Andhra Pradesh

News June 15, 2024

అర్జున్ కుమార్తె రిసెప్షన్‌కు హాజరైన ఆర్కే రోజా

image

యాక్షన్ కింగ్, ప్రముఖ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తమిళ హాస్యనటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడైన ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య పెళ్లయిన విషయం తెలిసిందే. శుక్రవారం చెన్నైలోని ఓ ప్యాలెస్‌లో వీరి రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

News June 15, 2024

విశాఖ: పెన్షన్ పెంపు వల్ల 1,65,432 మందికి లబ్ధి

image

సామాజిక  పెన్షన్‌లు పెంచుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విశాఖ జిల్లాలో 1,65,432 మంది లబ్ధి పొందనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.  పెన్షన్ పెంపు వల్ల ప్రతినెల అదనంగా రూ.21.27 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ పథకాన్ని ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌గా ప్రభుత్వం మార్పు చేసింది. విశాఖ జిల్లాలో 16 రకాల  పెన్షన్ దారులు ఉన్నట్లు తెలిపారు.

News June 15, 2024

శ్రీకాకుళం: ఇద్దరిపై ‘పోక్సో’ కేసు నమోదు

image

ఎచ్చెర్ల మండలంలోని తోటపాలెం పంచాయితీ దుప్పలవలసకు చెందిన ఇద్దరిపై శుక్రవారం ఎచ్చెర్ల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తనపై ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఫిర్యాదులో తన తల్లి పేరును కూడా చేర్చడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

News June 15, 2024

TTD ఈవోగా ధర్మారెడ్డి తొలగింపు

image

నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలకు చెందిన ధర్మారెడ్డిని టీటీడీ ఈవో పదవి నుంచి తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో YCPకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ధర్మారెడ్డిని ఇటీవలే సీఎస్ నీరభ్ కుమార్ సెలవులపై పంపారు.

News June 15, 2024

విజయవాడకు మెట్రో రైలు?

image

విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలోనే తుది డీపీఆర్‌ సిద్ధమైనా, వైసీపీ ప్రభుత్వం సమీక్ష చేయకపోవడంతో మూలన పడింది. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం సమీక్ష సందర్భంగా ఇది కూడా చర్చకు వస్తుందని అంతా భావిస్తున్నారు.

News June 15, 2024

నెల్లూరు: ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

ఇటీవల ఓపెన్ స్కూల్ పరీక్షల్లో అలసత్వం ప్రదర్శించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కావలి పరీక్ష కేంద్రంలో వీరు ఇన్విజలేర్లుగా పనిచేశారు. వీరి సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది.

News June 15, 2024

గుంటూరు మిర్చి యార్డుకు 3 రోజులు సెలవులు

image

బక్రీద్ పండుగ సందర్భంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. శని, ఆదివారాలు సాధారణ సెలవులతో పాటు సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిందని మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు. యార్డులో 18 నుంచి యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

News June 15, 2024

పుస్తకాలు తక్కువ వస్తే ప్రతిపాదనలు పంపాలి: డీఈఓ

image

విద్యార్థులకు పుస్తకాలు తక్కువ వస్తే ఎంఈఓలు ప్రతిపాదనలు పంపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.అనురాధ సూచించారు. శుక్రవారం ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లోని స్టూడెంట్ కిట్ మండల స్థాయి స్టాక్ పాయింట్‌ను డీఈఓ, కడప డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. 8, 9 తరగతులకు కొరత ఉన్న పుస్తకాల మంగళవారం వస్తాయన్నారు. త్వరగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయాలన్నారు.

News June 15, 2024

నాడు కళా వెంకట్రావు.. నేడు అనిత

image

పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు హోంశాఖ కేటాయించి ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఈ ప్రాంతం వారికి హోంశాఖ రావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ఎన్టీఆర్ కేబినేట్‌లో ప్రస్తుత చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హోంమంత్రిగా పనిచేశారు. నాడు ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నేడు రాజాం నియోజకవర్గంలో భాగమైంది.

News June 15, 2024

శ్రీశైలం: వైభవంగా స్వామి అమ్మవార్లకు ఊయలసేవ

image

శ్రీశైలం దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఊయలసేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. లోక కల్యాణాన్ని ఆకాంక్షిస్తూ విశేషంగా ప్రతి శుక్రవారం రోజు పౌర్ణమి , మూలానక్షత్రం రోజులలో స్వామి, అమ్మవార్లకు ఊయలసేవ కార్యక్రమం దేవస్థానం సేవగా నిర్వహిస్తారు. శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించి భక్తులకు దర్మనం కల్పిస్తారు.