India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 2024లో నిర్వహించిన బీ ఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు. వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడవచ్చన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలను ఆయనతో చర్చించారు. కార్యక్రమంలో MLC కౌరు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన గూడూరి ఉమాబాల, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ డైరెక్టర్ మంతెన యోగేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.
శ్రీకాకుళం MP రామ్మోహన్ నాయుడుకు పౌరవిమానయానశాఖ కేటాయించిన సంగతి తెలిసిందే. ఆశాఖ కేటాయింపుతో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్ పోర్టు పనులు మరింత వేగంగా జరుగుతాయని ప్రజలు ఆశాభావం వ్వక్తంచేస్తున్నారు. 2014 కూటమి ప్రభుత్వ హయాంలో భోగాపురం ఎయిర్పోర్టుకు CM హోదాలో చంద్రబాబు, కేంద్రమంత్రి హోదాలో అశోక్ గజపతిరాజు శంకుస్థాపన చేయగా.. మళ్లీ సీఎం జగన్ రెండోసారి శంకుస్థాపన చేశారు.
VZM జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ఇప్పటికే జరుగుతుండగా .. పక్క జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి సివిల్ ఏవియేషన్ (పౌర విమానయాన ) మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వం కేటాయించడంతో ఈ ఎయిర్పోర్ట్ పనులు మరింత ఊపు అందుకోనున్నాయని ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీంతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగం కలనెరవేరబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఐదేళ్ల కిందట మూతబడగా.. ఎమ్మెల్యే బాలకృష్ణ తొలి అన్న క్యాంటిన్ను తన నియోజకవర్గం నుంచే ప్రారంభించారు. హిందూపురం నుంచి మూడోసారి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు రుణపడి ఉంటానని బాలయ్య పేర్కొన్నారు.
వాడరేవు వద్ద సముద్రంలో ఆదివారం సాయంత్రం గల్లంతైన కావూరివారిపాలెంకు చెందిన జైపాల్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం బాపట్ల పక్కన ఉండే పాండు రంగాపురం వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో అక్కడి మత్స్యకారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని చీరాల రూరల్ పోలీసులకు విషయాన్ని తెలిపారు. జైపాల్తో సహా ముగ్గురు వాడరేవులో సముద్ర స్నానానికి వెళ్లగా ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ప్రతి సంవత్సరం విశాఖ ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో మంగళవారం గంగమ్మతల్లి పండగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్య్సకారులకు వేట విరామ సమయం ముగిసి.. తిరిగి చేపల వేట ప్రారంభించే ముందు గంగమ్మకు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఉదయం 4 నుంచి 8 గంటల వరకు పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సుండుపల్లె మండలంలోని పించా దగ్గర ఉన్న చర్చి ఎదుట సోమవారం రెండు బైకులు అతి వేగంతో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సుండుపల్లె ఎస్సై హుస్సేన్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. కాగా ఆయన ఇటీవల ఎన్నికల్లో ఆయనకు 7,07,343 ఓట్లు రాగా.. ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2,76,802 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
మద్దికేర మండల కేంద్రానికి చెందిన రేలంపాడు వెంకటేశ్వర్లు రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్గా గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో విధులు నిర్వహించారు. అయితే సోమవారం రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. రాజీనామా లేఖను జల వనరుల శాఖ ప్రధాన కార్యదర్శికి పంపారు.
Sorry, no posts matched your criteria.