Andhra Pradesh

News September 27, 2024

ఫిబ్రవరి నాటికి జాతీయ రహదారులు పూర్తి చేయాలి

image

జాతీయ రహదారులకు సంబంధించిన ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో గురువారం శంకరన్ హాల్లో కలెక్టర్ ఓ. ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని జాతీయ రహదారుల పనులను వేగవంతం చేసి ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారికి పలు సూచనలు చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్, ఎన్ హెచ్ పీడీ చౌదరి, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.

News September 27, 2024

ఒంగోలు: ఇకపై ఆలయంలో UPI చెల్లింపులు

image

ఒంగోలులోని శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల సౌకర్యార్థం UPI చెల్లింపు విధానానికి శ్రీకారం చుట్టినట్లు ధర్మకర్తల మండలి ఛైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్య నిర్వహణ ధర్మకర్త సీవీ రామకృష్ణారావు వెల్లడించారు. గురువారం శ్రీగిరి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. UPI ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ గురించి భక్తులకు వివరించారు.

News September 27, 2024

వైసీపీని గెలిపించలేదనే పడవల కుట్ర: నిమ్మల

image

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదనే అక్కసుతో 3 బోట్లను, లింక్ చేసి వదిలి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాలని జగన్ కుట్ర పన్నాడని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం కొంతేరులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమ్మల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గర్భిణులకు సాముహిక సీమంతాలు చేసి, చీర, గాజులు, పసుపు, కుంకుమ అందించి ఆశీర్వదించారు.

News September 27, 2024

రోడ్ సేఫ్టీ కమిటీతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ చేతన్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, జిల్లా రవాణాధికారి కరుణసాగర్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి శిక్ష పడేటట్టు చేయాలన్నారు.

News September 27, 2024

తూ.గో: నల్లజర్లలో అత్యధికం.. గోపాలపురంలో అత్యల్పం..

image

తూర్పు గోదావరి జిల్లాలోని 19 మండలాల్లో ఉదయం నుంచి కురిసిన వర్షానికి 176.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు గురువారం రాత్రి తెలిపారు. జిల్లాలోని నల్లజర్ల మండలంలో 39.2 మిల్లీమీటర్లు అత్యధిక వర్షం కురిసింది అని తెలిపారు. గోపాలపురంలో అత్యల్పంగా 0.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. రాజానగరంలో 27.4 అనపర్తిలో 23.4 రాజవరంలో 11.8 మిల్లీమీటర్ల ఉంచిన వర్షం కురిసిందని తెలిపారు.

News September 27, 2024

ఉపాధి హామీ నిర్దేశిత పనులను పూర్తి చేయండి: కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఎంపీడీవోలు, ఏపీడీలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉపాధి హామీ పథకం కింద నిర్ధేశించిన లేబర్ బడ్జెట్, వంద రోజుల పనిదినాల కల్పన, హార్టికల్చర్, అవెన్యూ ప్లాంటేషన్ పనులు ప్రగతి లక్ష్యాలపై క్లస్టర్ల వారీగా సమీక్షించారు.

News September 27, 2024

PPM: గ్రామాలకు రోడ్డు సౌకర్యానికి మొదటి ప్రాధాన్యత

image

గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించే పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పార్వతీపురం కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజినీరింగు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన ఇంజినీరింగు పనుల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు.

News September 27, 2024

సదుం: విద్యార్థిని దత్తత తీసుకున్న డీఈవో

image

సదుం మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని అర్షియాను దత్తత తీసుకుంటున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు. విద్యార్థిని పదవ తరగతి వరకు అయ్యే విద్య అవసరాలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాగా చదువుకోవాలని ఆమెకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం జయ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News September 27, 2024

పాడేరు: ఈనెల 27న మీకోసం కార్యక్రమం రద్దు

image

ఈనెల 27వ తేదీ శుక్రవారం జరగనున్న మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఫిర్యాదుదారులకు ఎటువంటి సమస్య లేకుండా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పీఓ ప్రకటించారు. ఫిర్యాదుదారులు గమనించి నీకోసం కార్యక్రమంలో ఫిర్యాదులు అందజేయడానికి రావద్దని పిఓ విజ్ఞప్తి చేశారు.

News September 27, 2024

శ్రీకాకుళం: ‘ముద్దాయిలకు ఉచిత న్యాయ సేవలు’

image

శ్రీకాకుళం కారగరంలో ముద్దాయిలకు న్యాయ అవగాహన సదస్సును గురువారం నిర్వహించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. జైలు ముద్దాయిలకు ఉచిత న్యాయసేవలు అందిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ముద్దాయిలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేసులు విషయంలో రాజీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని అవగాహన కల్పించారు. రాజియే రాజమార్గం అన్నారు. సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.