Andhra Pradesh

News September 27, 2024

వరద బాధితులకు శరవేగంగా పరిహారం అందించాం: మంత్రి లోకేశ్

image

విజయవాడ వరద బాధితులకు శరవేగంగా 15 రోజులలో రూ.602కోట్ల నష్టపరిహారం అందించామని మంత్రి లోకేశ్ గురువారం ట్వీట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 4 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమచేశామని లోకేశ్ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మిచాంగ్ తుఫాన్ బాధితులకు పరిహారం ఇచ్చేందుకు 5 నెలలపైనే సమయం తీసుకుందని లోకేశ్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.

News September 27, 2024

హస్త కళలను ప్రజలు ఆదరించాలి: భార్గవ్ తేజ

image

హస్త కళలను ప్రజలు ఆదరించి కళాకారులను మరింతగా ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన చేనేత, హస్త కళా ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు. కళాకారుల జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే క్రాఫ్ట్ బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

News September 27, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

➤ నందిగం సురేశ్, మేరుగ నాగార్జునలకు కీలక పదవులు
➤ పల్నాడు: కత్తులతో దాడి చేసుకున్న యువకులు
➤ గుంటూరు: దుగ్గిరాలలో అత్యధిక వర్షపాతం నమోదు
➤ బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
➤ మంగళగిరి: బాలికను వేధిస్తున్న యువకుడి అరెస్ట్
➤ గుంటూరులో అర్ధరాత్రి మద్యం విక్రయాలు

News September 27, 2024

‘దేవర’ అభిమానుల సందడి.. కటౌట్‌కి పాలాభిషేకం

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని మానేపల్లిలో ‘దేవర’ అభిమానుల సందడి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ భారీ కటౌట్స్‌కు ఆయన ఫ్యాన్స్ గజమాలలు వేసి, పాలాభిషేకం చేశారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రారంభం కానుండగా.. అన్ని థియేటర్లలో రేపు రిలీజ్ కానుంది. అనంతరం టపాసులు పేల్చుతూ ‘జై ఎన్టీఆర్.. జై జై ఎన్టీఆర్..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ మూవీలోని పాటలకు డాన్సులు వేశారు.

News September 27, 2024

కర్నూలు కలెక్టరేట్ పరిపాలన అధికారిగా విజయశ్రీ

image

కర్నూలు కలెక్టరేట్ పరిపాలన అధికారిగా విజయశ్రీ గురువారం ఏవో ఛాంబర్‌లో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. గతంలో సీ.బెళగల్ మండలంలో తహశీల్దార్‌గా బాధ్యతలు నిర్వహించిన విజయశ్రీ సాధారణ బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పరిపాలన అధికారిగా పనిచేసిన రాజేశ్వరి కలెక్టరేట్ రెవెన్యూ సెక్షన్‌లోనే నియమితులయ్యారు.

News September 26, 2024

నంద్యాల సబ్ డివిజన్ పోలీసులతో ఎస్పీ సమీక్ష

image

నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో గురువారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలని పోలీసులకు ఎస్పీ పిలుపునిచ్చారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎక్కడా మట్కా, గ్యాంబ్లింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు.

News September 26, 2024

కృష్ణా: రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన

image

కృష్ణా జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు పాటించాల్సిన నియమాలపై గురువారం అవగాహన కల్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్న సమయంలో హెల్మెట్ ధరించకుండా, నిబంధనలు పాటించకుండా వాహనం నడుపుతున్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని వారు వాహనదారులను హెచ్చరించారు.

News September 26, 2024

కృష్ణా: ‘అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు’

image

కృష్ణా జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని జిల్లా పోలీస్ యంత్రాంగం తమ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో గురువారం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపింది. మద్యం సేవించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేస్తున్నామని ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.

News September 26, 2024

తూ.గో: 4వరోజు గాలింపు.. రంగంలోకి డాగ్ స్క్వాడ్

image

ఏలూరు ఆశ్రం వైద్య విద్యార్థులు ఏజెన్సీలోని జలపాతం వద్ద నాలుగు రోజుల కింద గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో విద్యార్థి హరదీప్ ఆచూకీ ఇప్పటికి తెలియరాలేదు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. జిల్లా అధికారుల సమక్షంలో గురువారం డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఏజెన్సీని జల్లెడపట్టారు. అయినా హరదీప్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబీకులు ఆందోళనలో ఉన్నారు.

News September 26, 2024

పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ

image

జిల్లా పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం గురువారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న 32 మంది పోలీసులు వారి వ్యక్తిగత, ఉద్యోగ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. ఎస్పీ సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.