India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ పాలనలో స్త్రీలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం బాగా పెరిగాయన్నారు. భూకబ్జాలు, దాడులకు హద్దులేకుండా పోయిందని ఆరోపించారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వంలో సరిదిద్దుతానన్నారు. ఆడపిల్లలు కిడ్నాప్కు గురికాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడతామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
వైసీపీ పాలనలో శాఖలన్నీ భ్రష్టుపట్టాయని మంత్రి సంధ్యారాణి దుయ్యబట్టారు. సాలూరులోని తన నివాసం వద్ద శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా తన బాధ్యత పెరిగిందన్నారు. గిరిజన గర్భిణులు రోడ్లపై ప్రసవించడం, డోలి మోతలతో తిప్పలు, తాగు నీటికి 5KM నడవడం చూసి కన్నీరు పెట్టుకున్నానన్నారు. ఐటీడీఏ పాలకవర్గంతో సమావేశం నిర్వహించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.
పొదిలిలోని పి.హెచ్.సిలో పనిచేస్తున్న ANM విజయ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటిసిబ్బంది గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న ఓ ఆశ కార్యకర్తకు ANM విజయకు గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శనివారం ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన విజయ నిద్రమాత్రలు మింగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
రైల్వే ట్రాక్ పై వంతెన మరమ్మతుల కారణంగా ఈ నెల 17న పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు మధ్య నడిచే రైళ్లు రద్దయ్యాయి. అలాగే పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైళ్లనూ రద్దు చేశారు. ఈ మేరకు వాల్తేరు డీసీఎం సందీప్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆంధ్ర రాష్ట్ర సచివాలయంలోని 2 వ బిల్డింగ్ నందు గల పురపాలక శాఖ ఛాంబర్ లో ఆదివారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొని నారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.
పాప్ కార్న్ కొనేందుకు వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారింది. కంచరపాలెం జాషువా నగర్లో ఉంటున్న బీ.సురేశ్, శృతి దంపతులకు పూజిత (9) ఒక్కగానొక్క కూతురు. దీంతో వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి పాప్కార్న్ కోసం అని తండ్రి బైక్పై మార్కెట్కు వెళ్తుండాగా జరిగిన ప్రమాదంలో పూజిత మృతిచెందింది. చిన్నారిని తలుచుకుంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
“ఫాదర్స్ డే” సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర తన తండ్రి సుబ్బారావు జ్ఞాపకాలను పంచుకున్నారు. రైస్ మిల్ నిర్వహించే తన తండ్రి చాలా ప్రశాంతంగా ఉండేవారని రవీంద్ర చెప్పారు. అందరితో మంచిగా ఉండాలని, ఆప్యాయంగా పలకరించాలని చెప్పేవారన్నారు. తన తండ్రి మాటలే తనలో మార్పు తెచ్చాయన్నారు. ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథం ఆయన వద్ద నేర్చుకున్నానని రవీంద్ర చెప్పారు.
నెల్లూరుకు 2016లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ మంజూరైంది. నగరంలో మొత్తం 430 కి.మీ మేర మురుగునీటి పైపులైన్ వేయాల్సి ఉండగా 390 కి.మీ పైపులైన్ వేశారు. ఇంకొ 40కి.మీ నిర్మించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పనులు నిలిచి పోయాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ పదవి చేపట్టడంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తవుతుందన్న ఆశ నెల్లూరు వాసులలో నెలకొంది.
ఖాజీపేట సెక్షన్లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే నం.20819,నం.20820 పూరి- ఓఖా ట్రైన్లు ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్లు జూన్ 23 నుంచి జూలై 3 మధ్య విజయవాడ- విశాఖపట్నం మీదుగా కాక విజయనగరం-రాయగడ గుండా ఈ ట్రైన్ నాగ్పూర్ చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్లకు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి తదితర స్టేషన్లలో స్టాప్ లేదన్నారు
తనకు దక్కిన జలవనరుల శాఖతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే అవకాశం కలిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైసీపీ హయాంలో నిర్వీర్యమైన జలవనరుల శాఖకు తిరిగి జవసత్వాలు తెస్తామని, పోలవరం పూర్తికి తొలి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి ప్రాజెక్ట్లో 40శాతం నిధులను ‘జే’ గ్యాంగ్ కమీషన్ల రూపంలో దోచుకుందని, ప్రాజెక్టుల పేరిట వారు చేసిన అక్రమాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు.
Sorry, no posts matched your criteria.