India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 50వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనలకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ సూచించారు.
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్తో కాకినాడ, కోనసీమ జిల్లాల వైసీపీ నాయకులు సమావేశమయ్యారు. మాజీ మంత్రి తోట నరసింహం, ముద్రగడ పద్మనాభ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి, రాజా, ధనలక్ష్మి, కన్నబాబు, దొరబాబు, మాజీ ఎంపీ వంగా గీత ఉన్నారు. రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ త్రిమూర్తులు, మాజీ మంత్రులు విశ్వరూప్, సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ, జగ్గిరెడ్డి, సూర్య ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈనెల 28న పెదతాడివాడ గ్రామం నుంచి సిరిమాను వృక్షాన్ని తరలించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుకుంపేట వద్ద సిరిమాను వృక్షాన్ని తరలించేందుకు వడ్రంగులు ఎడ్ల బండిని తయారు చేస్తున్నారు. ఈ ఎడ్ల బండి పైన సిరిమాను, ఇరుసుమాను వృక్షాలను భారీ ఊరేగింపు నడుమ దేవస్థానం వద్దకు తరలించిన అనంతరం సిరిమానుగా మలుస్తారు.
పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విశాఖలోని నోవాటెల్లో అధికారులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఆ కమిటీ ఛైర్పర్సన్ మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కార్మిక శాఖ కార్యదర్శి ఏం.ఏం.నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జిల్లాలోని పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాలపై వీరు సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేశారు.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కీలక పదవిని దక్కించుకున్నారు. ప్రతిష్ఠాత్మకమైన పార్లమెంట్ కమిటీ ఆన్ ఫైనాన్స్ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల అయింది. పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభ సభ్యుల జాబితాలో వేమిరెడ్డి పేరు ఉండటంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. పెన్న అహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తి కోట, పుట్టపర్తి, ఆలూరు కోన, కసాపురం, జంబు ద్విపా, యోగి వేమన సమాధి, కదిరి నరసింహ స్వామి ఆలయం ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day
విశాఖ ఎంపీ శ్రీభరత్ పార్లమెంటరీ కామర్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని గురువారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. విశాఖలో ఎంపీ శ్రీభరత్ కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. నియామకం అనంతరం, జిల్లాలోని కూటమి నాయకులు, సమాఖ్య ప్రతినిధులు ఎంపీ శ్రీభరత్కి అభినందనలు తెలియజేశారు.
మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం ధర్మమా అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి తిరుమల బయల్దేరనున్న జగన్.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 363 మద్యం షాపులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో మొత్తం 161 షాపులకు గానూ అన్ రిజర్వ్ షాపులు 141, కల్లుగీత కార్మికులకు 19, సొండిలకు 1 కేటాయించినట్లు తెలుస్తోంది. అల్లూరి జిల్లాలో మొత్తం 37 షాపులన్నీ అన్ రిజర్వ్ చేయగా.. అనకాపల్లి జిల్లాలోని మొత్తం 165 షాపులకు అన్ రిజర్వ్ షాపులు 151, కల్లుగీత కార్మికులకు 14 షాపులు కేటాయించినట్లు సమాచారం.
పండుగల సందర్భంగా విజయవాడ మీదుగా MGR చెన్నై సెంట్రల్(MAS), షాలిమార్(SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02841 SHM- MAS ట్రైన్ను ఈ నెల 30 నుంచి నవంబర్ 18 వరకు ప్రతి సోమవారం, నం.02842 MAS-SHM ట్రైన్ను అక్టోబర్ 2 నుంచి నవంబర్ 20వరకు ప్రతి బుధవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ ట్రైన్లు విజయనగరం, రాజమండ్రి, గూడూరు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.