India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం గన్నవరం విమానాశ్రయం చేరుకోగా.. విశాఖ ఎంపీ శ్రీభరత్ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు కేటాయించిన హోటల్కు తీసుకువెళ్లారు.
కడప జిల్లాలో 20 ఏళ్లుగా ఒక కలలా ఉన్న కడప ఉక్కు పరిశ్రమ ఈ సారి పూర్తి అవుతుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ నుంచి గెలిచిన నర్సాపురం ఎంపీకి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం వచ్చింది. అందులోనూ అతను బీజేపీ ఎంపీ కావడం, జమ్మలమడుగు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఉండటంతో కడప ఉక్కు పరిశ్రమ సాకారమవుతుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం టెక్కలి సమీపంలో అండర్-23 నార్త్ జోన్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన పోటీలు ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదటిరోజు క్రికెట్ పోటీలను ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ డా.వి.వి నాగేశ్వరరావు ప్రారంభించారు. మొదటి రోజు శ్రీకాకుళం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు ఆర్గనైజింగ్ కన్వీనర్ ఎన్. లాల్ బహుదూర్ తెలిపారు.
విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు (07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె- తెనాలి (07873), తెనాలి-విజయవాడ (07630) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల (07781) రైళ్లు నడవవని తెలిపారు.
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. కాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకాగా పవన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు చెందిన MLAలు బొమ్మిడి నాయకర్, పులపర్తి అంజిబాబు, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు ఉన్నారు
విజయనగరం జిల్లాలో 3,600 మద్యం షాపులు, 40 వేల కుటుంబాలు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. దత్తిరాజేరు మండలం మానాపురం, మరడాం, రాజుల రామచంద్రపురం, మేడపల్లి, చల్లపేట వైన్షాపుల్లో చేస్తున్న సిబ్బంది రోడ్డెక్కారు. కొత్త ప్రభుత్వంలో కొత్త మద్యం పాలసీ తీసుకొస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన చెందారు. ఈ సమస్యని సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మీడియాని కోరారు.
రేపటి చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం నిమిత్తం గన్నవరంలో 12 హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరి రాక నిమిత్తం వీఐపీల కాన్వాయ్ వెళ్లే దారిలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వివరాలు వెల్లడించింది.
చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఉడేగోళానికి చెందిన పదో తరగతి చదువుతున్న చరణ్ను రెండు నెలల కిందట రాయదుర్గం మండలం 74 ఉడేగోళం వద్ద ఉన్న హైవేపై రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబీకులు బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కరెంట్ షాక్తో ఇద్దరు మృతి చెందిన ఘటన ఒంటిమిట్ట మండలంలోని ఇబ్రహీంపేట ఎస్సీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల సమాచారం మేరకు కోనేటి గంగమ్మ తన ఇంటిలోని ఫ్రిజ్ను తెరవగా కరెంట్ షాక్ తగిలి అరుపులు వేసింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న పేరూరు కొండయ్య అరుపులు విని ఇంటిలోకి వెళ్ళి ఆమెను రక్షించబోయే అతడు కరెంట్ షాక్కు గురై మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తొమ్మిదికి తొమ్మిది సీట్లు కైవసం చేసుకుంది. మంగళవారం విజయవాడలోని ఎన్డీఏ శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఒకే ఫ్రేమ్లో ఫొటో దిగారు.
Sorry, no posts matched your criteria.