India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 8 నియోజకవర్గాలు(గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి తిరుపతి జిల్లాలో కలిశాయి) ఉన్నాయి. ఇందులో మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఒక్కరే. జిల్లాలో పలువురు సీనియర్లు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా.. మహిళా కోటాలో ప్రశాంతి రెడ్డికి ఇవ్వాలని వేమిరెడ్డి అనుచరులు కోరుతున్నారు. కేంద్రంలో వేమిరెడ్డికి మంత్రి పదవి రాలేదని.. రాష్ట్రంలో ఆయన భార్యకు ఇవ్వాలని పట్టుబడుతున్నారంట.
మండలంలోని ధర్భగూడెం గ్రామంలో వీర భద్రస్వామి అనే వ్యక్తి ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ మృతుని వివరాలను సేకరిస్తున్నారు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం తరలించారు.
జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ (PG) ఆచార్య, ఎంఏ శబ్ద బోధ, ఎంఏ హిందీ, ఎమ్మెస్సీ యోగ థెరపి, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. CUET ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://nsktu.ac.in వెబ్ సైట్ చూడగలరు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10.
కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రొళ్ల మండలం పిల్లిగుండ్లపల్లికి తేజేశ్వర్ రెడ్డిగా గుర్తించారు. ఆదివారం ఉదయం మెడికల్ కాలేజీలోని రీడింగ్ రూమ్లో చదువుకొని హాస్టల్కి బైక్పై వెళుతుండగా బుదవారంపేట పెట్రోల్ బంక్ సమీపంలో వెనుక నుంచి నందికొట్కూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మక్కువ మండలంలో చోటు చేసుకుంది. సీబిల్లికి చెందిన వడ్డి నాగేశ్వరరావు (53) ఈనెల7 నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం పాతకాముడువలస సమీపంలో బావిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కొడుకు ఫిర్యాదుతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహమూర్తి తెలిపారు.
రొళ్ల మండలం పిల్లిగుండ్లపల్లి గ్రామానికి తేజేశ్వర్ రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటల మధ్యలో మెడికల్ కాలేజీలోని రీడింగ్ రూమ్లో చదువుకొని హాస్టల్కి బైక్పై వెళుతుండగా వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్ రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి మృతి చెందాడు.
మండలంలోని బలుసు గొయ్యపాలెం గ్రామానికి చెందిన సిరి సుష్మ శనివారం నుంచి కనబడడం లేదని ఆమె తండ్రి సువర్ణ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుష్మ శనివారం సాయంత్రం నుంచి కనకబడకపోవడంతో వారి బంధువులు, స్నేహితుల వద్ద కూడా లేదని ఫిర్యాదు చేశారన్నారు. అనంతరం ఘటనపై మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
విజయనగరంలో క్లీన్ స్వీప్ చేసిన కూటమి అభ్యర్థుల్లో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. సీనియర్ విభాగంలో కోళ్ల, కిమిడి పదవి ఆశిస్తుండగా.. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన బేబినాయన, అదితి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. అటు జనసేన ఏకైక మహిళా MLA లోకం మాధవితో పాటు ఎస్టీ కేటగిరీలో గుమ్మడి పేరు జోరుగా వినిపిస్తోంది. మరి వీరిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.
బత్తలపల్లి అడవిలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు మృతిచెందినట్లు ములకలచెరువు SI తిప్పేస్వామి వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. దేవలచెరువుకు చెందిన నరేంద్ర(25), ఎద్దులవారిపల్లెకు చెందిన రాణి(17) ప్రేమించుకున్నారు. కులాలు వేరని పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు శుక్రవారం పురుగు మందు తాగగా, ఎస్ఐ ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు.
ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివ తెలిపిన ప్రకారం పెరుగు పల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడి కత్తి పౌలు అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.