India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 30న కోవెలకుంట్ల మండలంలో పర్యటించనున్నట్లు బీసీ రామనాథరెడ్డి తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గం చరిత్రలో తొలిసారి మంత్రి పదవిని దక్కించుకున్న బీసీ జనార్దన్ రెడ్డి, పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కోవెలకుంట్ల మండలానికి రానున్నారు. దీంతో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని విశాఖపట్నం రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బి.విజయభాస్కర్ సూచించారు. విజయనగరం డీఈఓ ఆఫీసులో విద్యాశాఖ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేసేటట్లు ప్రోత్సహించాలన్నారు. భోజన నాణ్యతను పరిశీలించాలన్నారు. అకాడమిక్ విషయాలపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. డీఈవో ప్రేమకుమార్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.
సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జై భీమ్ సిబ్బందితో కలిసి మందస మండలంలోని కొండలోగాం పంచాయతీలోని నాటుసారా తయారీని అరికట్టేందుకు గురువారం సాయంత్రం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బెల్లపు ఊటలను ధ్వంసం చేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అనంతరం గ్రామంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1900 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో జులై 1, 2 తేదీల్లో చేపట్టనున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్, డిఆర్డీఏ పీడీ సత్యనారాయణ, జిఎస్ డబ్ల్యుఓ ఏవో లక్ష్మీపతి, తదితర అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పి.కేశవ్తో కలిసి గురువారం చర్చించారు. ఈ వారంలో ప్రపంచ బ్యాంకు బృందం పోలవరం పర్యటన, నిర్వాసితుల సమస్యల నేపథ్యంలో చర్చలు సాగాయి. చర్చల్లో జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన రెండేళ్ల రెండు నెలల కాలం తన సర్వీస్లో మరుపురాని ఘట్టం అని IAS డా.మాధవీలత అన్నారు. జిల్లా నుంచి రిలీవ్ అయిన ఆమెకు గురువారం స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో అధికారులు వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎస్పీ జగదీష్, జేసీ తేజ్ భరత్, సబ్కలెక్ట ర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, సిబ్బంది తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.
ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో లోక్సభ ఎంపీలతో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్కు వేమిరెడ్డి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. పలు అంశాలపై చర్చించారు.
జిల్లాలోని హైస్కూలు అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించిన సీనియార్టీ జాబితా వెబ్సైట్లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఈ జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఎంఈవోలు, ఉప విద్యాధికారులను సంప్రదించాలన్నారు. ఏమైనా లోపాలుంటే ఆధారాలతో ఈనెల 29వ తేదీలోపు సమర్పించాలని ఆమె కోరారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జులై 1న ఇంటి వద్దే ఫించన్ నగదు అందజేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని డీఆర్డీఏ, మెప్మా పీడీలు, ఐసీడీఎస్, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
Sorry, no posts matched your criteria.