India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీలో కొత్తగా కొలువుదీరే మంత్రుల జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ప్రకటించారు. 24 మందితో కూడిన జాబితాను జాబితాను తాజాగా ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డిని మాత్రమే మంత్రి పదవి వరించింది. ఈయన రాయచోటి నియోజకవర్గం నుంచి వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డిపై విజయం సాధించారు. ఈయనకు అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు వరించాయి. నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూఖ్, బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్కు కేబినెట్లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. కాగా, ఉమ్మడి జిల్లాలో 11 స్థానాల్లో టీడీపీ, 2 స్థానాల్లో వైసీపీ, ఒకటి బీజేపీ గెలుపొందాయి.
ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డికు కేబినెట్లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. గతంలో వీరు మంత్రులుగా పనిచేశారు. నారాయణ గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయగా.. ఆనం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లానుంచి ఒక్కరికే కేబినెట్లో చోటుదక్కింది. టెక్కలి నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడుకి మరోసారి మంత్రి పదవి వరించింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. కాగా రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కడం తెలిసిందే. దీంతో వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
TDP అధినేత చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. కొల్లు రవీంద్ర(మచిలీపట్నం), పార్థసారథి(నూజివీడు)కు చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ గతంలో మంత్రులుగా పనిచేశారు. కొల్లు రవీంద్ర గత టీడీపీ ప్రభుత్వంలో, పార్థసారథి వైఎస్ఆర్ హయాంలో మంత్రులుగా సేవలందించారు.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 మంది MLAలలో ఒక్కరికి మంత్రి పదవి దక్కింది. పాలకొల్లు నియోజకవర్గం నుంచి గెలుపొందిన నిమ్మల రామానాయుడు మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా 3 సార్లు విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ MLAగా రికార్డ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో నియోజకవర్గంలో 70 శాతం ఓటింగ్ పొంది.. జిల్లాలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగానూ గుర్తింపు పొందారు.
TDP అధినేత చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగ్గురికి అవకాశం ఇచ్చారు. నారా లోకేశ్(మంగళగిరి), నాదెండ్ల మనోహర్ (తెనాలి), అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)కు చోటు దక్కించుకున్నారు. అనగాని సత్యప్రసాద్ తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. నాదెండ్ల మనోహర్ ఉమ్మడి AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, స్పీకర్గా.. లోకేశ్ గత TDP ప్రభుత్వ హాయంలో మంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే.
ఉమ్మడి అనంత జిల్లా నుంచి ముగ్గురిని మంత్రి పదవులు వరించాయి. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ (బీజేపీ), ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పెనుకొండ ఎమ్మెల్యే ఎస్.సవితకు కేబినెట్లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. ఆ ఒక్కరూ మన ధర్మవరం ఎమ్మెల్యే కావడం విశేషం. వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
నూతన మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు మాత్రమే సీఎం హోదాలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మిగిలిన ఎవరికీ మంత్రి పదవులు దక్కలేదు. సీనియర్ కోటాలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎస్సీ కోటాలో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామస్, మురళి మోహన్ పేర్లు వినిపించాయి. అలాగే పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ పేరు తెరపైకి వచ్చినా.. ఎవరికీ పదవులు ఇవ్వలేదు.
సీఎంగా చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నూతన శోభను సంతరించుకున్నాయి. అధికారులు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాలలో చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Sorry, no posts matched your criteria.