Andhra Pradesh

News September 26, 2025

ప్రకాశం కలెక్టర్.. డివిజన్ల వారి పర్యటన షెడ్యూల్ ఇదే!

image

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఈనెల 29 నుంచి అక్టోబర్ 24 వరకు కలెక్టర్ మీకోసం కార్యక్రమాన్ని అన్ని డివిజన్లలో నిర్వహించనున్నారు. ఈనెల 29న కనిగిరి, అక్టోబర్ 6న మార్కాపురం, 13న ఒంగోలు, 27న కనిగిరి, నవంబర్ 3న మార్కాపురం, 10న ఒంగోలు, 17న కనిగిరి, 24న మార్కాపురం డివిజన్లో స్వయంగా కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో పాల్గొని అర్జీదారుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

News September 26, 2025

వైసీపీలో కాంగ్రెస్ కీలక నేతల చేరిక

image

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఉమ్మడి జిల్లా మాజీ ఛైర్మన్ రాం పుల్లయ్య యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు నరసింహులు యాదవ్ తమ అనుచరగణంతో వైసీపీలో చేరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుర్చుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి జగన్ సూచించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఉన్నారు.

News September 26, 2025

సీపీఐ జాతీయ కార్యదర్శిగా రామకృష్ణ

image

సీపీఐ జాతీయ కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ గురువారం ఎన్నికయ్యారని అనంతపురం జిల్లా నాయకులు తెలిపారు. చండీఘర్‌లో జరిగిన 25వ మహాసభలో జాతీయ కార్యదర్శిగా రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాట యోధుడు రామకృష్ణ అని కొనియాడారు.

News September 26, 2025

ప్రకాశం: కొత్త కలెక్టర్.. సరికొత్త నిర్ణయంతో ప్రజల ముందుకు!

image

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు సరికొత్త నిర్ణయంతో ప్రజల ముందుకు రానున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని శాఖలపై సమీక్షలతో బిజీగా ఉన్న కలెక్టర్ ప్రజల ముందుకు వచ్చేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగే మీకోసం సుదూర ప్రాంతాల ప్రజలు వస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచి అన్ని డివిజన్లలో కలెక్టర్ ప్రతి సోమవారం పర్యటించనున్నారు.

News September 26, 2025

పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో డ్వామా కార్మిక శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని ఎంపీడీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్షించారు. 2025-26 సంబంధించి కొత్త క్యాటిల్ షెడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో హార్టికల్చర్ ప్లాంటేషన్ 350 ఎకరాల్లో చేపట్టాల్సి ఉందన్నారు.

News September 26, 2025

జీవీఎంసీ జోన్లు పదికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

జీవీఎంసీ జోన్లను పదికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త జోన్లు..
➤ భీమిలి – 1, 2, 3, 4 ➤మధురవాడ – 5, 6, 7, 8, 98 ➤ఈస్ట్ – 9 నుంచి 23, 28
➤నార్త్ – 14, 24, 25, 26, 42 నుంచి 51, 53, 54, 55 ➤సౌత్ – 27 నుంచి 39, 41
➤వెస్ట్ – 40, 52, 56 నుంచి 63, 89 నుంచి 92 ➤పెందుర్తి – 88, 93 నుంచి 97
➤గాజువాక – 64 నుంచి 76, 86, 87 ➤అగనంపూడి – 77, 78, 79, 85
➤అనకాపల్లి – 80 నుంచి 84

News September 26, 2025

SKLM: జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి

image

జల జీవన్ మిషన్ పథకం కింద శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వేగవంతం చేసి, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పనులను ఆలస్యం చేయకుండా తక్షణమే పూర్తి చేయాలని ఆయన గట్టిగా ఆదేశించారు.

News September 26, 2025

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

జిల్లాలో ఈనెల 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గుంటూరు కలెక్టర్ తమిమ్ అన్సారియా గురువారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పిల్లలు, పశువులను నీటి ప్రవాహాల వద్దకు పంపకూడదని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. మండల, డివిజినల్ అధికారులు స్థానిక స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ నం. 0863-2234014 కి సమాచారమివ్వాలని తెలిపారు.

News September 26, 2025

పామర్రు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పామర్రు శివారు శ్యామలాపురం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో తలగల ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించామని చెప్పారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 25, 2025

మోపిదేవి: విషపురుగు కుట్టడంతో వ్యక్తి మృతి

image

మోపిదేవి మండలం ఉత్తర చిరువోలులంక గ్రామానికి చెందిన నడకదుటి నాగమల్లేశ్వరరావు(40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం.. మోపిదేవి దేవస్థానములో సేవ చేయడానికి వెళుతుండగా మార్గమధ్యలో ఏదో విషపురుగు కుట్టినట్లు తెలిపారు. కాలు వెంబడి రక్తం రావడంతో తోటి ఉద్యోగులు అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.