Andhra Pradesh

News September 27, 2024

World Tourism Day: మీకు నచ్చిన స్పాట్ ఏది?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ఎటు చూసినా పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్లు, ఉరికే జలపాతాలు, కొండలను చుట్టిన పాములా మెలికలు తిరిగిన ఘాట్‌ చూపరులను కట్టి పడేస్తాయి. అటు తిరుమల కొండలు, చంద్రగిరి కోట, కళ్యాణి డ్యాం, కైగల్ జలపాతం, కాణిపాకం టెంపుల్, హార్సిలీ హిల్స్ అందాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.

News September 27, 2024

World Tourism Day: తూ.గో జిల్లాలో నచ్చిన స్పాట్ ఏది?

image

తూ.గో జిల్లాలోని పురాతన ఆలయాలు పర్యాటక కేంద్రాలుగా నిలుస్తున్నాయి. ఎటు చూసినా పచ్చని పొలాలు, నదులు చూపరులను కట్టి పడేస్తాయ్. ముఖ్యంగా ఈ జిల్లాలో మారేడుమిల్లి సమీపంలోని జలతరంగిణి జలపాతాన్ని చూసేందుకు ఇతర ప్రాంత వాసులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.

News September 27, 2024

నెల్లూరు మార్కెట్లో కాక పుట్టిస్తున్న కొబ్బరి ధరలు

image

నెల్లూరు మార్కెట్లో కొబ్బరి ధరలు సామాన్యులకు కాక పుట్టిస్తున్నాయి. కొబ్బరి, కొబ్బరికాయ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. కొబ్బరికాయ రూ.25 నుంచి రూ.40కి పెరిగింది. కొద్ది రోజుల్లో రూ.70కు చేరుతుందని వ్యాపారులు తెలిపారు. ఎండు కొబ్బరి కిలో రూ.130 ఉండగా తాజాగా రూ.200 దాటింది. కేరళలో జరిగిన ప్రకృతి విపత్తు కారణంగానే ధరలు పెరిగినట్లు పలువురు తెలిపారు.

News September 27, 2024

విశాఖ: నేటి నుంచి రెండురోజుల పాటు జాబ్ మేళా

image

కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రెండు రోజులు పాటు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం నిర్వహించే జాబ్ మేళాలో డిప్లమో ఇంజనీర్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.డిప్లమో, బిటెక్ మెకానిక్ అండ్ మెకట్రానిక్ కోర్సులు చేసినవారు అర్హులుగా పేర్కొన్నారు.

News September 27, 2024

చింతలపూడి: చెరువులో శవమై తేలిన యువకుడు

image

చింతలపూడి మండలం రేచర్ల గ్రామానికి చెందిన నాగరాజు (26)మంగళవారం ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతనే ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గురువారం స్థానిక పశువుల కాపరులు చెరువులో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులకు సమాచారం అందించడంతో మృతదాహాన్ని బయటకు తీయగా నాగరాజుగా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 27, 2024

ఉదయం 8 గంటలకు సిరిమాను చెట్టుకు పూజలు

image

డెంకాడ మండలం పెదతాడివాడలో గుర్తించిన పైడితల్లి అమ్మవారి సిరిమాను చింతచెట్టు నగరానికి శనివారం తీసుకురానున్నారు. శనివారం ఉదయం 8 గంటలకు సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, చెట్టును కొట్టే కార్యక్రమం చేపడతారు. అనంతరం భారీ ఊరేగింపుతో ఆ చెట్లను పలు కూడళ్ళ మీదుగా పూజారి స్వగృహం ఉన్న హుకుంపేట తరలిస్తారు. అక్కడ నిపుణులైన వడ్రంగులు ఈ చెట్టును సిరిమానుగా మలిచే పని మొదలు పెడతారు.

News September 27, 2024

కృష్ణా జిల్లాలో ఆర్డీఓల బదిలీ

image

జిల్లాలోని మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ RDOలు బదిలీ అయ్యారు. మచిలీపట్నం ఆర్డీఓ ఎం. వాణి నూజివీడు ఆర్డీఓగా బదిలీ అవ్వగా ఆమె స్థానంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కె.స్వాతిని నియమించారు. ఉయ్యూరు RDO రాజు నర్సాపురం RDOగా బదిలీ అయ్యారు. పి. సంపత్ హేలా షారోన్ ఉయ్యూరు RDOగా రానున్నారు. గుడివాడ RDO పద్మావతి GADలో రిపోర్ట్ చేయమని ఆదేశించగా గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యంను RDOగా నియమించారు.

News September 27, 2024

మీ ఫేవరెట్ పర్యాటక ప్లేస్ ఏది?

image

ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యాటకులకు స్వర్గధామం. ఎన్నో దర్శనీయ స్థలాలు మన జిల్లాలో ఉన్నాయి. శ్రీశైలం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, యాగంటి, కొండారెడ్డి బురుజు, యల్లర్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్ ఇలా ఎన్నో మధురానుభూతులు పంచే పర్యాటక ప్రాంతాలు మన జిల్లా సొంతం. మరి జిల్లాలో మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి..
#World Tourism Day

News September 27, 2024

నేడు తాడేపల్లి నుంచి తిరుమలకు జగన్.. షెడ్యూల్ ఇదే.!

image

వైసీపీ అధినేత YS జగన్ శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి 4.50 గంటలకు రేణిగుంటకు విమానంలో చేరుకుంటారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకొని, 28వ తేదీన స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొంది. అనంతరం బెంగుళూరులోని నివాసానికి జగన్ చేరుకుంటారని సమాచారం వెలువడింది.

News September 27, 2024

World Tourism Day: విశాఖలో నేడు ఎంట్రీ ఫ్రీ

image

VMRDA పరిధిలోని పార్కుల్లో శుక్రవారం ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు కమిషనర్ విశ్వనాథన్ వెల్లడించారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా సబ్‌మెరై‌న్‌, వుడా పార్క్, కైలాసగిరి, YSR సెంట్రల్ పార్క్, సీ హారియర్, టీ.యూ 142, తెలుగు మ్యూజియంతో పాటు తదితర పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. >>Share it