India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధర్మవరం నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన అండర్-14 స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలకు బత్తలపల్లి విద్యార్థులు ఏక్నాథ్, అవినాశ్, ఆకాశ్ ఏంపికయ్యారు. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని జెడ్పీహెచ్ స్కూల్, ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులు, పీఈటీలు ఆకాంక్షించారు.
ఆచార్య నాగార్జున వర్శిటీ పరిధిలోని కాలేజీలలో బీ-ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3, 5వ సెమిస్టర్ థియరీ పరీక్షల(సప్లిమెంటరీ) టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుండి 30 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడవచ్చంది.
జాతీయ ఉత్తమ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అహోబిలం ఎంపికైంది. ప్రపంచం పర్యాటక దినోత్సవం సందర్బంగా నేడు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చేతుల మీదుగా అవార్డును నంద్యాల ఇంటాచ్ చాప్టర్ కన్వీనర్ శివ కుమార్ రెడ్డి, ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖాధికారి లంజ్వంతి నాయుడు కలిసి అందుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డిని, శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా.ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ను విధి నిర్వహణలో బాధ్యతగా నిర్వర్తించాలని ఆయన కోరారు. అనంతరం పలు ముఖ్యమైన అంశాలపై ఇరువురు అధికారులు చర్చించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. అనకాపల్లి ఆర్డీవోగా షేక్ ఆయేషాను నియమించారు. విశాఖ ఆర్డీవో హుస్సేన్ సాహిబ్ను బదిలీ చేసి ఆయన స్థానంలో పోలూరి శ్రీలేఖను నియమించారు. భీమిలి ఆర్డీవో భాస్కర్ రెడ్డి స్థానంలో కె.సంగీత్ మాధుర్ బదిలీపై వచ్చారు. VMRDA సెక్రటరీని బదిలీ చేయగా ఆమెను విజయనగరం ఆర్డీవోగా నియమించారు.
కృష్ణా జిల్లా తాడిగడపలో బస్సును ఓవర్టేక్ చేయబోయి స్కిడ్ అయ్యి పడటంతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు తాడిగడపకు చెందిన అశోక్(23)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నందవరం కేజీబీవీ 8వ తరగతి విద్యార్థిని జీ.స్వాతి రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ పోటీలకు ఎన్నికైనట్లు నందవరం కేజీబీవీ ప్రిన్సిపల్ శైలజ తెలిపారు. 26న జరిగిన జిల్లాస్థాయి లాంగ్ జంప్ పోటీలో స్వాతి ప్రతిభ కనబరిచి నాలుగో స్థానంలో విజయం సాధించిందని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన స్వాతిని ఆమె అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలలో మెరుగైన ప్రతిభను కనబరిచి విజయం సాధించాలని కోరారు.
అనంతపురం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. పుట్లూరు మండలం శనగలగూడూరులో 10 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో తిరుపాలుకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి విజయవాడ కోర్టు అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చింది. గనుల కేటాయింపులలో వెంకటరెడ్డి పలు సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో వెంకటరెడ్డిని A1గా అధికారులు చేర్చారు. కాగా గత రాత్రి హైదరాబాద్లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడ GGHలో వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ సంయుక్తంగా పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 56 మంది హాజరు కాగా, 22 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపల్ కోటేశ్వరయ్య తెలిపారు. కార్యక్రమంలో APSSDC అధికారి వీరయ్య, SEEDAP జిల్లా ప్లేస్మెంట్ అధికారి చైతన్య, లోకేశ్, నరసింహులు SPOC, స్కిల్ హబ్ కోఆర్డినేటర్స్ రసూల్, సిసింద్రి, అబ్దుల్, అజేశ్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.