India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, కర్నూలు ఎస్పీ జీ.బిందు మాధవ్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. డీఐజీ మాట్లాడుతూ అల్లరి మూకలు, ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన వారిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాబరీ, డెకాయిటి వంటి కేసులపై దర్యాప్తులు పకడ్బందీగా చేయాలన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పలు జిల్లాలకు పూర్తి అధ్యక్షులు, పార్టీ కన్వీనర్లను గురువారం ప్రకటించారు. మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మాజీ MP మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరై నివాళులర్పించారు. తొలుత మాగుంట నివాసంలో పార్వతమ్మ పార్థివ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, పోలీసు బ్యాండ్తో గాల్లోకి 3రౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఈ అంత్యక్రియల్లో MLAలు సోమిరెడ్డి, దామచర్ల జనార్ధన్, నేతలు, పెద్దఎత్తున మాగుంట అభిమానులు పాల్గొన్నారు.
విజయవాడలోని R&B ఈఎన్సీ కార్యాలయంలో CM చంద్రబాబు ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న జాతీయ రహదారుల అప్ గ్రేడేషన్కు సంబంధించి గురువారం నిర్వహించిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. భూసేకరణ సమస్యలు, అటవీ క్లియరెన్స్, తదితర సమస్యలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి బీసీ, వారికి దిశానిర్దేశం చేశారు.
బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున నియమిస్తూ.. వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా నందిగం సురేశ్ను నియమించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి నేతలకు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని వైసీపీ అధ్యక్షులను పార్టీ అధిష్ఠానం గురువారం నియమించింది. విశాఖకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను, అనకాపల్లి జిల్లాకు మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడిని నియమించింది. అటు అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షునిగా పాడేరు MLA విశ్వేశ్వర రాజుకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు విశాఖ వెస్ట్ ఇన్ఛార్జ్గా మళ్లా విజయప్రసాద్ను నియమించారు.
బత్తలపల్లి అండర్-14 బాలుర కబడ్డీ జట్టు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు రామాపురం పాఠశాల పీడీ లక్ష్మీనారాయణ, మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు. వారు మాట్లాడుతూ.. గురువారం ధర్మవరంలో జరిగిన నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు బత్తలపల్లి మండలం అండర్-14 బాలల విభాగంలో కబడ్డీ విన్నర్స్గా నిలిచి జిల్లాస్థాయికి ఎంపికైనట్లు వారు తెలిపారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాలకు సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 342 టీచింగ్, 44 నాన్ టీచింగ్ ఉద్యోగాలు, టైప్ 4 కేజీబీవీల్లో 165 టీచింగ్, 53 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు తెలిపారు. గురువారం ఆన్ లైన్ ద్వారా నగదు చెల్లింపునకు అవకాశం కల్పించారు. వివరాలకు apkgbv.apcfss.in వెబ్ సైట్ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు. 20 కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈనెల 25 నుంచి అక్టోబర్ 24 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.