Andhra Pradesh

News June 21, 2024

నేడు గుంటూరుకు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని

image

కేంద్ర సహాయమంత్రిగా భాద్యతలు స్వీకరించిన గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నేడు తొలిసారి గుంటూరుకు రానున్నారు. మధ్యాహ్నం 03:30 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టోల్ ప్లాజా నుంచి శ్రీ కన్వెన్షన్ హాల్ వరకు, కార్యకర్తలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం.. శ్రీ కన్వెన్షన్ హాల్లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు.

News June 21, 2024

ఎచ్చెర్ల: 99.44 శాతం ఉత్తీర్ణత

image

డా.బిఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. డిగ్రీ ఆరో సెమిస్టర్‌కు 9,832 మంది విద్యార్థులకు గాను 9,777 మంది (99.44 శాతం) ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ డీన్ ఎస్ ఉదయ్ భాస్కర్ వివరాలను వెల్లడించారు. బీఈడీ మూడో సెమిస్టర్లో 1,027 కి 875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.

News June 21, 2024

కడప: నేడే మీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి కడప జిల్లా నుంచి TDP తరఫున ఐదుగురు, BJP నుంచి ఒకరు, జనసేన నుంచి ఒకరు, YCP తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ 10 మంది నియోజకవర్గ MLAగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ MLA నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News June 21, 2024

నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ తరఫున 10 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ 12 మంది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ ఎమ్మెల్యే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ప్రజలు అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News June 21, 2024

అనంతపురం: నేటి నుంచి కిలో పచ్చిమిర్చి రూ.42

image

పచ్చిమిర్చి ధరలు ఆకాశనంటుతున్నాయి. సామాన్య ప్రజలు కొనలేక ఇబ్బందులు పడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.42కే ఇవ్వాలని నిర్ణయించింది. రైతు బజార్లలో విక్రయాలు చేపట్టాలని జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదేశించింది. కడప జిల్లా పులివెందుల నుంచి పచ్చిమిర్చిని తెప్పించింది. బహిరంగ మార్కెట్‌లో పచ్చిమిరప రూ.70 నుంచి 80 ఉండడంతో శుక్రవారం నుంచి అనంత ఎన్టీఆర్ రైతు బజార్‌లో రూ.42కే విక్రయాలు ప్రారంభమవుతున్నాయి.

News June 21, 2024

విక్రమ సింహపురికి అదనపు కోచ్‌ల ఏర్పాటు

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విక్రమ సింహపురి అమరావతి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కు మూడు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేశామని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ-గూడూరు(12744) రైలుకు ఈనెల 20 నుంచి 30 వరకు.. గూడూరు-విజయవాడ(12743) రైలుకు ఈనెల 21 నుంచి జులై ఒకటి వరకు అదనపు కోచ్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇవి సెకండ్ సిట్టింగ్‌కు సంబంధించినవి.

News June 21, 2024

పల్నాడు: తల్లీబిడ్డా మృతి.. కారకులపై కఠిన చర్యలు

image

విజయపురిసౌత్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 17న పురిటి బిడ్డతోపాటు తల్లి పావని మృతి చెందిన ఘటనపై, సమగ్ర విచారణతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఆరోగ్య సేవల కో-ఆర్డినేటర్‌ (DCHS) రంగారావు తెలిపారు. విచారణ నిమిత్తం గురువారం ఆస్పత్రికి  వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. తల్లీబిడ్డా మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నానన్నారు.

News June 21, 2024

నంద్యాల: ఎస్సై మారుతీ శంకర్‌కు ఏడాది జైలు శిక్ష

image

పగిడ్యాల మండలంలో పనిచేసిన ఎస్సై మారుతీ శంకర్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి దివ్య గురువారం తీర్పునిచ్చారు. ఘనపురంలో 2015లో నరేంద్రరెడ్డి అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు. కేసు విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు రావాలని నరేంద్రరెడ్డిని ఎస్సై పిలవగా వారెంట్ ఉంటేనే వస్తానని చెప్పాడు. దీంతో ఎస్సై కోపంతో దాడిచేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు.

News June 21, 2024

శ్రీకాకుళంలో 26న సైకిల్ ర్యాలీ: ఎస్పీ రాధిక

image

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక తెలిపారు. ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 26వ తేదీ ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి 7 రోడ్డు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. యువత ఉత్సాహంగా పాల్గొనాలని, డగ్స్ వల్ల కలిగే  అనర్థాలపై అవగాహన కోసమే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News June 21, 2024

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన పోలవరం ఎమ్మెల్యే

image

ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం పలు అంశాలపై చర్చించారు.