Andhra Pradesh

News June 10, 2024

ఎన్టీఆర్ జిల్లాలో 12వ తేదీన ట్రాఫిక్ మళ్లింపు

image

గన్నవరంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా 12వ తేదీన జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తున్నట్లు SP అద్నాన్ తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలు గామన్ బ్రిడ్జి- దేవరపల్లి- జంగారెడ్డిగూడెం- అశ్వరావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందన్నారు. హనుమాన్ జంక్షన్ నుండి వచ్చే వాహనాలు నూజివీడు- మైలవరం- ఇబ్రహీంపట్నం- నందిగామ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుందన్నారు.

News June 9, 2024

గుంటూరు జిల్లాలో రేపు “కల్కి” ట్రైలర్ ప్రదర్శించేది ఎక్కడంటే..

image

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD” సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. కాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించే థియేటర్ల వివరాలను చిత్ర బృందం ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించింది. గుంటూరు- భాస్కర్, తెనాలి- సంగమేశ్వర, నరసరావుపేట- రవికళా మందిర్, మాచర్ల- శ్రీనివాస, సత్తెనపల్లి- లక్ష్మీ, ఒంగోలు- గోరంట్ల కాంప్లెక్స్, చిలకలూరిపేట- సాయికార్తీక్

News June 9, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో “కల్కి” ట్రైలర్ ప్రదర్శించేది ఎక్కడంటే.!

image

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD” సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించే థియేటర్ల వివరాలను చిత్ర బృందం ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించింది.  విజయవాడ- అలంకార్, సాయిరాం స్క్రీన్స్‌, గుడివాడ- భాస్కర్ కాంప్లెక్స్, ఉయ్యూరు- సాయి మహల్, మచిలీపట్నం- రేవతి & శ్రీ కృష్ణా కాంప్లెక్స్‌, నూజివీడు-ద్వారకా స్క్రీన్ 2 అన్నారు.

News June 9, 2024

నగరి : మోడీకి శుభాకాంక్షలు తెలియజేసిన రోజా

image

నగరి: భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుభాకాంక్షలు తెలియజేశారు. తన సోషల్ మీడియా వేదికగా వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు అన్నారు.

News June 9, 2024

నెల్లూరు: కూలి పనులకు వెళ్లిన మహిళ అనుమానాస్పద మృతి

image

వరంగల్ జిల్లా నెక్కొండలో నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన ఎండీ.మీరా(45) అనే మహిళ మృతి చెందింది. నెక్కొండకు చెందిన తాపీ మెస్త్రి వెంకటేశ్వర్లు వద్ద మీరాతో పాటు ఆమె భర్త ఆరాఫత్ అలీ కూలీలుగా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. స్థానికులు సముదాయించారు. ఆదివారం మీరా మృతి చెందగా, ఆమె భర్త కనిపించడం లేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

News June 9, 2024

విశాఖ: రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

image

విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవి శంకర్ ఆదేశాల మేరకు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్‌లలో సంబంధిత రౌడీ షీటర్లకు పోలీస్ అధికారులు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హద్దు మీరితే ‌పీడీ యాక్ట్ అమలు చేయాల్సి వస్తుందని అన్నారు.

News June 9, 2024

పాకాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి స్పాట్ డెడ్

image

పాకాల మండల పరిధిలోని పెరుమాలగుడిపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని సుమో ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చౌడేపల్లికి చెందిన బన్నీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

అనంత: యాసిడ్ తాగి వ్యక్తి ఆత్మహత్య

image

పుట్లూరు మండలంలో యాసిడ్ తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని సంజీవపురం గ్రామానికి చెందిన ఉమ్మడి ముఖేశ్ కుమార్ రెడ్డి మూడు ఏళ్లుగా అరటికాయల వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టపోయి ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఆదివారం బాత్ రూమ్ క్లీన్ చేసే యాసిడ్ తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News June 9, 2024

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రివర్గం రేసులో ఎవరున్నారంటే..?

image

రాష్ట్ర కేబినెట్‌లో ప్రకాశం జిల్లా నుంచి ఎవరికి చోటు దక్కుతుందోనని చర్చ ప్రకాశం జిల్లాలో విస్తృతంగా నడుస్తోంది. జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను 10 స్థానాల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయ స్వామి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మన జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో కామెంట్ చేయండి.

News June 9, 2024

తొలిసారి ఎన్నికై.. కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని

image

గుంటూరు MPగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలో ఏర్పాటు కానున్న NDA ప్రభుత్వంలో TDP, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో పెమ్మసానికి తొలి జాబితాలో స్థానం దక్కింది. పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.