India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జర్నలిస్టుల ప్రమాద భీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరిస్తామని, సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కారం చేస్తామని మంత్రి కొలుసు పార్థ సారథి హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం తాడిగడపలోని మంత్రి కార్యాలయంలో పార్థసారథిని కలిశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా సీతారాములకు ఘనంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గల కళ్యాణ వేదిక వద్ద ప్రత్యేక మండపం ఏర్పాటు చేసి సీతారాములను కొలువు తీర్చి ఆలయ అర్చకులు కళ్యాణ తంతు నిర్వహించారు. స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
మీకోసం పేరుతో ఈనెల 24 నుంచి ప్రజా సమస్యల పరిష్కార, ఫిర్యాదుల వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. సోమవారం ఉదయం10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరించి వాటికి సత్వర పరిష్కారం చేపడతామని చెప్పారు. సంబంధిత అధికారులు తప్పక హాజరుకావాలన్నారు.
ఇప్పటి వరకు కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన డా.సృజన తనదైన మార్క్ వేశారు. గత ఎడాది ఏప్రిల్ 11న బాధ్యతలు చేపట్టిన సృజన దాదాపు 15 నెలలపాటు కలెక్టర్గా సేవలందించారు. కాగా కలెక్టర్ హోదాలో సృజనకు కర్నూలు జిల్లా తొలి పోస్టింగ్. గతంలో ఆమె తండ్రి బలరామయ్య కూడా ఇదే జిల్లా కలెక్టర్గా సేవలందించారు. తండ్రికి తగ్గ కుమార్తెగా సృజన కర్నూలు జిల్లాను అభివృద్ధిలో తనదైన పరిపాలనతో పరుగులు పెట్టించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆమె స్థానంలో దినేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన ఇది వరకు ప్రకాశం జిల్లాకు కలెక్టర్గా పని చేశారు.
➤ తూ.గో కలెక్టర్ కె.మాధవీలత బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్న పి.ప్రశాంతి కలెక్టర్గా రానున్నారు. మాధవీలత జీఏడీకి రిపోర్ట్ చేస్తారు.
➤ కాకినాడ కలెక్టర్ జె.నివాస్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చిత్తూరు కలెక్టర్గా ఉన్న షన్మోహన్ రానున్నారు. నివాస్ జీఏడీకి రిపోర్ట్ చేయనున్నారు.
➤ ప.గో కలెక్టర్ సుమిత్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో టెక్నికల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్గా ఉన్న సి.నాగారాణి కలెక్టర్గా రానున్నారు. సుమిత్ను చిత్తూరు కలెక్టర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
➤ ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఉన్న వెట్రీ సెల్వీ ఏలూరు కలెక్టర్గా రానున్నారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సారియా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమీమ్ అన్సారియా గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ డైరెక్టర్ గా, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. కొత్త కలెక్టర్ కు జిల్లాలో నీటి ఎద్దడి, కరవు లాంటి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వీటిని అధిగమించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిద్దాం.
విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి శనివారం బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా నాగలక్ష్మి గుంటూరు జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో జిల్లా కలెక్టర్ గా బి.ఆర్.అంబేడ్కర్ నియమితులయ్యారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష బదిలీ అయ్యారు. ఆయనను కర్నూలు జిల్లాకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ చామకూరి శ్రీధర్కు ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. నూతన కలెక్టర్ నియమితులయ్యే వరకు ఈయనే బాపట్ల జిల్లా కలెక్టర్గా వ్యవహరించనున్నారు.
Sorry, no posts matched your criteria.