Andhra Pradesh

News June 16, 2024

కృష్ణా: ‘అమాత్యా.. జిల్లా వాసులను ఆదరించండి’

image

గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పార్థసారథికి ఉమ్మడి జిల్లాలో ఆ శాఖలో పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు. టిడ్కో ఇళ్ల కేటాయింపులలోను అనేక సమస్యలున్నాయి. మంత్రి సారథి ఈ సమస్యలు పరిష్కరించి ఉమ్మడి జిల్లావాసులకు మేలు చేయాలని ప్రజానీకం ఆశిస్తున్నారు.

News June 16, 2024

మంత్రి నారాయణను కలిసిన ఎంపీ వేమిరెడ్డి

image

మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం నెల్లూరులోని నారాయణ స్వగృహానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు.. ఆయనకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఉన్నారు.

News June 16, 2024

MLAగా విజయం.. కాలినడకన ద్వారకాతిరుమలకు

image

ఏలూరు జిల్లా పోలవరం MLAగా చిర్రి బాలరాజు విజయం సాధించిన నేపథ్యంలో ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయానికి స్థానిక టీడీపీ, జనసేన నాయకులు శనివారం కాలినడక బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి గెలిస్తే పాదయాత్రగా వస్తామని మొక్కుకున్నట్లు తెలిపారు. నరసింహమూర్తి, శ్రీను, ప్రసాద్, కృష్ణ తదితరులు ఉన్నారు.

News June 15, 2024

ధర్మవరంలో బాలుడి అదృశ్యం 

image

ధర్మవరం పట్టణంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన బాలుడు శనివారం అదృశ్యమయ్యాడు. బాలుడు విహాన్ రాజు ఇంటి బయట ఆడుతూ ఉండగా కొద్దిసేపటికి చూసేలోపే అదృశ్యం అయ్యాడని తల్లిదండ్రులు హరి ప్రసాద్, రామలక్ష్మి పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కి అప్పగించాలని పోలీసులు తెలిపారు .

News June 15, 2024

నూతన ప్రమాణాలు నెలకొల్పడానికి ఇదే సరైన సమయం- కేంద్ర మంత్రి రామ్మోహన్

image

శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ శనివారం తొలిసారిగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) అధికారులతో దిల్లీలో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో AAI విధులు, ఇటీవల AAI సాధించిన విజయాలను తెలుసుకున్నానని రామ్మోహన్ పేర్కొన్నారు. విమానయాన రంగంలో నూతన ప్రమాణాలు నెలకొల్పడానికి ఇదే సరైన సమయం అని వారికి తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశానని ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

News June 15, 2024

శ్రీకాకుళం: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ(AU) పరిధిలో ఏప్రిల్- 2024లో జరిగిన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(B.F.A) 8వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
డిగ్రీ విద్యార్థులు పరీక్షల ఫలితాలు చెక్ చేసుకోవాలని ఆంధ్రా యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చూడాలని AU పరీక్షల విభాగం తెలిపింది.

News June 15, 2024

కడప దివ్యాంగుడికి ఆర్థిక సహాయం చేసిన సీఎం చంద్రబాబు

image

కడప నగరంలోని రాజారెడ్డికి వీధికి చెందిన దివ్యాంగుడు కనపర్తి మనోజ్‌ కుమార్‌కు సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయం ప్రకటించారు. శనివారం మంగళగిరిలో సీఎం చంద్రబాబును మనోజ్ కలిశారు. తన సమస్యను వివరించి వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరగా.. సీఎం అతడికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. మనోజ్ కుమార్ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో వీల్ చైర్‌కే పరిమితమయ్యాడు.

News June 15, 2024

సోంపేట: 1600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

image

సోంపేట సెబ్ సీఐ ఆర్.జై భీమ్ ఆధ్వర్యంలో మందస మండలం కొండలోగాం పంచాయతీలోని నాటుసారా స్థావరాలపై శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రామరాయి, పట్టులోగాం, ఇంద్రాడ వీధి, టుబ్బాగాం గ్రామాలో దాడులు నిర్వహించి 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా బట్టీలు ఎవరు నిర్వహిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నాటుసారా అమ్మకాలు గూర్చి సమాచారం తెలిస్తే 94409 02358కు సమాచారం ఇవ్వాలన్నారు.

News June 15, 2024

గోవులను వధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం: సీపీ రామకృష్ణ

image

గోవులను వధించినా, అక్రమంగా నిల్వ ఉంచినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ రామకృష్ణ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17న బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, వధ అరికట్టే ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. జంతువుల అక్రమ రవాణా, వధ జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

News June 15, 2024

రావికమతం: పిడుగు పడి రైతు మృతి

image

రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామంలో శనివారం పిడుగు పడి రైతు రాజాన పెంటయ్య మృతి చెందాడు. పెంటయ్య తన పశువులను మేతకు తీసుకువెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ఇంటికి వెళ్లే ప్రయత్నంలో రైతుకు సమీపంలో పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.