Andhra Pradesh

News June 14, 2024

ప.గో.: ఊపందుకోనున్న పోలవరం

image

పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నది ఉమ్మడి ప.గో. జిల్లా ప్రజల కళ. ఏలూరు జిల్లా పరిధిలోని పోలవరం సమీపంలో 2004లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 2015లో జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపుపొందింది. అయితే తాజాగా మన జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడిని జలవనరుల శాఖ వరించింది. దీంతో జిల్లా ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్టు పనులు పరుగులు పెడతాయని, నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని చర్చ జరుగుతోంది.
– మీ కామెంట్..?

News June 14, 2024

గుంటూరు జిల్లాకు కీలక శాఖలు..

image

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లాకు జలవనరులశాఖ(అంబటి రాంబాబు), వైద్యారోగ్య శాఖ(విడదల రజిని)లు దక్కాయి. మంత్రులుగా చేసిన విషయం తెలిసిందే. తాజా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా.. ఐటీ, మానవ వనరుల శాఖ(లోకేశ్).. ఆహార, పౌర సరఫరాల శాఖ(ఎన్.మనోహర్).. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్(అనగాని సత్యప్రసాద్) శాఖలు దక్కాయి.

News June 14, 2024

ఫరూక్ మంత్రిగా పనిచేసిన శాఖలివే..!

image

నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ 1985లో తొలిసారి MLAగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో ఎన్టీ రామారావు కేబినెట్‌లో చక్కర, వక్ఫ్&ఉర్దూ అకాడమీ శాఖ మంత్రిగా చేశారు. 1999లో చంద్రబాబు కేబినెట్‌లో ఉన్నత విద్యా, ఉర్దూ అకాడమీ, మున్సిపల్ శాఖలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2018లో మైనారిటీ సంక్షేమ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మైనార్టీ సంక్షేమం, న్యాయ శాఖలు కేటాయించారు.

News June 14, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాకు కీలక శాఖలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖ(కొడాలి నాని), జోగి రమేశ్(గృహ నిర్మాణ శాఖ), పేర్ని నాని(సమాచార శాఖ), దేవాదాయ శాఖ(వెల్లంపల్లి)లు దక్కిన విషయం తెలిసిందే. తాజా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ(కొల్లు రవీంద్ర), హౌసింగ్, సమాచార శాఖ(కొలుసు పార్థసారథి)లను కేటాయించారు.

News June 14, 2024

ఆనం మంత్రిగా పని చేసిన శాఖలు ఇవే

image

➤ 1983, 85: రోడ్లు, భవనాల శాఖ మంత్రి
➤ 2007-09: సమాచార, పౌర సరఫరాల మంత్రి
➤ 2009-12: మున్సిపల్ శాఖ మంత్రి
➤ 2012-14: ఆర్థిక శాఖ మంత్రి
➤ 2024: దేవదాయ శాఖ మంత్రి
NOTE: రాష్ట్రం విడిపోయాక తొలి మున్సిపల్ శాఖా మంత్రిగా పొంగూరు నారాయణ 2014 నుంచి 2019 వరకు పని చేశారు. మరోసారి టీడీపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడూ ఆయనకు అదే శాఖ అప్పగించారు.

News June 14, 2024

ప.గో.: అప్పట్లో ముగ్గురు.. ఇప్పుడు ఇద్దరు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో గత వైసీపీ ప్రభుత్వంలో ముగ్గురు MLAలు మంత్రులుగా వ్యవహరించారు. 2019లో తాడేపల్లిగూడెం నుంచి గెలుపొందిన కొట్టు సత్యనారాయణ దేవాదాయశాఖ, కొవ్వూరు నుంచి MLAగా గెలిచిన తానేటి వనితకు హోంశాఖ, తణుకు MLA కారుమూరి వెంకట నాగేశ్వరరావు పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రిగా పనిచేశారు. తాజాగా నిమ్మలకు జలవనరులు, దుర్గేశ్‌ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు.

News June 14, 2024

అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ కేటాయింపు

image

టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖలు కేటాయించారు. కాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఈయన ఒక్కరికే కేబినెట్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే.

News June 14, 2024

ఉమ్మడి తూ.గో మంత్రులకు దక్కిన శాఖలివే

image

ఉమ్మడి తూ.గో నుంచి ముగ్గురికి మంత్రివర్గంలో చోటు దక్కగా.. వారికి నేడు శాఖలు కేటాయించారు. ☞ పిఠాపురం MLA పవన్ కళ్యాణ్- డిప్యూటీ సీఎం, పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్&టెక్నాలజీ, అటవీ శాఖలు. ☞ రామచంద్రపురం MLA వాసంశెట్టి సుభాశ్- లేబర్, ఫ్యాక్టరీలు, ఇన్‌స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్. ☞ నిడదవోలు MLA కందుల దుర్గేశ్- కందుల దుర్గేశ్ – పర్యాటకం, సినిమాటోగ్రఫీ.

News June 14, 2024

అనంతపురం జిల్లా మంత్రులకు శాఖలు కేటాయింపు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ప్రణాళిక, వాణిజ్య పన్నులు&అసెంబ్లీ వ్యవహారాలు, ధర్మవరం ఎమ్మెల్యే వై.సత్యకుమార్ యాదవ్‌కు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య, పెనుకొండ ఎమ్మెల్యే సవితకు చేనేత, బీసీ సంక్షేమ శాఖను కేటాయించారు. కాగా ఈ ముగ్గురూ మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి.

News June 14, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లా మంత్రులకు శాఖల కేటాయింపు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ముగ్గురు మంత్రులకు శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, గృహ నిర్మాణ శాఖ, ఎన్ఎండీ ఫరూక్‌కు ముస్లిం మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ, టీజీ భరత్‌కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలు కేటాయించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ తొలిసారి మంత్రులు కాగా.. ఫరూక్ నాలుగో సారి మంత్రి కావడం గమనార్షం.