India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిక్కోలు వాకిట కొలువైన ఆరోగ్య ప్రదాత శ్రీ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం సమకూరిన ఆదాయ వివరాలను ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. స్వామివారికి టికెట్లు రూపేనా రూ.3,08,400, పూజలు, విరాళాల రూపంలో రూ.71,749 ఆదాయం వచ్చిందన్నారు. అలాగే ప్రసాదాల రూపంలో రూ.2,24,860 స్వామి వారికి ఆదాయం వచ్చిందని తెలిపారు. మొత్తం రూ.6,05,009 ఆదాయం సమకూరిందని తెలిపారు.
ఏలూరు జిల్లా లక్కవరం పోలీసు స్టేషన్లో వైసీపీ నేతలపై కేసు నమోదైనట్లు ఎస్సై సుధీర్ తెలిపారు. వైసీపీ మండలాధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, మరో ముగ్గురిపై స్థానిక జనసేన నేత కంచర్ల మణికంఠ స్వామి ఫిర్యాదు చేయగా.. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలను దుర్భాషలాడటంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై సుధీర్ తెలిపారు.
అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని సినీ డైరెక్టర్ హను రాఘవపూడి ఈరోజు దర్శించుకున్నారు. నూతనంగా ప్రభాస్తో చిత్రీకరిస్తున్న సినిమా స్క్రిప్ట్కు లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో సఖినేటిపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముప్పర్తి నాని, వనమాల మూలస్వామి, శంకరగుప్తం నాని, తదితరులు పాల్గొన్నారు.
కడప నగరంలోని పీవీఆర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 30వ తేదీన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అండర్ -19 జూనియర్ విభాగం, సీనియర్ విభాగంలో పురుషులు, మహిళల విభాగం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విడివిడిగా ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామంలో భార్య పిల్లలు కనిపించడం లేదంటూ భర్త చంద్రయ్య ఇచ్చాపురం ఎస్ఐ లక్ష్మణరావుకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వివరాలు.. తొమ్మిదేళ్ల కిందట బాధితుడికి రాములమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈనెల 13న భర్త చేపలవేటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల, తెలిసినచోట్ల వెతికినా ఆచూకి లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీ అయిన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారికి చార్జీని అప్పగించారు. విజయనగరం జిల్లా నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన ఎస్.నాగలక్ష్మి బుధవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి కమిటీలు, సభ్యత్వాలు పూర్తిగా రద్దు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీల నియామకం, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆ ప్రకటనలో తెలియజేశారు.
డీపీఈడీ/బీపీఈడీ కోర్సులలో ప్రవేశాలకై నిర్వహించే పీఈసెట్-2024 ఫిజికల్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పీఈసెట్ అభ్యర్థులకు ఈ నెల 25న ఉదయం 7 గంటల నుంచి ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) తెలిపింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని APSCHE సూచించింది.
విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల రెవెన్యూ కమిటీ తీర్మానం రాష్ట్ర అధ్యక్షుడు కోన.ఆంజనేయ కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్రసంఘం & APJAC కలిసి పనిచేయుటకు తీర్మానించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. వీఆర్వోల సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. మూడు జిల్లాల VROల సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
నంద్యాల పట్టణంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్కు కూత వేటు దూరంలోని సుద్దుల పేటలో హత్య జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భర్తను భార్యే కత్తెరతో పొడిచింది. తీవ్ర గాయాలైన అతడిని నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.