India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సినిమాకు మంచి రివ్యూలు రావడం సంతోషంగా ఉందని, చిత్ర బృందానికి ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, తదితర నటులు, డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాత అశ్వినీదత్ తదితరులు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ చిత్రంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సినిమాకు మంచి రివ్యూలు రావడం సంతోషంగా ఉందని, చిత్ర బృందానికి ఆయన కంగ్రాట్స్ తెలిపారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, తదితర నటులు, డైరెక్టర్ నాగ్ అశ్విన్.. నిర్మాత అశ్వినీదత్ తదితరులు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు.
సోంపేట మండలం కర్రివానిపాలెం గ్రామానికి చెందిన కర్రి కృష్ణమూర్తి, తులసీ దంపతులకు 3 కుమార్తెలు, 2 కుమారులు. వీరందరూ డాక్టర్లు కావడం విశేషం. వృత్తి రీత్యా కృష్ణమూర్తి కుటుంబం ఛత్తీస్గడ్ రాష్ట్రంలో స్థిరపడింది. పెద్ద కుమార్తె సుప్రియ, 2వ కుమార్తె సోనాల్, 3వ కుమార్తె స్తుతి MBBS పూర్తిచేశారు. పెద్దకుమారుడు శుభమ్ 3వ సంవత్సరం, చిన్నకుమారుడు శివమ్ కూడా అదే కోర్స్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.
మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైపు లైన్ విస్ఫోటనం జరిగి పదేళ్లు కావస్తున్నా నాటి భయానక వాతావరణం నగరం దీవి వాసులను కలవర పెడుతోంది. 2014 జూన్ 27వ తేదీన గెయిల్ ట్రంక్ పైప్ లైన్ పేలుడు జరిగి 22 మంది మృత్యువాత పడగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలు గృహాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ. కోట్లలో ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే గెలిచారని ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకు ప్రతిపక్ష నేత హోదా వచ్చే ప్రసక్తే లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆనం నివాసంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష నేత హోదా రాదన్నారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లకై ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) ఈసెట్-2024 వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మిషన్లు కావలసిన విద్యార్థులు ఈ నెల 30లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
పదవుల కోసం దిగజారే మనస్తత్వం తనది కాదని వైసీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిప్యూటీ మేయర్, నాలుగో డివిజన్ కార్పొరేషన్ పదవికి ఎప్పుడో రాజీనామా చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామాను గోప్యంగా ఉంచినట్టు కొందరు ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పదవులను పట్టుకొని వేలాడనని తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ జిల్లా పరిషత్ నందు దీర్ఘకాలికంగా ఉన్న కొన్ని సమస్యలను డిప్యూటి సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు విదేశీ నిపుణుల బృందం ఈనెల 30న వస్తున్నారని ప్రాజెక్టు ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. ఈనెల 29వ రాత్రికి పోలవరానికి ఈ బృందం చేరుకుని ప్రాజెక్టు అతిథి గృహంలో బస చేస్తారని, 30 ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రంవాల్ ప్రాంతాలను పరిశీలిస్తారని తెలిపారు. ఈనెల 27న ఈ బృందం రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల తేదీలు మారినట్టు ఈఈ తెలిపారు.
ప్రకాశం జిల్లా 38వ కలెక్టర్గా తమీమ్ అన్సరియా గురువారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దినేశ్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.