Andhra Pradesh

News June 17, 2024

వైయస్ జగన్ కడప జిల్లా పర్యటన వాయిదా

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన వాయిదా పడింది. రేపటినుండి 5 రోజులు పాటు జిల్లాలో ఇడుపులపాయతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన ఉండగా..19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉన్న కారణంగా పర్యటనను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News June 17, 2024

విశాఖ: విమానాశ్రయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఘన స్వాగతం

image

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత విశాఖ వచ్చిన పల్లా శ్రీనివాసరావుకి విమానాశ్రయంలో పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన శ్రీనివాసరావుకు తాతయ్యబాబు శుభాకాంక్షలు తెలిపారు.

News June 17, 2024

శ్రీకాకుళం జిల్లాకు రేపు వర్ష సూచన- APSDMA

image

రేపు మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న పార్వతీపురం, అల్లూరి, విజయనగరం జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడ వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.

News June 17, 2024

విజయవాడ: ఈనెల 19న వైసీపీ నేతలతో జగన్ సమావేశం

image

ఈనెల 19వ తేదీన రాష్ట్రంలోని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, ఎమ్మెల్యేలు ఎంపీలతో మాజీ సీఎం జగన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు అందరికీ ఆహ్వానాలు ప్రకటించారు. ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వైసీపీ నాయకులు అందరికీ ఆహ్వానం పంపించినట్లు వైసీపీ కార్యాలయం తెలిపింది.

News June 17, 2024

రేపు గుంటూరు జిల్లాకు వర్ష సూచన

image

గుంటూరు జిల్లాలో మంగళవారం వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఆస్కారం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. మరోవైపు, పొరుగున ఉన్న కృష్ణా జిల్లాలోనూ వర్షాలు పడతాయని APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 17, 2024

రైల్వే కోడూరు: విద్యుత్ షాక్‌తో లారీ దగ్ధం.. మహిళ మృతి

image

రైల్వే కోడూరు ఓబులవారిపల్లి మండలం బొమ్మవరం దగ్గర విద్యుత్తు లైన్ బొప్పాయి లారీకి తగిలి లారీ దగ్ధమైంది. అందులో 30 మంది కూలీలు ఉన్నారు. మంగమ్మ మరణించగా మిగతా కూలీలు లారీ నుంచి దూకి పరిగెత్తారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిని తిరుపతి రూయాకు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 17, 2024

ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేయాలి: చంద్రబాబు

image

ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిలా పని చేయాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరావు సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యతను అప్పగించినట్లు చంద్రబాబు ఆయనకు చెప్పారు.

News June 17, 2024

ATP: ఎన్నికల వేళ రాజీనామా.. ఖాళీలు ఎన్నంటే?

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాలంటీర్ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు వందల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తీరా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇవ్వడంతో మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలంటూ రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఉమ్మడి అనంత జిల్లాలో 8591 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

News June 17, 2024

కోనసీమ జిల్లాలో రామోజీరావు విగ్రహం తయారీ

image

కొత్తపేట శిల్పి రాజ్‌కుమార్ వుడయార్ ‘ఈనాడు’ అధినేత రామోజీరావు విగ్రహాన్ని తయారు చేశారు. విజయనగరం MP అప్పలనాయుడు దీన్ని తయారు చేయిస్తున్నట్లు తెలిపారు. 7.5 అడుగుల ఎత్తుతో 4 రోజుల్లోనే తయారు చేశానని, 25 విగ్రహాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈనాడు’ ప్రస్థానం ప్రారంభమైన విశాఖలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని ఎంపీ తెలిపారు. మీడియా రంగం నుంచి ప్రతిష్ఠించే తొలి విగ్రహం రామోజీరావుదే కావడం గమనార్హం.

News June 17, 2024

లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

image

టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావుతో పలు రాజకీయం అంశాలపై చర్చించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలని లోకేశ్ సూచించారు. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయన్నారు.