Andhra Pradesh

News July 7, 2024

అన్నమయ్య: పాలకోవ కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్నారు

image

చిత్తూరు – కర్నూల్ ఎన్‌హెచ్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన ఐదుగురు రాత్రి కారులో గువ్వలచెరువులో పాలకోవ తినడానికి వెళ్లారు. తినేసి వస్తున్న సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి మండిపల్లి సొంత నిధుల నుంచి రూ.లక్ష తక్షణ సాయం కింద అందించారు.

News July 7, 2024

మార్కాపురం: ‘నకిలీ సర్టిఫికెట్లు ఏరి పారేయాలి’

image

నకిలీ సదరం సర్టిఫికెట్లను ఏరిపారేయాలని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మార్కాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి వంద మందిలో 25% నకిలీ వ్యక్తులే దివ్యాంగులుగా చలామణి అవుతూ నిజమైన దివ్యాంగులకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలను అనుభవిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగులకు న్యాయం చేసి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.

News July 7, 2024

భీమవరంలో ప్రపంచ చాక్లెట్ దినోత్సవం 

image

భీమవరం గునుపూడిలోని బాలికల హాస్టల్‌లో ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా RRDS ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు అమూల్యరావు మాట్లాడుతూ.. చాక్లెట్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్ట పడతారని అన్నారు. చాక్లెట్ రుచుల్లో మొత్తం 600 రకాలున్నాయని అన్నారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు.
☛ ఇంతకీ మీకు ఏ చాక్లెట్ ఇష్టం..?

News July 7, 2024

నంద్యాల కలెక్టర్‌గా రాజకుమారి బాధ్యతలు

image

నంద్యాల కలెక్టరేట్‌లో ఈ రోజు ఉదయం 11.30 గంటలకు కలెక్టర్‌గా రాజకుమారి బాధ్యతలు స్వీకరించారు. మహానంది దేవస్థానం వేదపండితులు, అర్చకులు పూజలు నిర్వహించగా.. ముస్లిం, క్రైస్తవ మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వమత ప్రార్థనల అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ పద్మజ, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

News July 7, 2024

విశాఖ: జూన్‌లో పెరిగిన విమానాల సంఖ్య

image

విశాఖ విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాల సంఖ్య జూన్ నెలలో పెరిగింది. గత ఏడాది జూన్‌లో 1,692 విమానాలు రాకపోకలు సాగించగా ఈ ఏడాది జూన్‌లో 1,704కు విమానాల సంఖ్య పెరిగింది. అయితే విమాన ప్రయాణికుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. గతేడాది జూన్‌లో 2,54,490 మంది ప్రయాణించగా, ఈ జూన్లో 2,32,149 మంది ప్రయాణించారని ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు నరేశ్ కుమార్, కుమార్ రాజా తెలిపారు.

News July 7, 2024

రేపు ఇడుపులపాయకు వైఎస్ షర్మిల

image

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కడప జిల్లాకు రానున్నారు. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు ఆమె జిల్లాకు రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన తండ్రికి నివాళులు అర్పించిన అనంతరం ఆమె విజయవాడకు వెళ్ళనున్నారు. సాయంత్రం వైఎస్ జయంతి సభకు తెలంగాణ సీఎం రానున్న విషయం తెలిసిందే.

News July 7, 2024

పార్వతీపురం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్యాంప్రసాద్

image

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ఏ.శ్యాంప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కలెక్టరేట్ ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన బాధ్యతలను స్వీకరించారు. అందరి సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి తనవంతు కృషి చేస్తానని శ్యాంప్రసాద్ పేర్కొన్నారు.

News July 7, 2024

రాజమండ్రిలో జులై 8న మంత్రి సత్యకుమార్ పర్యటన

image

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తూ.గో. జిల్లా పర్యటన ఖరారైంది.
జూలై 8న రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అనపర్తికి చేరుకుంటారు. అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వంద పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజమండ్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

News July 7, 2024

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై పుస్తకం

image

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం పూర్వ రాష్ట్ర సభ్యుడు డా.తవ్వా వెంకటయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితంపై పుస్తకం రచించారు. ‘ఓ ధీరుడి పయనం సమరం నుంచి సంక్షేమం వైపు’ అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందులలోని తమ స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య చేసిన కృషిని కొనియాడుతూ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

News July 7, 2024

నందికొట్కూరులో వేడేక్కిన రాజకీయం.. MLA vs బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

image

నందికొట్కూరులో TDP నేతలు పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకోవడంతో రాజకీయం వేడెక్కింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి TDP కండువా కప్పుకోలేదని, YCPకి చెందిన వారికి పార్టీ కండువాలు ఎలా కప్పుతారని MLA జయసూర్య నిన్న వ్యాఖ్యానించారు. దీనిపై TDP రాష్ట్ర నేత చిన్న వెంకటస్వామి స్పందిస్తూ.. ‘YCP నుంచి వచ్చిన మీరా బైరెడ్డి గురించి మాట్లాడేది. MP శబరి, బైరెడ్డి దయతో గెలిచిన నువ్వు గాలి MLAవు’ అంటూ ఫైర్ అయ్యారు.