India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని పెనుగొలను గ్రామంలో ఓ వ్యభిచార గృహంపై శనివారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. తిరువూరు సీఐ అబ్దుల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుగొలనులోని ఓ వ్యభిచార గృహంపై చేసిన దాడుల్లో అదే గ్రామానికి చెందిన ఒక మహిళను, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాపాడాలని సీఐటీయూ నాయకుడు గొర్లి వెంకటరమణ అన్నారు. జులై 10న జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో ధర్నాలు చేయాలన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కార్మిక హక్కులను కనీసం పట్టించుకోవడంలేదన్నారు. హక్కులను కాపాడే వరకు నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
బారువ-కొత్తురు గ్రామానికి చెందిన వలిశెట్టి జోగరావు తోటి మత్స్యకారులతో కలిసి ఆదివారం వేకువజామున సముద్ర వేటకు బయలుదేరారు. ఇంతలో రాకాసి అలలకు తెప్ప బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జోగరావు మరణించగా మిగత మత్స్యకారులు దానయ్య, సింహాచలం, కుమార్ స్వామి, భాస్కరావు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. జోగరావు కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకార పెద్దలు కోరుతున్నారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలను ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. విశాఖ నగర వైసీపీ ఆఫీసులో ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. 8న వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.
చిత్తూరు – కర్నూల్ ఎన్హెచ్పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన ఐదుగురు రాత్రి కారులో గువ్వలచెరువులో పాలకోవ తినడానికి వెళ్లారు. తినేసి వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి మండిపల్లి సొంత నిధుల నుంచి రూ.లక్ష తక్షణ సాయం కింద అందించారు.
నకిలీ సదరం సర్టిఫికెట్లను ఏరిపారేయాలని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి వంద మందిలో 25% నకిలీ వ్యక్తులే దివ్యాంగులుగా చలామణి అవుతూ నిజమైన దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగులకు న్యాయం చేసి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
భీమవరం గునుపూడిలోని బాలికల హాస్టల్లో ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా RRDS ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అమూల్యరావు మాట్లాడుతూ.. చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్ట పడతారని అన్నారు. చాక్లెట్ రుచుల్లో మొత్తం 600 రకాలున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు.
☛ ఇంతకీ మీకు ఏ చాక్లెట్ ఇష్టం..?
నంద్యాల కలెక్టరేట్లో ఈ రోజు ఉదయం 11.30 గంటలకు కలెక్టర్గా రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. మహానంది దేవస్థానం వేదపండితులు, అర్చకులు పూజలు నిర్వహించగా.. ముస్లిం, క్రైస్తవ మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్థనల అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ పద్మజ, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాల సంఖ్య జూన్ నెలలో పెరిగింది. గత ఏడాది జూన్లో 1,692 విమానాలు రాకపోకలు సాగించగా ఈ ఏడాది జూన్లో 1,704కు విమానాల సంఖ్య పెరిగింది. అయితే విమాన ప్రయాణికుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. గతేడాది జూన్లో 2,54,490 మంది ప్రయాణించగా, ఈ జూన్లో 2,32,149 మంది ప్రయాణించారని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు నరేశ్ కుమార్, కుమార్ రాజా తెలిపారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కడప జిల్లాకు రానున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు ఆమె జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె విజయవాడకు వెళ్ళనున్నారు. సాయంత్రం వైఎస్ జయంతి సభకు తెలంగాణ సీఎం రానున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.