India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వర్ణాంధ్ర 2047మిషన్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కలెక్టర్ జి. సృజన పిలుపునిచ్చారు. https://swarnandhra.ap.gov.in/suggestions అధికారిక వెబ్సైట్లో ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ విజన్ కోసం తమ ఆలోచనలు, సలహాలను పంచుకోవాలని ఆమె కోరారు. ఈ వెబ్సైట్లో ఆయా అంశాలపై సలహాలు ఇవ్వాలని ఆమె తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం తెలిపారు. పెదవేగిలో 56.0 మి.మీ, ద్వారకాతిరుమల 49.6, కామవరపుకోట 41.2, జంగారెడ్డిగూడెం 34.8, భీమడోలు 28.6, బుట్టాయిగూడెం 26.8, పోలవరం 22.2, దెందులూరు 12.6, కొయ్యలగూడెం 12.4, పెదపాడు 10.2, ఏలూరు అర్బన్ 7.2, ఏలూరు రూరల్ 6.4 మి.మీ నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో స్వల్ప వర్షపాతం నమోదు అయిందన్నారు.
గత ఐదేళ్లలో హిందువులపై అనేక అఘాయిత్యాలు జరిగాయని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ తిరుపతిలో ఆరోపించారు. హిందుత్వానికి కష్టం వచ్చిందని, అందరం ఒక్కటై కాపాడుకోవాలన్నారు. ఈ సమయంలో పార్టీలు, వర్గాలుగా విడిపోతే చాలా ప్రమాదం అన్నారు. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని తెలిపారు. జగన్ ఏనాడైనా ఆయన సతీమణిని దర్శనానికి తీసుకొచ్చారా.? అని స్వామీజీ ప్రశ్నించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 223 <<14205579>>మద్యం షాపు<<>>లకు ప్రభుత్వం అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో మొత్తం 165 షాపులకు గాను అన్ రిజర్వ్ షాపులు 149, కల్లుగీత కార్మికులకు 15, సొండిలకు 1 కేటాయించినట్లు తెలుస్తోంది. పార్వతీపురం జిల్లాలో 58 షాపులకు అన్ రిజర్వ్ 53, కల్లుగీత కార్మికులకు 5 షాపులు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 30న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రానున్నారు. పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంత్యుత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రమంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనో హర్, స్థానిక శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్ర ఈ సభలో పాల్గొననున్నారు. సభ నిర్వహణకు ఇన్చార్జ్ వీసీ ఆచార్య గంగాధర్ 8 కమిటీలను నియమించారు.
వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుపతిలో టెన్షన్ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తిరుపతి, తిరుమలలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. జగన్ పర్యటనకు రావొద్దంటూ వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. పలువురిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు రేణిగుంట విమానాశ్రయంలోనే జగన్కు నోటీసులు ఇచ్చి శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం వెనక్కి పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ-రాజమండ్రి మెము స్పెషల్ రైలును ఈ నెల 30వ తేదీన దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30న విజయవాడ-రాజమండ్రి మెము రైలు(నం.07768) రద్దు చేసిన విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థం ఉత్తరాంధ్రకే పెద్ద వరంగా చెప్పొచ్చు. సహజసిద్ధంగా ఉండే బోడికొండ ప్రకృతి ప్రేమికులను తన చెంతకు రప్పించుకుంటుంది. రాముడు నడయాడిన నేలగా కొండపై ఎన్నో చారిత్రక ఆనవాళ్లున్నాయి. దుర్గాభైరవకొండ, గురు భక్తుల కొండ మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంతటి ఘనకీర్తి ఉన్నప్పటికీ కనీసం రహదారి సదుపాయం కూడా లేదు. ప్రభుత్వం దృష్టిపెడితే గొప్ప పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ఎటు చూసినా పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్లు, ఉరికే జలపాతాలు, విశాలంగా సముద్ర తీరం, పెంచలకోన, రంగనాథస్వామి దేవాలయం, ఉదయగిరి కోట, సోమశిల డ్యాం ప్రాజెక్ట్, దేశానికే తలమానికంగా నిలిచే శ్రీహరి కోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ చూపరులను కట్టి పడేస్తుంది. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో భాగంగా కడప జిల్లా వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తిరుపతి 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో లాంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.
Sorry, no posts matched your criteria.