Andhra Pradesh

News June 10, 2024

తిరుపతి: నేటి నుండి తరగతుల ప్రారంభం

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని పీజీ(PG) విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. గత నెల 11 నుంచి వేసవి సెలవులు ప్రకటించగా నేటి నుంచి తరగతులు సందడిగా మారనున్నాయి. వేసవి సెలవులు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని అధికారులు సూచించారు. రెండు రోజుల కిందట ఎస్వీయూ ఉపకులపతి శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ నిరసన చేసిన విషయం తెలిసిందే.

News June 10, 2024

VZM: జిల్లా వ్యాప్తంగా 249 మందికి ఈ-చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను సోమవారం తెలిపారు. MV నిబంధనలు అతిక్రమించిన 249 మందిపై రూ.67,425 ఈ చలానాలు విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 8 మందిపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 22 మందిపై జిల్లావ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.

News June 10, 2024

ప్రకాశం: తండ్రి మందలించాడని కుమార్తె సూసైడ్

image

తండ్రి మందలించాడని మనస్తాపానికి గురై కుమార్తె ఆదివారం పొన్నలూరులో ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ వివరాల మేరకు.. రాజస్థాన్ కు చెందిన జక్సన్ సింగ్ బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం పొన్నలూరు వచ్చాడు. ఆదివారం రాజపుత్ర హేమ(15)ను తండ్రి టీ పెట్టమని కోరాడు. టీ సరిగ్గా లేదని మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంటి పైగదిలో ఉరేసుకుంది. గుర్తించిన జక్సన్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టారు.

News June 10, 2024

వైసీపీ చేసిన తప్పు మనం చేయొద్దు: వరద

image

వైసీపీ నేతలు గతంలో చేసిన తప్పులను తిరిగి మనం చేయకూడదని ఎమ్మెల్యేగా ఎన్నికైన వరదరాజులరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దని అందరం కలిసి కట్టుగా అభివృద్ధిపై దృష్టి పెడదామన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు తనకు తెలిపి హుందాతనాన్ని చాటారన్నారు. జగన్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి వెళ్లిపోయారని ఆరోపించారు.

News June 10, 2024

వన్నెపూడి ఘటనపై జనసేనాని పవన్ సీరియస్..!

image

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి ఘటనను జనసేనాని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన గెలుపునకు శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దాడి జరగడం సరికాదని, ఈ ఘటన వెనుక ఎవరున్నారు..? అనే దానిపై వివరాలు సేకరించాలని పవన్ ఆదేశించినట్లు నేతలు చెబుతున్నారు. వారంలో పవన్ పిఠాపురం రానున్నట్లు ఇప్పటికే నాగబాబు ప్రకటించారు.

News June 10, 2024

విశాఖ: కంచరపాలెంలో దారుణ హత్య

image

విశాఖలోని కంచరపాలెం పరిధిలో దారుణ ఘటన చోటచేసుకుంది. సోమవారం ఉదయం కొంతమంది దుండగులు అదే ప్రాంతానికి చెందిన ఉదయ్( 20)పై కత్తితో మెడపై దాడి చేశారు. దీంతో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
.

News June 10, 2024

సిక్కోలుకు 4వసారి కేంద్ర మంత్రి పదవి

image

సిక్కోలు జిల్లా నేతలకు నాల్గవసారి కేంద్ర మంత్రి పదవి లభించింది. 1952లో పాతపట్నం పార్లమెంట్ స్థానం నుంచి వరహగిరి వెంకటగిరి గెలిచి జవహర్‌లాల్ నెహ్రూ కేబినెట్‌లో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా చేశారు. 1996లో కింజరాపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పని చేశారు. 2012లో కిల్లి కృపారాణి కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా రామ్మోహన్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

News June 10, 2024

వన్నెపూడి ఘటనపై పవన్ సీరియస్..!

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి ఘటనను జనసేనాని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన గెలుపునకు శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దాడి జరగడం సరికాదని, ఈ ఘటన వెనుక ఎవరున్నారు..? అనే దానిపై వివరాలు సేకరించాలని పవన్ ఆదేశించినట్లు నేతలు చెబుతున్నారు. వారంలో పవన్ పిఠాపురం రానున్నట్లు ఇప్పటికే నాగబాబు ప్రకటించారు.

News June 10, 2024

కర్నూలు: తుంగభద్ర నది ఒడ్డున గుర్తు తెలియని మృతదేహం

image

మంత్రాలయంలోని తుంగభద్ర నది ఒడ్డున ఆదివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్సై గోపీనాథ్ తెలిపారు. హెచ్ఆర్‌బీ కళ్యాణ మండపం వెనుక భాగంలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డున రెండు బండరాళ్ల మధ్యలో మృతదేహం లభ్యమైందని చెప్పారు. అతని దగ్గర ఎలాంటి ఆధారాలూ లేవని, ఎవరికైనా తెలిసి ఉంటే వివరాలు తెలియజేయాలని కోరారు.

News June 10, 2024

గుంటూరు: చంద్రబాబు ప్రమాణస్వీకారం..14 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు

image

ఈనెల 12న ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుతుపవనాలు ప్రవేశించిన సమయం కావడంతో భారీ వర్షాలు పడినా ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం అల్యూమినియంతో కూడిన పటిష్ఠమైన షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5ఎకరాల్లో ప్రధాన వేదిక, VIP గ్యాలరీ, మిగిలిన 11.5ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు.