Andhra Pradesh

News September 28, 2024

పేద ఖైదీలకు సాయం అందించాలి: ప్రకాశం కలెక్టర్

image

బెయిల్ వచ్చిన షూరిటి లేక ఇబ్బంది పడుతున్న పేద ఖైదీలకు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందించాలని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపవర్మెంట్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఖైదీల బైయిల్ వివరాలు, స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగబోయే జాతీయ లోక్ ఆదాలత్ ద్వారా ఖైదీలకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు.

News September 28, 2024

ఈనెల 29న జిల్లాకు రానున్న మంత్రి సత్యకుమార్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తొలిసారి కడప జిల్లాకు రానున్నారు. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరులో జిల్లా కార్యకర్తల సమావేశం, నగర ప్రముఖులతో సమావేశం ఉంటుంది. 30వ తేదీ ఉదయం ప్రొద్దుటూరు సర్వజన ఆసుపత్రి పర్యటన అనంతరం, కడప రిమ్స్ ఆసుపత్రిలో ఆడిటోరియం, ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. అనంతరం కడప నగరంలో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు.

News September 28, 2024

పాడేరు: విలువల జోడింపుతో మెరుగైన ఆర్థిక లబ్ది

image

ముడి వస్తువులకు విలువలు జోడింపు ద్వారా నాణ్యత పెరగడమే కాకుండా మెరుగైన ఆర్ధిక లబ్ది చేకూరుతుందని అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం న్యూడిల్లీలో స్పైసెస్ బోర్డు, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నిర్వహించిన వర్క్ షాప్‌కు కలెక్టర్ హాజరయ్యారు. మంచి పరిశుభ్రత పద్ధతులలో సుగంద ద్రవ్యాలైన మిరియాలను సరైన పక్వ స్థితిలో సేకరించాలని, సేకరించిన మిరియాలకు అదనపు విలువలు జోడించాలన్నారు.

News September 28, 2024

నెల్లూరు: వచ్చే నెల 3 నుంచి టెట్ పరీక్ష

image

ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబుల్ టెస్ట్) పరీక్షను అక్టోబర్ 3 నుంచి 21వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. ఈ పరీక్షలు జిల్లాలోని PBR విశ్వోదయ కళాశాల (కావలి), RSR కళాశాల (కడనూతల), నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ( నెల్లూరు), అయాన్ డిజిటల్ సెంటర్ (పొట్టేపాలెం)లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు సమయానికి అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలన్నారు. ఏదో ఒక ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.

News September 28, 2024

విశాఖ- కిరండూల్ రైళ్లు దంతెవాడ వరకు కుదింపు

image

విశాఖ- కిరండూల్ మధ్య నడుస్తున్న రైళ్లు వర్షాల కారణంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు దంతెవాడకు కుదించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి దంతెవాడ తిరుగు ప్రయాణంలో దంతెవాడ నుంచి విశాఖకు చేరుకుంటాయని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News September 28, 2024

హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బాపట్ల ఎంపీ

image

నూతనంగా ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలలో హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ నూతన కమిటీ‌లను ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ బాపట్ల జిల్లాలోని పలువురు అభినందనలు తెలియజేశారు.

News September 28, 2024

OCT 3 నుంచి మావుళ్లమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు

image

భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం ఆయన కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

News September 28, 2024

శ్రీకాకుళం: నిర్మాణాలు పూర్తి చేయకపోతే రద్దువుతాయి

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ‘మన ఇళ్లు.. మన గౌరవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. మన ఇళ్లు..మన గౌరవం పథకంలో ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఒకవేళ పూర్తిచేయకపోతే ఆ నిర్మాణాలు రద్దవుతాయని స్పష్టం చేశారు.

News September 28, 2024

మాదక ద్రవ్యాల దుష్ర్పభావాలపై యువతకు అవగాహన తప్పనిసరి: ఎస్పీ

image

జిల్లాలో మాదక ద్రవ్యాల దుష్ర్పభావాలను తెలియజేసి, వాటి వినియోగాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాలులోమాదకద్రవ్యాల నిషేధంపై కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుష్ర్పభావాలపై పాఠశాల, కళాశాలల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

News September 28, 2024

కడప జిల్లాలో ఆర్డీవోల బదిలీలు

image

కడప జిల్లాలోని కడప, పులివెందుల, బద్వేల్ ఆర్డీవోలను బదిలీ చేస్తూ ఉన్నతధికారులు ఆదేశాలు జారీ చేశారు. కడప ఆర్డీవోగా జాన్ పలపర్తిని, జమ్మలమడుగు ఆర్డీవోగా ఆదిమూలం సాయి శ్రీ, బద్వేలు ఆర్డీవోగా చంద్రమోహన్‌ను, పులివెందుల ఆర్డీవోగా లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూషను నియమిస్తూ ఉన్నతధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటుపలువురు డిప్యూటీ కలెక్టర్లను జిల్లాలో బదిలీ చేశారు.