India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి తూ.గో జిల్లాలో మంత్రి పదవి ఆశావహులు భారీగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్కి దాదాపు కన్ఫర్మ్ కాగా.. జనసేన కోటాలో కందుల దుర్గేశ్, BJP కోటాలో నల్లమిల్లికి అమాత్య యోగం ఉన్నట్లు తెలుస్తోంది. యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేర్లు బలంగా వినిపిస్తుండగా.. బుచ్చయ్యచౌదరి, వనమాడి కొండబాబు, సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు సహా తొలిసారి ఎన్నికైన పలువురు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు (07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె- తెనాలి (07873), తెనాలి-విజయవాడ (07630) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 22 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల (07781) రైళ్లు నడవవని తెలిపారు.
కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో మంత్రి పదవులపై నెల్లూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేతలుగా గుర్తింపు పొందగా.. పొంగూరు నారాయణ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. మహిళా కోటలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు వినిపిస్తోంది. కాగా ముగ్గురికి మంత్రి పదవులు రావొచ్చని తెలుస్తోంది.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుకానున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ సాగుతోంది. ఈరోజు విజయవాడలో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి పేర్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దామచర్ల జనార్దన్, ఏలూరి సాంబశివరావు సైతం రేసులో ఉన్నారు
బైక్ అదుపు తప్పి వంతెన డివైడర్ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన బొబ్బిలిలో చోటుచేసుకుంది. బొబ్బిలిలోని స్వామివారి వీధికి చెందిన జగదీశ్వరరావు (30) ఆదివారం రాత్రి ఇంటికి వస్తుండగా ఫ్లైఓవర్పై బైక్ అదుపుతప్పి వంతెన డివైడర్ను బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగదీశ్కు ప్రథమచికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విజయనగరం తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.
తాడిపత్రిలో ఎన్నికల నేపథ్యంలో మే 13, 14వ తేదీల్లో జరిగిన అల్లర్లపై సిట్ ఎన్నికల సంఘానికి ఈనెల 1న తుది నివేదిక అందజేసింది. అల్లర్లపై మొత్తం 7 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొంది. పోలింగ్ రోజు ఓంశాంతి నగర్, జూనియర్ కళాశాల మైదానం, టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్ద జరిగిన దాడులు, ఏయే కేసుల్లో ఎంత మందిని నిందితులుగా గుర్తించారు? లాంటి వివరాలతో మొత్తం 370 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది.
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం సిల్వర్ సెట్-2024 నిర్వహిస్తున్నట్లు క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డీవీఆర్ సాయి గోపాల్ తెలిపారు. పరీక్ష గడువు జూన్ 23వ తేదీ వరకు పొడిగించామన్నారు. పరీక్ష జులై 7వ తేదీ ఆన్లైన్ విధానంలో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు.
ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కూటమి తరఫున 31 ఆర్టిసీ ఎక్స్ప్రెస్, 9 ఆల్ట్రా డీలక్స్ కలిపి మొత్తం 40 బస్సులు జిల్లా నుంచి గన్నవరంకి వెళ్లనున్నాయి. ఈ బస్సులు మంగళవారం రాత్రి బయలుదేరి బుధవారం ఉదయానికి చేరుకుంటాయి.
ప్రస్తుతం జిల్లాలోని కీలక స్థానాలో ఉన్న అధికారుల్లో ఎక్కువ మంది మూడేళ్లకు పైగా కొనసాగుతున్నారు. వీరిలో పాటు, వైసీపీ మంత్రులు, MLAల సిఫార్సులతో వచ్చినవారు ఉన్నారు. TDP అధికారంలోకి రావడంతో రాష్ట్రస్థాయిలో కీలక స్థానాల్లో అధికారుల మార్పు మొదలైంది. తొలుత కలెక్టర్, సంయుక్త కలెక్టర్, డీఆర్వో ఉంటనున్నట్లు తెలుస్తోంది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి, జిల్లా మత్య్సశాఖ అధికారి పేర్లు వినిపిస్తున్నాయి.
మద్యం మత్తులో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న <<13412715>>వివాదమే<<>> దారుణ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. ఊర్వశి జంక్షన్ నలంద నగర్లో స్నేహితుడి పుట్టినరోజు అని హేమంత్ కుమార్, సాయికిరణ్, అభిషేక్, హరీశ్, ఉదయ్ కలిసి బయటికి వెళ్లారు. మద్యం తాగిన అనంతరం వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో హేమంత్ ఉదయ్ మెడపై కత్తితో పొడవగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.