India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం పాతూరు మార్కెట్లోని కూరగాయల ధరలు కిలో రూ.లలో టమాటా (మేలు రకం)రూ.80, రెండో రకం రూ.50, మిరపకాయలు రూ.80, ఉల్లిపాయలు (మేలురకం)రూ.40, రెండోరకం రూ.30, బంగాళాదుంప రూ.40, బీన్స్ రూ.60, క్యారెట్ (మేలు రకం) రూ.40, వంకాయలు రూ.20, బెండకాయలు రూ.30, ముల్లంగి రూ.30, బీట్ రూట్ రూ.40, బీరకాయలు రూ.40, కాకరకాయలు రూ.40, క్యాబేజీ రూ.40, మునగ కాయలు రూ.60, నిమ్మకాయలు (వంద)రూ.400 పలుకుతుంది.
జిల్లాలో మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గంజాయిని నిర్మూలించేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. బాధితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. వంద రోజుల్లో స్పష్టమైన మార్పు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
నడికుడి, పొందుగుల రైల్వే స్టేషన్ మధ్య గురువారం రైలు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. అతని ముఖం గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. నలుపు రంగు ప్యాంట్ ధరించి వున్నాడు. కుడి చేతిపైన ఆంజనేయస్వామి బొమ్మ పచ్చబొట్టు ఉంది. మృతుడి బంధువులు నడికుడి పోలీసులను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.
వృద్ధురాలి గొంతుకోసి బంగారు, నగదు దోచ్చుకెళ్లిన ఘటన గురువారం వెలుగుచూసింది. స్థానికలు వివరాల ప్రకారం.. మడకశిర మండలం ఎల్కోటి గ్రామానికి చెందిన వడ్డే చంద్రక్క అనే వృద్ధురాలు నిద్రిస్తుండగా చోరికి దుండగులు చోరికి పాల్పడ్డారు. ఆమె గొంతుకోసి ఇంటి చెవిలో కమ్మలు, ఇంట్లో రూ.25వేలు చోరీ చేసి ఆమెను ఇంటి ఆవరణలో పడేశారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనా స్థలాని చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
తిరుపతి కేంద్రంగా భారత, ఆంధ్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లయిడ్ న్యూట్రీషియన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.రమణప్రసాద్ తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాస్ లేక ఫెయిల్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కాకినాడలోని జిల్లా వికాస కార్యాలయంలో శుక్రవారం జెన్పాక్ట్ కంపెనీలో ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన 28 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఈ ఇంటర్వ్యూల కోసం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని శుక్రవారం ఉదయం 9 గంటలలోపు ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.
కొత్తపేట విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.పెద్దిరాజు తెలిపారు. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఐటెక్ సాఫ్ట్వేర్ తదితర కంపెనీలు పాల్గొంటాయన్నారు. మొత్తం ఖాళీలు 316 ఉన్నాయన్నారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో బీపీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదల అయింది. జూన్ 28, 29, జూలై 1, 2 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
కావలికి చెందిన బీద రవిచంద్ర టీడీపీ కీలక నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. గతంలో ఎమ్మెల్సీగా పని చేశారు. తాజాగా రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఈక్రమంలో మరోసారి రవిచంద్రకు చంద్రబాబు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని ఆయన అనుచరులు ఉంటున్నారు.
వెల్దుర్తి మండలం చెరుకులపాడులో టీడీపీ కార్యకర్త కొమ్ము రామాంజనేయులు(62) చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. 8 రోజుల
కిందట చెరుకులపాడులో కుక్క కాటుకు గురయ్యాడని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని తెలిపారు. మృతుడి కుటుంబాన్ని రైతు సంఘం అధ్యక్షుడు ఈదుల వెంకటరాముడు పరామర్శించారు.
Sorry, no posts matched your criteria.