Andhra Pradesh

News June 17, 2024

శ్రీకాకుళంలో కొడవలితో హ్యత్యాయత్నం.. అరెస్ట్

image

రోడ్డుపై హత్యచేయడానికి యత్ననించిన నిందితుడిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. పట్టణంలోని బలగ హాస్పిటల్ రోడ్డులో ఈనెల 13న నల్లపిల్లి గౌరీశంకర్‌ను మంగలవీధికి చెందిన గిరి కొడవలితో హత్య చేసేందుకు యత్నించగా శంకర్ తప్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. పరారీలో ఉన్న గిరిని ఎస్సై పట్టుకున్నారు. నేరం ఒప్పుడకోవడంతో అరెస్టు చేశారు.

News June 17, 2024

కారంచేడు: స్వర్ణమ్మ తల్లికి వెయ్యి సంవత్సరాల చరిత్ర

image

వెయ్యి ఏళ్ల చరిత్ర కల్గిన స్వర్ణమ్మ తల్లికి స్వర్ణ గ్రామంతో అనుబంధం ఉందని స్థానికులు చెబుతున్నారు. పూర్వం వరదలు వచ్చినప్పుడు చీరాల నుంచి వరద నీరు స్వర్ణ గ్రామాన్ని ముంచెత్తితే స్వర్ణమ్మ తన కొంగును అడ్డు పెట్టి గ్రామాన్ని కాపాడిందని భక్తులు చెబుతూఉంటారు. స్వర్ణమ్మ తల్లి కోర్కెలు తీరుస్తుందని..ఏ శుభకార్యం జరిగినా తొలి అహ్వాన పత్రికను అమ్మవారికే సమర్పిస్తారని స్థానికులు డెబుతున్నారు.

News June 17, 2024

ప్రొద్దుటూరు: సరఫరాలపై జగన్ ఫొటో తొలగింపు

image

అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే పోషకాహార వస్తువులపై టీడీపీ ప్రభుత్వం మాజీ సీఎం జగన్ ఫొటోలను తొలగించింది. దానికి బదులుగా ప్రభుత్వ రాజముద్రను వేసి చిన్నారులకు పోషకాహారాలను పంపిణీ చేస్తోంది. అయితే గతంలో కొన్నింటిపై జగన్ ఫొటోను ముద్రించడంపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తపరిచిన విషయం తెలిసిందే..!

News June 17, 2024

VZM: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

image

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన గజపతినగరం మండలం బంగారమ్మపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తాడుతూరి అనూష అలియాస్ తనూజ(20) ఆదివారం అర్ధరాత్రి పశువులశాలలో ఉరివేసుకుని మృతి చెందినట్లు కొందరు చెబుతున్నారు. అయితే గ్రామానికి చెందిన వ్యక్తి వేధింపుల కారణంగా తన కుమార్తె మృతి చెందినట్లు తండ్రి ఫిర్యాదు మేరకు బొబ్బిలి DSP శ్రీనివాసరావు, గజపతినగరం CI ప్రభాకర్, SI మహేశ్ విచారిస్తున్నారు. 

News June 17, 2024

రుషికొండ భవనాలపై దుష్ప్రచారం తగదు: అమర్నాథ్

image

జగన్ ప్రభుత్వం రుషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలపై దుష్ప్రచారం తగదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవసరాల కోసం జగన్ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిందని వివరించారు. ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా టీడీపీ నాయకుల ప్రచారం చేయడం తగదన్నారు. నగరానికి ప్రముఖులు వచ్చినప్పుడు ఆ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు.

News June 17, 2024

పెనుకొండ: గొంతు కోసుకుని వృద్ధుడు ఆత్మహత్య

image

గొంతు కోసుకొని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం జరిగింది. పెనుకొండలోని రైల్వేస్టేషన్ రోడ్డులో సెవెన్‌హిల్స్‌ వద్ద నివాసం ఉంటున్న శివయ్య(63) ఐదేళ్లుగా క్షయ వ్యాధితో బాధపతుండేవారు. మనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు వెతుకుతుండగా స్టేషన్‌ పక్కన కల్వర్టు వద్ద విగత జీవిగా కనిపించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ దాదాపీర్‌ తెలిపారు.

News June 17, 2024

కృష్ణా: విద్యార్థులకు శుభవార్త చెప్పిన కేంద్ర విద్యాశాఖ

image

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్వయం పోర్టల్‌లో 9-12 తరగతుల విద్యార్థులకు, సైన్స్ తదితర సబ్జెక్టులలో ఉచిత ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్నట్లు NCERT తెలిపింది. ఈ కోర్సులు నేర్చుకునే వారు https://swayam.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 1లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌లో కోర్సు పూర్తైన తర్వాత అసెస్‌మెంట్, సర్టిఫికేషన్ ఉంటాయని NCERT స్పష్టం చేసింది.

News June 17, 2024

నందికొట్కూరు: ‘కాలువ నీళ్లే తాగాడానికి వదులుతున్నారు’

image

పాములపాడు మండలంలోని వానాల గ్రామంలో ఎస్సీ కాలనీవాసులకు తెలుగు గంగ నీళ్లు వదులుతున్నారని కాలనీవాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. నీళ్లు అపరిశుభ్రంగా ఉంటున్నాయని వాటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. అలాగే డయేరియా సంబంధిత వ్యాధులు సంభవించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని మంచి నీటిని సరఫరా చేయాలని కోరారు.

News June 17, 2024

బాపట్ల: ఆ రోడ్డులో రెండున్నరేళ్లలో 15 మంది మృతి

image

రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పాత వంతెనలు, అధ్వాన రహదారులు, మలుపులు, అతివేగం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చందోలు, యాజలి, బుద్దాం, కర్లపాలెం వద్దగత రెండున్నరేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 15 మంది మృతి చెందారు. బాపట్ల మండలంలో వెదుళ్లపల్లి-పర్చూరు రహదారిలో పేరలి వంతెన రక్షణ గోడలు పూర్తిగా కూలగా.. 2022 నవంబర్‌లో ఈ మలుపు వద్ద ఐదుగురు అయ్యప్ప దీక్షదారులు మృత్యువాతపడ్డారు.

News June 17, 2024

పోరుమామిళ్లలో యువకుడి సూసైడ్

image

పోరుమామిళ్ల మండలం అక్కల రెడ్డి పల్లె గ్రామ సమీపాన టెలిఫోన్ టవర్‌కు ఉరి వేసుకొని సోమవారం ఉదయం యువకుడు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు దాసరపల్లి ప్రేమ సాగర్ (22) గా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోరుమామిళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.