Andhra Pradesh

News September 26, 2024

నేడు జనసేనలోకి బాలినేని

image

మాజీ మంత్రి బాలినేని ఇవాళ జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారీ బహిరంగ సభ పెట్టి తనతో పాటు తన అనుచరవర్గంతో కలిసి జనసేనలో చేరుతానన్నారు. అయితే ప్రస్తుతం ఒంగోలులో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా ఒక్కరే వచ్చి పార్టీలో చేరాలని జనసేన పెద్దలు ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది.

News September 26, 2024

పులివెందుల: వివాహేతర సంబంధం.. రాళ్లతో కొట్టి చంపారు.

image

పులివెందులలో వేముల మండలం చాగలేరుకు చెందిన రామాంజనేయులుపై బుధవారం ఉదయం ఇద్దరు రాడ్లతో తలపై దాడి చేశారు. ఓ మహిళతో రామాంజనేయులు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమె కొడుకులు సందీప్, శివ నాగేంద్ర రామాంజనేయుని తీవ్రంగా గాయపరిచినట్లు సీఐ గంగనాథ్ తెలిపారు. క్షతగాత్రుడిని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు బంధువులు పేర్కొన్నారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.

News September 26, 2024

నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం పర్యటన

image

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రాపూర్ మండలం పెంచలకోన లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు సోమశిల ప్రాజెక్టు పవర్ హౌస్ పాయింట్ నుంచి ఉత్తర కాలువకు నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు.

News September 26, 2024

గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని చెన్నై-కోల్‌కత్తా హైవేపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి వస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు బాపట్ల జిల్లా కోటపాడుకు చెందిన మార్క్(25), మేరీ(38)గా గుర్తించారు. క్షతగాత్రుల్ని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణ కమిటీ

image

విశాఖ <<14184296>>స్టీల్ ప్లాంట్‌<<>>లో ఈనెల 24న జరిగిన ప్రమాదంపై యజమాన్యం ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. పీపీఎం విభాగాధిపతి శంకర్ జీ, ఎస్ఎంఎస్-1కు చెందిన ఆర్పీ సింగ్, ఎస్ఎంఎస్-2 నుంచి శశికాంత్, సేఫ్టీ విభాగం నుంచి ఎం.వరప్రసాద్, క్యూఏ విభాగానికి చెందిన అప్పారావుతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 28 నాటికి కమిటీ నివేదిక అందజేయాలని ప్లాంట్ సీసీఎం ఆర్.మహంతి కోరారు.

News September 26, 2024

చంద్రగిరి కోటకు పూర్వ వైభవం: తిరుపతి కలెక్టర్

image

చంద్రగిరి కోటకు పూర్వ వైభవం తీసుకొస్తామని, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఈ కోటలో వసతులు కల్పించి పర్యాటకులు వచ్చేలా చూస్తామని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. చంద్రగిరి కోటను బుధవారం రాత్రి ఆయన సందర్శించారు. శుక్రవారం సౌండ్ అండ్ లైటింగ్ షోను వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.

News September 26, 2024

మిర్చి యార్డుకు 53,149 బస్తాల మిర్చి

image

మిర్చి మార్కెట్ యార్డుకు నిన్న 53,149 బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 51,038 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, 273, 341. 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8.500 నుంచి రూ.17,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 18,000 వరకు లభించింది. ఏసీ కామద్ రకం మిర్చి రూ.9,000 నుండి 16,500 వరకు లభించింది.

News September 26, 2024

VZM: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

తెర్లాం మండలం అంట్లవారి గ్రామంలో ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై బుధవారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోట రామారావు పొలానికి వెళ్తుండగా విద్యుత్ వైర్లను తాకడంతో షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. సర్వీస్ వైరు తెగిపడడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఎస్ఐ సాగర్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 26, 2024

కరివేన గ్రామంలో గొడ్డలితో దాడి

image

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. కరివేన గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. సతీశ్ అనే వ్యక్తి తన భార్యపై అనుమానంతో చలమయ్యపై కోపం పెంచుకున్నాడు. నిన్న చలమయ్య తన బాబాయ్ ఇంటికి వెళ్లిన సమయంలో సతీశ్ గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో చలమయ్యకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటనారాయణ రెడ్డి తెలిపారు.

News September 26, 2024

NTR: రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి

image

ఏ.కొండూరు అడ్డరోడ్డులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తండ్రి కొడుకులను లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. మామిళ్ల శ్రీనివాసరావు(45), కుమారుడు ప్రసంగి(16) షాపు క్లోజ్ చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.