Andhra Pradesh

News June 26, 2024

తూ.గో: ‘గ్రామానికే పేరు తీసుకొచ్చిన మాధురి’

image

ఉమ్మడి తూ.గో జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కె.మాధురి డిప్యూటీ కలెక్టర్ ‌ఎంపికైన సందర్భంగా గ్రామస్థులు అభినందన సభ నిర్వహించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోగా.. తల్లి ఉమామహేశ్వరి కష్టపడి చదివించారు. మాధురి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగారని సర్పంచ్ మల్లేశ్వరి అన్నారు. గ్రామానికే పేరు తీసుకొచ్చారని కొనియాడారు. ఐఏఎస్ సాధించడమే తన ధ్యేయమని మాధవి అన్నారు.

News June 26, 2024

ఇచ్ఛాపురం: వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వండి

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును నియోజకవర్గంలోని వాలంటీర్లు కలిశారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. వాలంటీర్ ఉద్యోగాల నుంచి తమను బలవంతంగా రాజీనామా చేయించారని వాపోయారు. మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. దీనిపై ఎమ్మెల్యే అశోక్ సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News June 26, 2024

కర్నూలు: 10 పడకలతో ప్రత్యేక వార్డు

image

పీడియాట్రిక్ కేసుల కోసం 10 పడకలతో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేయాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభాకర రెడ్డి ఆదేశించారు. పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో సీజనల్ వ్యాధుల కేసులపై సమీక్ష నిర్వహించారు. పీడియాట్రిక్ కేసుల వ్యాప్తిపై రోజువారీ డేటాను తన దృష్టికి తీసుకురావాలని పీడియాట్రిక్ HODని ఆదేశించారు.

News June 26, 2024

కుప్పంలో కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

image

కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కుప్పం డెవలప్మెంట్ అథారిటీ(కడా) ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కడా ఏర్పాటుతో పాటు దీనికి ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తామన్నారు. కుప్పం ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.

News June 25, 2024

అభ్యర్థులు లెక్కలు చెప్పండి: డీఆర్ఏ

image

ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు వారి తుది ఎన్నికల లెక్కల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలకులకు సమర్పించాలని తిరుపతి డీఆర్ఏ పెంచల కిషోర్ ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ పార్టీల ప్రతినిధులు, వ్యయ పరిశీలకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎన్నికల వ్యయ నోడల్ అధికారి చరణ్ రుద్రరాజు తదితరులకు డీఆర్ఏ పలు సూచనలు చేశారు.

News June 25, 2024

టాలీవుడ్ స్టోరీస్ C/O ఉత్తరాంధ్ర

image

ఉత్తరాంధ్రలో జరిగిన యధార్థ సంఘటనలే కథలుగా వెండితెరపై అలరిస్తున్నాయి. ఇటీవల పలాస, జయమ్మ పంచాయతీ, కోటబొమ్మాళి లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా..పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారుడి స్టోరీలో నాగచైతన్య-సాయి పల్లవి నటిస్తున్నారు. రామ్‌చరణ్-బుచ్చిబాబు సినిమాకు కోడి రామ్మూర్తి జీవిత చరిత్రే ఆధారమని టాక్. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

News June 25, 2024

అమరావతికి రూ.4.5 కోట్లు ఇచ్చిన చిత్తూరు మహిళలు

image

అమరావతి నిర్మాణానికి చిత్తూరు జిల్లా డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్ల విరాళం అందజేశారు. సంబంధిత చెక్కును కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. డ్వాక్రా మహిళల ఉదారతను చంద్రబాబు అభినందించారు. అదే సభలో మెప్మా మున్సిపాలిటీ ప్రాజెక్టు తరఫున మరో రూ.కోటి విరాళంగా ఇచ్చారు.

News June 25, 2024

భీమిలి: 4 రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

image

భీమిలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రేబిస్‌తో కుమారుడు మృతి చెందిన నాలుగు రోజులకే తండ్రి బెంగతో మంగళవారం మృతి చెందాడు. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న అల్లిపల్లి నర్సింగరావుకు పిల్లలు లేకపోవడంతో అబ్బాయిని పెంచుకున్నాడు. అతడిని ఇంట్లో ఉన్న కుక్క కరిచింది. దానిని నిర్లక్ష్యం చేయడంతో ఆ అబ్బాయి రేబిస్ సోకి మృతి చెందాడు. దీంతో బెంగ పడిన నర్సింగరావు ప్రాణాలు విడిచారు.

News June 25, 2024

VJA: భవానిపురంలో మృతదేహం కలకలం

image

విజయవాడ భవానిపురంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. భవానిపురం హెడ్ వాటర్ వర్క్ వద్ద మంగళవారం మధ్యాహ్నం మృతదేహం ఉందని స్థానికుల ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించగా ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 60 సంవత్సరాల వరకు ఉంటుందని వారు వెల్లడించారు. వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.

News June 25, 2024

అనంత: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

బుక్కరాయసముద్రం మండలం రోటరీ పురం గ్రామం వద్ద విద్యుత్ షాక్‌తో ఎస్.ఆర్.సి రోడ్డు నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న బీహార్ కార్మికుడు ఎం.డి సాదిక్ మంగళవారం మృతి చెందారు. ఉదయం స్నానం చేసేందుకు హీటర్‌తో నీళ్లు వేడి చేసి తీసుకునే సమయంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికి అక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.