపోరు సాగిస్తారు మత్స్యకారులు.
గత ప్రభుత్వం హయాంలో YS జగన్ తన హంగులు, ఆర్భాటాల కోసం ఏకంగా రూ.5 వేల కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. పాసు పుస్తకాలపై బొమ్మలు, రుషికొండ ప్యాలెస్ నిర్మాణంతో ప్రజల సొమ్మును జగన్ మంచి నీళ్లలా ఖర్చు చేశారని మండిపడ్డారు. జగన్ నిర్వాకంతో ప్రజలకు బడ్జెట్ మీద ఆశలు పోయాయన్నారు. అందుకే YCPని ప్రజలు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారని ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రాపూరు పంచాయతీ ఇన్ఛార్జి కార్యదర్శి చెంచయ్యను లైంగిక వేధింపుల అభియోగాలతో, కృష్ణపట్నం పంచాయతీ కార్యదర్శులు మస్తానయ్య, రాజశేఖర్లను నిధులు దుర్వినియోగం అభియోగాలపై కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరు జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రాపూరు పంచాయతీ ఇన్ఛార్జి కార్యదర్శి చెంచయ్యను లైంగిక వేధింపుల అభియోగాలతో, కృష్ణపట్నం పంచాయతీ కార్యదర్శులు మస్తానయ్య, రాజశేఖర్లను నిధులు దుర్వినియోగం అభియోగాలపై కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరులో వైసీపీ నేతల కీలక సమావేశం జరుగుతోంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి విక్రమ్ రెడ్డి, ఖలీల్, ఆనం అరుణమ్మ, విజయకుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
NTR సుజలస్రవంతి పథకం కింద 6 జిల్లాల్లో ఓ హబ్, స్పోక్ విధానంలో ప్లాంట్లను నెలకొల్పినట్లు అసెంబ్లీలో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళంలో 45 మదర్ ప్లాంట్లను నెలకొల్పారని, అందులో 20 నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. నెల్లూరు, CTR, KNL నుంచి పైప్ లైన్ ఏర్పాటుతో పాటు వాటినీ పునరుద్ధరిస్తామన్నారు.
CMపైనే కుట్రలు జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని అసెంబ్లీలో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిలదీశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. చంద్రబాబు అరెస్ట్కు వైసీపీ హయాంలో పెద్ద కుట్రే జరిగిందని ఆరోపించారు. తక్షణమే దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ RRR స్పందిస్తూ.. ఇది జీరో అవర్ అని.. ఇక్కడ సమాధానాలు ఉండవన్నారు. దీనిపై తరువాత చర్చిద్దాం అంటూ ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.