Andhra Pradesh

News June 11, 2024

కర్నూలు: అన్ని మండలాల్లో భారీ తెరలు

image

ఉమ్మడి జిల్లాలోని ఎంపీడీవో కార్యాలయాల ప్రాంగణాల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని భారీ తెరలపై వీక్షించే ఏర్పాట్లు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ‘లైవ్‌ స్ట్రీమింగ్‌’ విధానంలో తెరలపై ప్రదర్శిస్తారు. నియోజకవర్గంలో ఒకచోట ఎక్కువ మంది వీక్షించేలా భారీ తెరలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

News June 11, 2024

గుంటూరు జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు.. SP తుషార్

image

ఈనెల 12వ తేదీన సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ హాజరు కానున్నందున, గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాల మళ్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ మంగళవారం తెలిపారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు పేరేచర్ల జంక్షన్, సత్తెనపల్లి, పిడుగురాళ్ల మీదగా హైదరాబాద్ వెళ్లాలన్నారు. ప్రమాణ స్వీకారం ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందన్నారు.

News June 11, 2024

ఒంగోలు: పాఠశాలల ప్రారంభం రోజే కిట్ల పంపిణీ

image

పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందజేసేందుకు ఒంగోలు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా మండలాలకు బ్యాగ్లు, పుస్తకాలు, బూట్లు, బెల్ట్ తదితర వస్తువులు సరఫరా చేశారు. అక్కడి నుంచి పాఠశాలలకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హెచ్‌ఎంకు రవాణా ఛార్జీలు మంజూరు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి స్టూడెంట్ కిట్ పేరుతో పంపిణీ చేపట్టాలని మౌఖిక ఆదేశాలందాయి.

News June 11, 2024

విజయవాడ: గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు

image

ఆంధ్రప్రదేశ్ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తీర్మాన పత్రాన్ని మంగళవారం కూటమి నేతలు గవర్నర్‌కు అందజేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌లు కలిసి విజయవాడలోని రాజ్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

News June 11, 2024

రూ.1200 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ

image

నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ దోపిడీకి సంబంధించి 275 కేసులు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, సర్వేపల్లిలోని పొదలకూరు మండలాల్లో భారీ ఎత్తున మైనింగ్ జరిగింది. అక్రమ మైనింగ్ పై అప్పట్లో సత్యాగ్రహం చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రూ.1200 కోట్ల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తవ్వినట్లు గుర్తించారు.

News June 11, 2024

నెల్లూరు : తొలిసారి అసెంబ్లీకి ఐదుగురు

image

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో జిల్లా నుంచి ఐదుగురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. పొంగూరు నారాయణ గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. ఆయనతో పాటు నెలవల విజయశ్రీ(సూళ్లూరుపేట), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి(కోవూరు), కావ్యా కృష్ణారెడ్డి(కావలి), కాకర్ల సురేష్ (ఉదయగిరి) ఉన్నారు.

News June 11, 2024

నెల్లూరులో మూడు చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు

image

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ప్రజలు తిలకించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి కోటమిట్ట షాదీమంజిల్, నవాబుపేటలోని బీవీఎస్ ఉన్నత పాఠశాల, స్వతంత్ర పార్కులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కస్తూరిబా కళాక్షేత్రంలోనూ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు.

News June 11, 2024

VZM: ఎన్డీఏ సమావేశంలో మన మహిళ ఎమ్మెల్యేలు

image

విజయవాడలోని ‘ఏ కన్వెన్షన్’ సెంటర్‌లో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మహిళ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అధితి గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి, ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి, సాలూరు ఎమ్మెల్యే సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి ఉన్నారు.

News June 11, 2024

శ్రీకాకుళం: వేసవి తాపం మళ్లీ మొదలు..

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వేసవికాలం పూర్తయినప్పటికీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి వాతావరణం కొంతమేర చల్లబడినా.. ప్రస్తుతం ఎండలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే. మంగళవారం 12 గంటల సమయానికి 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో ఉక్కపోత మళ్లీ మొదలైంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడికి చాలా ఇబ్బంది పడుతున్నారు.

News June 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ముస్తాబాద- గన్నవరం రైల్వే సెక్షన్ మధ్య ట్రాఫిక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నం.06521 SMV బెంగుళూరు- గువాహటి ట్రైన్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ ట్రైన్‌ ఈ నెల 11 నుంచి 25 వరకు విజయవాడ- ఏలూరు- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.