India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ ఎంపీ మార్గాని భరత్ అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రెస్గా మారారని, ఆయన అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర మాజీ ఎంపీ మురళీ మోహన్, భరత్ హయాంలో వేసిన శిలాఫలకాలను ఆదిరెడ్డి తన సొంత డబ్బులతో గురువారం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భరత్ అభివృద్ధి పేరిట నగరంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో పలు కోర్సులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. ఏయే ఫలితాలు విడుదల అయ్యాయంటే.. ☞ ఫార్మ్-డీ 1వ సెమిస్టర్ ☞ LLB కోర్సు 5వ సెమిస్టర్ ☞ బీ ఫార్మసీ 1వ సెమిస్టర్
విశాఖ జిల్లా మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్లకు జరగనున్న పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పు జరిగినట్లు విశాఖ జిల్లా కన్వీనర్ దాసరి సత్యారావు తెలిపారు. ఈనెల 20 తేదీన 6,8 తరగతులకు, 21తేదీన 7,9 తరగతులకు మధ్యాహ్నం 3 నుంచి 5:30 గంటల వరకు జరుగుతుందన్నారు. హాల్ టికెట్లకు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
మంత్రి కొల్లు రవీంద్ర గురువారం బైక్ మీద సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన కాన్వాయ్లో వెళ్లగా, మందడం గ్రామం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రవీంద్ర తన కాన్వాయ్ దిగి బైక్పై చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
మెగా DSCపై చంద్రబాబు తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నెల్లూరు జిల్లా నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లా పరిధిలో 3,200కు పైగా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. HM పోస్టులు 100, SGT పోస్టులు 1500కు పైగా భర్తీ చేయాల్సి ఉంది. తాజాగా 16,347 పోస్టులకు చంద్రబాబు ఓకే చెప్పడంతో నెల్లూరు జిల్లాకు ఎన్ని పోస్టులు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే క్లారిటీ రానుంది.
గుత్తికి చెందిన వ్యాపారస్థుడు శ్రీరామ్ సత్య ఆంజనేయులు(65) కేదార్నాథ్లో మృతి చెందాడు. గత నెల 25వ తేదీ సుమారు 40మంది కేదార్నాథ్ తీర్థయాత్రకు వెళ్లారు. బుధవారం రాత్రి గంగోత్రిలో ఉన్న సమయంలో శ్రీరాం సత్య ఆంజనేయులుకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. దీంతో టూరిస్టులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మంత్రివర్గంలో 25 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతానికి 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులకూ కేబినెట్ హోదా వర్తిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరికీ మంత్రి పదవి లభించలేదు. ఈనేపథ్యంలో ఖాళీగా ఉన్న ఓ బెర్త్తో పాటు, దానికి సమానంగా భావించే కేబినెట్ హోదా పదవులపై జిల్లా ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి ఏ పదవి వస్తుందో వేచి చూడాలి మరి.
తన MPTC పదవికి కర్నూలు ఎంపీ బస్తిపాడు నాగరాజు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ నర్సారెడ్డికి ఆయన అందజేశారు. 2021లో కర్నూలు మండలంలోని పంచలింగాల నుంచి MPTCగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో MPగా టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రామయ్యపై గెలుపొందారు. దీంతో ఇప్పుడు MPగా ఉండటంతో MPTC పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
యర్రగొండపాలెం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను దర్శి వ్యవసాయ సంచాలకులు కె. బాలాజీ నాయక్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాకును పరిశీలించారు. రైతులు ఎటువంటి విత్తనాలు కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనుమతులు లేని రూ.5లక్షల విలువగల ఎరువులు సీజ్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ శేషి రెడ్డి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర గురువారం బైక్ మీద సచివాలయానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తన కాన్వాయ్లో వెళ్లగా, మందడం గ్రామం వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రవీంద్ర తన కాన్వాయ్ దిగి బైక్పై చంద్రబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.