Andhra Pradesh

News June 13, 2024

కర్నూలు: వైసీపీ హయాంలో 2, ఇప్పుడు 3 మంత్రి పదవులు

image

సీఎం చంద్రబాబు కేబినెట్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 మంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్, నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి నిన్న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖలు కేటాయించాల్సి ఉంది. YCP ప్రభుత్వంలో ఇద్దరే మంత్రులుగా చేశారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం పనిచేశారు.

News June 13, 2024

వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ సర్పంచ్‌ ఫిర్యాదు

image

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో బుధవారం తాము సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని రావులపాలెం మండలం కేతరాజుపల్లె మాజీ సర్పంచి కాసా చాముండేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు గాయాలు కాగా.. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు తెలిపారు. పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు.

News June 13, 2024

టెక్కలిలో YCP నాయకుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

టెక్కలికి చెందిన వైసీపీ నాయకుడు నర్సింగ్ నాధ్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టెక్కలి సీఐ పీ పైడయ్య తెలిపారు. గత నెల 13వ తేదీన పోలింగ్ బూత్ వద్ద జరిగిన తగాదా విషయంలో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్కలికి చెందిన నర్సింగ్ నాధ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రిమాండ్ విధించడంతో నరసన్నపేట ఉప కారాగారానికి తరలించారు.

News June 13, 2024

మంత్రి స్థానం నిలబెట్టుకున్న ‘సాలూరు’ నియోజకవర్గం

image

సాలూరు నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎమ్మెలేగా గెలిచిన గుమ్మడి సంధ్యారాణి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆమె సమీప ప్రత్యర్థి మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక. రాజన్నదొరపై 13,733 ఒట్ల మోజారిటీతో గెలుపొందారు. లోకేశ్ యువగళం కార్యక్రమంలో సాలూరులో ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆమె గెలుపుతో ‘సాలూరు’ నియోజకవర్గం మంత్రి స్థానం నిలబెట్టుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

News June 13, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ పనుల కారణంగా గుంటూరు- విజయవాడ మధ్య ప్రయాణించే మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07864 గుంటూరు- విజయవాడ ట్రైన్‌ను ఈ నెల 24 నుంచి ఆగస్టు 15 వరకు, నం.07628 విజయవాడ- గుంటూరు ట్రైన్‌ను ఈ నెల 21 నుంచి ఆగస్టు 12 వరకు రద్దు చేశామంది. ప్రయాణికులు రైళ్ల రద్దు అంశాన్ని గమనించాలని కోరింది.

News June 13, 2024

పాడేరు ఘోర ప్రమాదంలో.. అచ్యుతాపురం యువకుడి మృతి

image

పాడేరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదం అచ్యుతాపురంలో విషాదం నింపింది. సౌండ్స్ సిస్టమ్స్‌తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడి ముగ్గరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అచ్యుతాపురానికి చెందిన పీ.లక్ష్మణ్(25) మృతిచెందాడు. ఈయనకు భార్య, 5 నెలలు బాబు ఉన్నారు. లక్ష్మణ్ మృతి చెందాడనే విషయం తెలిసి కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుపెట్టుకున్నారు.

News June 13, 2024

సౌత్ జోన్ అండర్-19 బాలికల క్రికెట్ ఛాంపియన్ అనంతపురం జట్టు

image

వెంకటగిరిలో జరిగిన సౌత్ జోన్ వన్ డే బాలికల క్రికెట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అనంతపురం జిల్లా అండర్-19 బాలికల క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. అనంతపురం జట్టు 14 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సౌత్ జోన్ ఛాంపియన్‌గా నిలిచిన అనంతపురం జట్టును జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి మధు ఆచారి, కోచ్ ఆర్.కుమార్ అభినందించారు.

News June 13, 2024

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

మహానంది మండలం సీతారామపురం సమీపంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. నాగులు అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో స్కూటర్‌పై నంద్యాల వైపు నుంచి, గాజులపల్లె వైపు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. నాగులు అక్కడికక్కడే మృతిచెందగా.. భర్త బాబు, పిల్లలకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News June 13, 2024

మిస్సింగ్.. చనిపోతున్నానంటూ భార్యకు వీడియో కాల్

image

ప.గో జిల్లా తణుకుకు చెందిన వ్యక్తి రెండ్రోజులుగా కనిపించడంలేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. ఆలమూరివారి వీధిలో నివాసం ఉంటున్న అరిపాక హరీశ్ ఈనెల 11న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి హరీశ్ భార్య జయశ్రీకి వీడియో కాల్‌ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశారు. దీంతో ఆందోళన చెందిన జయశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News June 13, 2024

ఒంగోలులో ఉరి వేసుకొని బాలుడు ఆత్మహత్య

image

ఒంగోలు నెహ్రు నగర్లో 15 ఏళ్ల బాలుడు బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు శ్రీకాంత్(15) ఉన్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.