India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా విధులు నిర్వహిస్తున్న జిలాన్ బాషా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం ఉదయం కనేకల్లు మండలంలోని మాల్యం వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ఛాతి నొప్పితో సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన తోటి ఉద్యోగులు ఆయనని కనేకల్లు క్రాస్ వద్ద ఉన్న ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు.
కందుకూరు మండలం మాచవరంలో మంగళవారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. బుధవారం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మాచవరం గ్రామ శివారులో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నప్పుడు కరెంట్ షాక్ తగిలి నరసింహ(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న కరెంటు స్తంభం తీగలు తగిలి షాక్తో నరసింహ పైనుంచి కింద పడినట్లు స్థానికులు తెలిపారు.
సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
ఎస్ రాయవరం మండలం గోకులపాడు వద్ద లారీ మంగళవారం ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విశాఖ నుంచి కర్ణాటక వెళుతున్న లారీ గోకులపాడు వద్దకు వచ్చేసరికి లారీ డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకుని ఇంటిని ఢీకొట్టాడు. ఇంటిని ఢీకొని లారీ ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
సీఎంగా చంద్రబాబు బుధవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో రంగు రంగుల విద్యుత్ దీపాలతో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయాన్ని అలంకరించారు. కలెక్టరేట్తో పాటు జిల్లాలోని అన్ని ముఖ్య అధికార కార్యాలయాలన్నీ విద్యుత్ వెలుగులతో దగదగలాడుతున్నాయి. కార్యాలయాలతో పాటు అన్ని తాహసిల్దార్, మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాలను అలంకరించారు.
ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఆఖరి నిమిషంలో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కిమిడి కళావెంకట్రావుకు ఏపీ కొత్త కేబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు.. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న కీలకనేతలకు స్వయంగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా కేబినెట్లో చోటుపై అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది.
సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విజయవాడ చేరుకుంటున్నారు. కేసరిపల్లిలోని ఐటీటవర్ వద్ద బుధవారం ఉ.11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనుండగా.. దాదాపు 7వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రధానితో పాటు కీలక నేతలు, వీవీఐపీలు విచ్చేస్తుండటంతో వారు బసచేసే హోటల్స్ వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటుచేశారు. విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
ఏలూరు జిల్లా వైసీపీ కార్యదర్శి చాటపర్తి పోసిబాబు తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసుకు పంపించానన్నారు. భవిష్యత్ కార్యాచరణను కార్యకర్తలతో చర్చించి త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
ఈనెల 13న పాఠశాలలో పునః ప్రారంభిస్తున్నట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్యామల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీన ప్రారంభమవుతాయని తెలిపారు.
ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం మద్యాహ్నం గ్రామానికి చెందిన బూదగవి రామలింగ అనే వ్యక్తి స్థానికి సత్యసాయి పంపుహౌస్ వద్ద నీళ్లు పట్టుకుంటుండగా ఒక్కసారిగా పైనుంచి ఎండిన చెట్టు కొమ్మ విరిగి మీద పడింది. దీంతో తీవ్రంగా గాయపడిని అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
Sorry, no posts matched your criteria.