India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాపట్ల జిల్లా ఈపురుపాలెంలో యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో హత్య జరిగినట్లు స్థానికులు తెలిపారు. గర్ల్స్ హై స్కూల్ ప్రహరీ గోడ, రైల్వే పట్టాల ఎదురుగా చెట్ల మధ్య మృతదేహం పడి ఉందన్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ వకుల్ జిందాల్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతి చెందిన యువతి సుచరిత(21)గా గుర్తించారు.
తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమోషన్పై మైనింగ్ శాఖ కమిషనర్గా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా జేసీ ధ్యానచంద్రను నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసే శాలువాతో సత్కరించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 2019, 2024లో శాసనసభలో ముగ్గురు మాత్రమే అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్ ఈ సారి నూజివీడు, మైలవరం నియోజకవర్గాల టీడీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. 2019తో పాటు తాజా ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన గద్దె రామ్మోహన్ మరోమారు అసెంబ్లీకి వెళ్లారు.
కడప పట్టణంలోని ప్రభుత్వ డిఎల్టీసి ఐటిఐలో ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డిఎల్టీసి అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఐటిఐ ఫైనల్ ఇయర్ చదువుతూ ఏఐటిటి – 2024 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు, ఐటిఐ పాసైన విద్యార్థులందరూ హాజరు కావచ్చని తెలిపారు.
చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత (21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు రేప్ చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం అమరావతిలో కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పెద్దిరెడ్డితో పాటు ఇతరులకు జగన్ దిశానిర్దేశం చేశారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన వేమన వెంకట సురేశ్కు కెనడాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడ ప్రఖ్యాత ఆల్బెర్టా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ రిప్రజెంటేటివ్గా కెనడా ప్రభుత్వం ఆయనను నియమించింది. ప్రస్తుతం ఆయన కెనడాలో టెక్నికల్ హైస్పీడ్ రైల్వే ప్రాక్టీస్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. 10వ తరగతి వరకు చుంచులూరు ప్రభుత్వ స్కూల్లోనే సురేశ్ చదివారు.
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను జూన్ 24న ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్వెల్, ఫాస్ట్ట్రాక్, తదితర కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో, తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.
నోబుల్ కళాశాలలో ఈ నెల 23న సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా హాకీ సంఘ కార్యదర్శి హరికృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 1995, జనవరి 1 కంటే ముందు జన్మించిన ఆటగాళ్లు ఎంపిక పోటీలకు ధ్రువపత్రాలతో 23న ఉదయం 8 గంటలకు నోబుల్ కళాశాలకు రావాలని చెప్పారు. ఎంపికైనవారు అంతర్ జిల్లాల పోటీలలో కృష్ణా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు.
గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసురావు ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ఆయన చేత ప్రమాణం చేయించారు. కాగా ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యుక్షుడిగా పనిచేస్తున్నారు. ఈసారి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై భారీ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఆయన ప్రమాణస్వీకారం చేసే సమయంలో మిగతా సభ్యులు చప్పట్లతో అభినందించారు.
Sorry, no posts matched your criteria.