Andhra Pradesh

News June 16, 2024

యువకుడిని కాపాడిన విశాఖ పోలీసులు

image

విశాఖ అప్పుఘర్ బీచ్ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న యువకుడిని ఎంవీపీ పోలీసులు కాపాడారు. భీమిలి మండలం ఉప్పాడకు చెందిన 30 ఏళ్ళ యువకుడు కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన పోలీసులు యువకుడిని కాపాడి.. కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అతనిని అప్పగించారు. ప్రాణాలు కాపాడిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

News June 16, 2024

శ్రీకాకుళం: జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు

image

వచ్చేనెల 1వ తేదీ నుంచి దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ మెట్ట మల్లేశ్వరరావు అన్నారు. జిల్లా కోర్టులో ప్రాసిక్యూషన్ కార్యాలయంలో ఆయన పీపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్షి అధినీయం, భారతీయ నాగరిక సురక్ష సంహిత మొదలైన కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు.

News June 16, 2024

మద్దిలేటిస్వామి కోనేరులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

image

బేతంచెర్ల వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి ఆలయంలోని కోనేరులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గద్వాల మండలం వడ్డేపల్లికి చెందిన కురువ మహేశ్ (34) అనే వ్యక్తి మద్దిలేటి స్వామి దర్శనం కోసం శనివారం మద్దిలేటి స్వామి ఆలయానికి వచ్చారు. ఈ రోజు10 గంటల సమయంలో కోనేరులో ఈతకు వెళ్లాడు. గుంత ఉండడంతో అందులో మునిగి కనిపించలేదు. ఆదివారం ఉదయం మృతదేహం బయటపడింది.

News June 16, 2024

తూ.గో.: నాన్నే నా హీరో: డైరెక్టర్ సుకుమార్

image

నాన్నే తన హీరో అని అంటున్నారు మలికిపురం మండలం మట్టపర్రుకు చెందిన సినీ దర్శకుడు సుకుమార్. గ్రామానికి చెందిన బండ్రెడ్డి తిరుపతి రావునాయుడికి సుకుమార్‌తో పాటు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా ఆయన జ్ఞాపకార్థం తోబుట్టువులతో వారు రూ.15లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి భవనం నిర్మించారు. తండ్రి బాధ్యతే పిల్లలను మంచివైపు నడిపిస్తుందని ఓ మూవీ విడుదల సందర్భంగా చెప్పారు.
☛ నేడు FATHERS డే

News June 16, 2024

సంచలన ఉత్తర్వులు ఇచ్చిన తిరుపతి కోర్టు

image

తిరుపతిలో 2023 సెప్టెంబర్‌లో జరిగిన చోరీ కేసులో ఈస్ట్ CIని A2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని తిరుపతి 2వ మున్సిఫ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో TDP అధినేత చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరాన్ని టి.జయరామిరెడ్డి ఓ రెస్టారెంట్‌లో పోగొట్టుకున్నారు. దీనిపై కేసు ఫైల్ చేయకపోగా నిందితుడ్ని వదిలేశారు. బాధితుడు కోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో.. జడ్జీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

News June 16, 2024

ఈనెల 18న సింహాద్రి అప్పన్న సోదరి ఉత్సవం

image

సింహగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోదరి పైడితల్లమ్మ ఉత్సవం మంగళవారం (18 వతేదీన) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే సింహాద్రి అప్పన్న దర్శనానికి అవకాశం లభిస్తుందని ఈవో శ్రీనివాసమూర్తి వెల్లడించారు. బుధవారం యథావిధిగా ఉదయం ఆరున్నర గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించినట్లు ఆయన వివరించారు. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలని కోరారు.

News June 16, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ఖాజీపేట సెక్షన్‌లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే నం.20803, నం.20804 విశాఖ-గాంధీ‌ధామ్ ట్రైన్లు ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌లు జూన్ 23 నుంచి జూలై 4 మధ్య విజయవాడ-విశాఖపట్నం మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్‌పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు.

News June 16, 2024

వినుకొండలో రోడ్డు ప్రమాదం.. టిప్పర్ డ్రైవర్ మృతి

image

మండలంలోని శివాపురం సమీపంలో మామిడితోట ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ టిప్పర్ ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం ఎండ్లూరివారిపాలెం చెందిన లక్ష్మయ్య(45) గ్రామ సమీపంలోని ఇటుకల మట్టిని టిప్పర్ సాయంతో వినుకొండలో అన్లోడ్ చేసి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు.

News June 16, 2024

ZPTC పొలంలో తెల్లరాయి స్వాధీనం

image

నెల్లూరు జిల్లా చేజర్ల జడ్పీటీసీ సభ్యుడు పీర్ల పార్థసారథి పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.1.50 కోట్ల విలువైన 1560 టన్నుల తెల్లరాయిని గనుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతించిన ప్రదేశంలో కాకుండా మరో చోట తవ్వకాలు చేస్తున్న వాహనాలను, తవ్విన ఖనిజాన్ని డీడీ శ్రీనివాస్ సీజ్ చేసి రెవెన్యూ, పోలీస్ విభాగాలకు అప్పగించారు. శ్రీరామ మినరల్స్ పేరుతో అనుమతి పొంది మరోచోట తవ్వకాలు చేసినట్లు సమాచారం.

News June 16, 2024

ఒంగోలు: గ్రామీణ ప్రాంత మహిళలకు మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ

image

మహిళలకు మగ్గం వర్క్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ మహిళలకు ఈనెల 24 నుంచి నుంచి ఒంగోలులో శిక్షణ ఇస్తామన్నారు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళలు తమ వివరాలతో పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి, సదుపాయాలు ఉంటాయని తెలిపారు.