India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దసరా పండగ దృష్ట్యా ‘ఆపరేషన్ లంగ్స్-2.0’ ఆక్రమణల తొలగింపు డ్రైవ్కు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర రావు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తమ నిర్మాణాలను తొలగించుకోవాలని సూచించారు. పండుగ తర్వాత డ్రైవ్ కొనసాగుతుందని, తొలగించిన చోట్ల మళ్లీ ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
➤భీమిలి – 4 వార్డులు(58.884) చ.కి.మీ ➤మధురవాడ – 5 వార్డులు(95.668) చ.కి.మీ
➤ఈస్ట్ – 15 వార్డులు (48.527) చ.కి.మీ ➤నార్త్ – 17 వార్డులు(19.928) చ.కి.మీ
➤సౌత్ – 13 వార్డులు(9.698) చ.కి.మీ ➤వెస్ట్ – 14 వార్డులు(72.937) చ.కి.మీ
➤పెందుర్తి – 6 వార్డులు(75.038) చ.కి.మీ ➤గాజువాక – 15 వార్డులు(108.115) చ.కి.మీ
➤అగనంపూడి – 4 వార్డులు (102.830) చ.కి.మీ ➤అనకాపల్లి – 5 వార్డులు(41.079) చ.కి.మీ
విశాఖపట్నం నగరపాలక పరిధిలోని ప్రస్తుత జోన్ల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం ప్రధాన కార్యాలయంలో విభాగాధిపతులతో సమీక్షా నిర్వహించారు. ప్రస్తుత 8 జోన్లను 10 జోన్లుగా మార్చేందుకు అనుమతి ఇచ్చినట్టు వెల్లడించారు.
వాహన మిత్ర దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంచాలని ఆటో వర్కర్స్ సమాఖ్య విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ కోరారు. ఈనెల 24న దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసిందన్నారు. సర్వర్ సమస్య సాకుతో సచివాలయాల్లో చాలా దరఖాస్తులు స్వీకరించలేదన్నారు. దీనివల్ల చాలా ఉంది ఆటో డ్రైవర్లు నష్టపోయి అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం గడువు పెంచి అందరి నుండి దరఖాస్తులు స్వీకరించాలని కోరారు.
జిల్లాలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి చర్యలు చేపట్టినట్లు జేసీ బి.నవ్య తెలిపారు. కొత్తగా 4,056 మంది కార్డుదారులు చేరడంతో మొత్తం 6,68,944 డిజిటల్ రేషన్ కార్డులు ATM సైజు, ఫొటో, రేషన్ షాప్ వివరాలు, క్యూఆర్ కోడ్, E-KYC వివరాలతో ఉంటాయన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 వరకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్ద పంపిణీ చేస్తారన్నారు. అక్టోబర్ 2 నుంచి రేషన్ షాప్ల ద్వారా పొందవచ్చు అన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విమలారాణి గురువారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ‘నవరాత్రి పోషణ్ మహా ప్రోగ్రాం’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం వన్ స్టాప్ సెంటర్ను సందర్శించనున్నారని చెప్పారు.
జిల్లాలో ఈనెల 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గుంటూరు కలెక్టర్ తమిమ్ అన్సారియా గురువారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పిల్లలు, పశువులను నీటి ప్రవాహాల వద్దకు పంపకూడదని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. మండల, డివిజినల్ అధికారులు స్థానిక స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ నం. 0863-2234014 కి సమాచారమివ్వాలని తెలిపారు.
విద్యుత్ రంగంలో ఆధునీకరణకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, క్లైమేట్ కలెక్టివ్ ఫౌండేషన్లతో విశాఖలో ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం చేసుకుంది. విద్యుత్ పంపిణీ నెట్వర్క్ ఆధునీకరణ, డీ కార్బనైజేషన్కు ఈ సంస్థలు కలిసి పనిచేస్తాయి. స్మార్ట్ గ్రిడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖ కమీషనరేట్ పరిధిలో 12 మంది పోలీస్ సిబ్బందికి పదోన్నతలు లభించాయి. సీపీ శంఖబ్రత బాగ్చి వారిని గురువారం సత్కరించి, పదోన్నతి ర్యాంకులతో పాటుగా పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని సీపీ సూచించారు. వీరిలో ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు.. ఏఎస్ఐలుగా, ఏడుగురు కానిస్టేబుళ్లు.. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు.
విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 113 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి గురువారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.