India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన మంత్రివర్గం సైతం ఏర్పాటుకానుంది. ఈ నేపథ్యంలో సదరు కార్యక్రమాన్ని వీక్షించేలా.. ఉమ్మడి తూ.గో. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల అధికారులు LED స్క్రీన్లు, టీవీలను ఏర్పాటుచేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే విద్యుత్ కాంతుల నడుమ సిద్ధం చేశారు.
– మీ వద్ద పరిస్థితి ఏంటి..?
రైలు నెంబరు 18311 విశాఖపట్నం నుంచి బెనారస్ వెళ్ళే రైలు నేడు తెల్లవారుజామున 04.20 విశాఖపట్నంలో బయలుదేరే బదులు ఉదయం 07.05 గంటలకు బయలుదేరుతుందని రైల్వే వర్గాలు తెలిపారు. కొత్తవలసకు ఉదయం 07.35 గంటలకు వస్తుందని తెలిపారు. ఆలస్యానికి చింతిస్తున్నామని రైల్వే అధికారులు కోరారు. ప్రయాణీకులు గమనించాలని ఓ ప్రకటనలో తెలిపారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకార నేపథ్యంలో కోటబొమ్మాలిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ కాంతుల వెలుగులీనుతున్నాయి. స్థానిక మండల పరిషత్, రెవెన్యూ, ఐసీడీఎస్, గ్రామ సచివాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలంకరణతో కనిపించాయి. ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది.
సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
తాడేపల్లి పరిధి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్షా విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ చంద్రబాబు అమిత్షాకి విందు ఏర్పాటు చేశారు. విందు తర్వాత కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందే అమిత్షా రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయవాడ నోవాటేల్లో అమిత్షా బసచేయనున్నారు.
ఏపీలో పలు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెంటాడ మండలంలోని జక్కువ గ్రామానికి చెందిన పొట్టా నిశ్వాంత్ 93.5676 స్కోర్ సాధించి జిల్లాస్థాయిలో 14 వ ర్యాంక్ సాధించాడు. ఉత్తమ ర్యాంక్ను సాధించిన విద్యార్థికి తల్లిదండ్రులు, గ్రామస్థులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.
ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఏపీ ఈఏపీ సెట్-2024 ఎంట్రన్స్ ఫలితాల్లో శ్రీకాకుళం పట్టణం ఇందిరా నగర్ కాలనీ ప్రాంతానికి చెందిన మావూరి జస్విత్ 84వ ర్యాంకును సాధించాడు. ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలో జస్విత్ 87.19 శాతం మార్కులను సాధించి తన ప్రతిభను కనబరిచాడు. మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తండ్రి ఈశ్వర్ నర్సింగ్ తోపాటు కుటుంబ సభ్యులు స్థానికులు అభినందించారు.
కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో రేపు బుధవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వారు మంగళవారం సాయంత్రం వెల్లడించారు. ఆయా జిల్లాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతవాసులు కురిసే వర్షాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కిందకు వెళ్ళవద్దని సూచించారు.
టెక్కలిలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం అధికారులు విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. స్థానిక ఎన్ఆర్ఈజీఎస్, వెలుగు కార్యాలయాలకు అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్న నేపధ్యంలో కార్యాలయాలను విద్యుత్ లైటింగ్ తో అలంకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాణస్వీకారం లైవ్ కార్యక్రమాన్ని టెక్కలిలో ఏర్పాటు చేయనున్నట్లు టెక్కలి ఎంపీడీఓ వెల్లదించారు
కాకినాడ జిల్లాకేంద్రంలోని రంగరాయ మెడికల్ కళాశాల ఎదురుగా ఆనంద్ నిలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 9 గంటలకు సైకిల్పై వెళ్తున్న ఓ యువతిని ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.