Andhra Pradesh

News September 27, 2024

కృష్ణా: రాజమండ్రి మెము స్పెషల్ రైలు రద్దు

image

కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ-రాజమండ్రి మెము స్పెషల్ రైలును ఈ నెల 30వ తేదీన దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30న విజయవాడ-రాజమండ్రి మెము రైలు(నం.07768) రద్దు చేసిన విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.

News September 27, 2024

World Tourism Day: ఉత్తరాంధ్ర వరం రామతీర్థం

image

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థం ఉత్తరాంధ్రకే పెద్ద వరంగా చెప్పొచ్చు. సహజసిద్ధంగా ఉండే బోడికొండ ప్రకృతి ప్రేమికులను తన చెంతకు రప్పించుకుంటుంది. రాముడు నడయాడిన నేలగా కొండపై ఎన్నో చారిత్రక ఆనవాళ్లున్నాయి. దుర్గాభైరవకొండ, గురు భక్తుల కొండ మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంతటి ఘనకీర్తి ఉన్నప్పటికీ కనీసం రహదారి సదుపాయం కూడా లేదు. ప్రభుత్వం దృష్టిపెడితే గొప్ప పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.

News September 27, 2024

World Tourism Day: మీకు నచ్చిన స్పాట్ ఏది?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ఎటు చూసినా పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్లు, ఉరికే జలపాతాలు, విశాలంగా సముద్ర తీరం, పెంచలకోన, రంగనాథస్వామి దేవాలయం, ఉదయగిరి కోట, సోమశిల డ్యాం ప్రాజెక్ట్, దేశానికే తలమానికంగా నిలిచే శ్రీహరి కోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ చూపరులను కట్టి పడేస్తుంది. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.

News September 27, 2024

కడప: వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు

image

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనలో భాగంగా కడప జిల్లా వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తిరుపతి 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో లాంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

News September 27, 2024

ప.గో జిల్లా వర్షపాతం వివరాలు

image

భీమవరం జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 33.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని జిల్లా కలెక్టర్ నాగరాణి శుక్రవారం తెలిపారు. పాలకోడేరు 9.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. తాడేపల్లిగూడెం 5.4, యలమంచిలి 4.4, పెనుమట్ర 4.0, ఇరగవరం 3.4, పోడూరు 2.4, పెంటపాడు 1.8, ఆకివీడు- పాలకొల్లు మండలాలలో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని స్పష్టం చేశారు.

News September 27, 2024

ఏలూరు జిల్లాలో రేపు వైసీపీ శ్రేణుల పూజలు

image

కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేయాలని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. 100 రోజుల పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికి జంతువుల కొవ్వుతో లడ్డూ తయారీ అంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి వైసీపీపై అభాండాలు వేస్తున్నారన్నారు.

News September 27, 2024

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి 12 గంటలకు వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా ఐటీ పాలసీపై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం మున్సిపల్ శాఖపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు విజయవాడలో జరిగే వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలో పాల్గొంటారు.

News September 27, 2024

మీ ఫేవరెట్ పర్యాటక ప్లేస్ ఏది?

image

అనంతపురం జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. పెన్న అహోబిలం, లేపాక్షి, పెనుకొండ కోట, తిమ్మమ్మ మర్రిమాను, గుత్తి కోట, పుట్టపర్తి, ఆలూరు కోన, కసాపురం, జంబు ద్విపా, యోగి వేమన సమాధి, కదిరి నరసింహ స్వామి ఆలయం ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day

News September 27, 2024

కర్నూలు: పెన్షన్లకు రూ.102.97 కోట్లు

image

అక్టోబర్ నెలలో కర్నూలు జిల్లాలో పెన్షన్ల పంపిణీకి గాను రూ.102.97 కోట్ల నిధులు విడుదలైనట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ సలీం బాషా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,41,843 పెన్షన్లకు నగదు మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎంపీడీవోలు డ్రా చేసుకుని నేరుగా సచివాలయ ఉద్యోగులకు అందజేయాల్సి ఉంటుందని తెలిపారు.

News September 27, 2024

World Tourism Day: శ్రీకాకుళం జిల్లాలో మీకు నచ్చిన స్పాట్ ఏది?

image

శ్రీకాకుళం జిల్లాలో పురాతన ఆలయాలు, బీచ్ లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అరసవిల్లి, తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం, దంతపురి, శ్రీముఖలింగంతో పాటు పలు ప్రాంతాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. వీటితో పాటు కళింగపట్నం , భావనపాడు,బారువ బీచ్‌లు ఉల్లాసంగా గడిపేందుకు తోడ్పాటునిస్తున్నాయి. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.