India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో కారుపై పెద్దపులి దాడి చేసినట్లు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కారును పరిశీలించిన అధికారులు.. దానిపై ఎలాంటి జంతువు దాడి చేయలేదని తేల్చారు. ఎక్కడో ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, లేదా ఇతర ప్రయోజనాల కోసం యజమాని ఇలా చేశారని తెలుస్తోంది. పెద్దపులి దాడి అంటూ అధికారులు, మీడియాను తప్పుదోవ పట్టించిన యజమానిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా నిన్న బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే పవన్ 10 గంటలపాటు సమీక్షలు నిర్వహించినట్లు జనసేన తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసింది.
రుషికొండ భవనాలపై టీడీపీ చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందిచారు. ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనాలను జగన్ ఇళ్లు అన్నట్లు టీడీపీ ప్రచారం చేస్తోందని, ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన అవసరం జగన్కు లేదన్నారు. ఫలితాల అనంతరం వైసీపీ నేతలపై దాడులు పెరుగుతున్నాని, వాటికి తాము ఏమాత్రం భయపడమన్నారు. కూటమి ప్రభుత్వం హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలన్నారు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షల అభ్యర్థులు రోడ్డు ఎక్కారు. నోటిఫికేషన్లు విడుదలవుతున్న సమయంలో చదువుకునేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు ఆడిటోరియం గదిని కేటాయించాలని కోరుతూ అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులతో మాట్లాడి అభ్యర్థులకు గదిని అందించారు.
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం ముక్కవారిపల్లిలో ఎస్వీ కళ్యాణ్ మండపం దగ్గర జాతీయ రహదారిపై కారును లారీ ఢీ కొన్న సంఘటనలో కారు నుజ్జైంది. కారులో డ్రైవర్తో పాటు నలుగురు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి సిమ్స్కు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించి కేసు నమోదుచేశారు.
చెట్టుకు ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామానికి చెందిన చంద్రమౌళి(45) గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కరణాలు తెలియాల్సి ఉంది.
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 17ఏళ్ల యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్లోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక రెండో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన యువకుడు పండ్లు ఇస్తానని ఆశచూపి ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి పిల్లలు బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండపల్లి శ్రీనివాస్ గురువారం మంగళగిరిలో మధ్యతరహా పరిశ్రమ, SERP, NRI వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనవంతుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆయన వెంట కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.
TDP అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్ పదవులపై ఆ పార్టీ నాయకుల ఆశలు పెరుగుతున్నాయి. వీటితోపాటు రేషన్ డీలర్షిప్, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర పోస్టుల కోసం గ్రామ, మండల స్థాయి నాయకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఓ నియోజకవర్గ స్థాయిలో 150 నుంచి 170 వరకు, మండల స్థాయిలో 40-60 వరకు వివిధ రకాల పోస్టులు ఉన్నట్లు TDP శ్రేణులు క్షేత్రస్థాయిలో లెక్కలేసుకుని తమకు ఏ పదవులు కావాలో నిర్ణయించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గురువారం మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.