Andhra Pradesh

News June 23, 2024

కారంచేడు: ఉద్యోగం ఆశ చూపి రూ.5.30 లక్షల మోసం

image

మాయగాళ్ల బారిన పడి అలేఖ్య అనే యువతి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. పోలీసుల వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన జాగర్లమూడి అలేఖ్య అనే యువతి ఉద్యోగ వేటలో ఉండగా తన వాట్సప్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఉద్యోగం ఆశచూపి వారు అడిగినంత మొత్తం రూ.5.30 లక్షలు చెల్లించింది. చివరకు ఆ గ్రూపు డిలీట్ కావడంతో అలేఖ్యకు మోసం అర్థమైంది. గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్సై సురేష్ తెలిపారు.

News June 23, 2024

కోటిపల్లి- నరసాపురం రైల్వేలైన్ పూర్తికి కృషిచేస్తా: MP

image

కోనసీమ ప్రజలు ఎదురుచూస్తున్న కోటిపల్లి- నరసాపురం రైల్వేలైన్ పనులు వేగవంతం చేయడానికి కేంద్రం నుంచి నిధుల విడుదలకు కృషిచేస్తానని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ పేర్కొన్నారు. లోక్‌సభ టీడీపీ విప్‌గా పార్టీ అధినేత చంద్రబాబు నియమించిన సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ .. తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానని తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా సెంట్రల్ కాయర్ బోర్డ్ ద్వారా పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు.

News June 23, 2024

రెండేళ్లా?త్వరగా పూర్తి చేయండి మంత్రిగారు: నారా లోకేశ్

image

నిన్న జరిగిన శాసనసభ అనంతరం లాబీ వద్ద మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడికి వచ్చారు. దీంతో వారు ఇద్దరు పలకరించుకోని ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. అనంతరం లోకేశ్ మంత్రిగారూ.. త్వరగా ఎయిర్ పోర్ట్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయనను అడిగారు. వెంటనే కేంద్ర మంత్రి రెండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పాగా.. రెండేళ్లా?త్వరగా పూర్తి చేయండి అని లోకేశ్ కోరారు.

News June 23, 2024

ఉమ్మడి అనంతలో శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 30 మంది అర్హత

image

అనంతపురం జిల్లా నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కార్పొరేట్ సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి జిల్లా నుంచి 30 మంది అర్హత సాధించినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఎ. మురళీకృష్ణ తెలిపారు. జాతీయస్థాయిలో నిర్వహించిన శ్రేష్ఠ ప్రవేశ పరీక్షలో 30 మంది 3వేల లోపు ర్యాంకులు సాధించారని ఆయన తెలిపారు.

News June 23, 2024

నంద్యాల : మహిళపై చిరుత పులి దాడి..?

image

తనపై చిరుత పులి దాడి చేసిందని శనివారం ఓ మహిళ ఆరోపించారు. నంద్యాలలోని పచ్చర్ల గ్రామంలో షేక్ బీబీ అనే మహిళ తన ఇంట్లో నిద్రిస్తుండగా, చిరుత పులి అకస్మాత్తుగా వచ్చి తల భాగంపై దాడి చేసిందని, ఆమె కేకలు వేయడంతో సమీపంలోని అడవి ప్రాంతంలోకి పారిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 23, 2024

తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

image

తాడిపత్రి మండలంలోని బ్రాహ్మణపల్లిలో శనివారం రాత్రి వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి ఇంటి ముందు ఉన్న రహదారిపై వర్షపునీరు నిలబడుతున్నాయని మట్టిని ఎత్తుగా వేశారు. దీంతో ఆ నీరంతా టీడీపీ నాయకుడు కథాలప్ప ఇంటి ముందుకు రావడంతో మట్టిని ట్రాక్టర్ తో తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఐదు మందికి గాయాలయ్యాయి.

News June 23, 2024

కాకినాడ: అతిసారం.. భయంభయంగా ప్రజలు

image

కాకినాడ జిల్లాలో అతిసారం విజృంభిస్తోంది. పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండగా.. శనివారం ఓ మహిళ మృతి సమస్య తీవ్రతను తెలియజేస్తుంది. తొలుత తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడిలో ప్రభలిన ఈ వ్యాధి.. ఇప్పుడు సామర్లకోట మండలం వేట్లపాలెం జొన్నలదొడ్డి ప్రాంతానికి విస్తరించింది. 3 రోజుల్లో 31 మంది దీని బారినపడగా.. 15మంది ఆసుపత్రిలో చేరారు. మరోవైపు అధికారులు గ్రామాల్లో వైద్యశిబిరాలతో చికిత్స అందిస్తున్నారు.

News June 23, 2024

హోమ్ మినిస్టర్ అనిత పర్యటనలో అపశ్రుతి..!

image

హోంమినిస్టర్‌ వంగలపూడి అనితను కలవడానికి వచ్చిన బీజేపీ నాయకుడు గాయపడినట్లు సమాచారం. శనివారం తిరుమల దర్శనార్థం హోం మినిస్టర్ వెళ్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద తిరుపతి పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ నాయుడు వంగలపూడి అనితను సన్మానించడానికి వచ్చారు. కాన్వాయ్‌లోని ఓ వాహనం దూసుకెళ్లి ఢీకొట్టడంతో ఆయన గాయపడగా.. రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

News June 23, 2024

శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ బదిలీ

image

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియాను బదిలీ చేశారు. ఆమెను ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె అంతకుముందు అన్నమయ్య జిల్లా జేసీగా పని చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం అభివృద్ధికి ఆమె తన వంతుగా కృషి చేశారు.

News June 23, 2024

విషాదం.. సముద్రంలో ఏలూరు జిల్లా యువకులు మృతి

image

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరం వద్ద శుక్రవారం నలుగురు యువకులు గల్లంతు కాగా అందరూ చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన 11 మంది యువకులు సముద్ర స్నానం కోసం రామాపురం వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో తేజ(17), కిశోర్(18) అదే రోజు లభ్యం కాగా.. నితిన్ (18), అమల్ రాజు (18) మృతదేహాలు తాజాగా తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ మేరకు కేసు నమోదైంది.